25, జూన్ 2012, సోమవారం

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: చికిత్స


కులాల గురించి మాట్లాడేవారు ఒక్క విషయం మరిచిపోతున్నారు. గత వందసంవత్సరాలనుంచీ ఉద్యోగం ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? చదువులమీద ఆధారపడి ఇస్తున్నారు. ఒక్కసారి కాలంలో వెనకకు వెళదాం. వెయ్యి సంవత్సరాల క్రితం ఏ ప్రాతిపదికన ఇచ్చేవారు? ప్రతీ ఒక్కళ్ళకీ కులవృత్తులు ఉన్నాయి. వారి తల్లిదండ్రులనుంచి వారసత్వంగా సంక్రమించిన వృత్తి, మరియు చిన్నతనం నుండి తండ్రితో బాటు చేస్తున్న పనిగురించి తండ్రి నేర్పే అనేక వృత్తికిటుకులు ప్రతీ ఒక్కరినీ వారి వారి పనులలో నిష్ణాతులను చేసేది. అందువల్ల చదువుతో సంబంధం లేకుండా ప్రతీఒక్కరికీ పని ఉండేది. మరి ఎందుకు చదువుకొనేవారు? సంస్కారం కోసం చదువుకునేవారు. ఒక శాస్త్రంలో ప్రావీణ్యతకోసం చదువుకునేవారు(Like today’s PhD in a specific field). జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి చదువుకొనేవారు. అందువల్లనే మనదేశంలో ఒక ఆర్యభట్టు, ఒక భాస్కరాచార్యుడు, ఒక సుష్రుతుడు పుట్టారు. అప్పటికాలం ప్రకారం చదువు కేవలం మనిషిని సంస్కరించడానికి లేక ఒక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించడానికి మత్రమే ఉపయోగపడేది. ఇప్పటివలె చదువువల్ల ఉద్యోగం వచ్చే రోజులు కావవి. అందువల్ల కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే చదువుకొని మిగతావారు పట్టించుకొనేవారు కాదు. ఒకళ్ళు చదువుకోకపోవడం వలన ఆ రోజులలో తిండికి ఇబ్బందిపడటం వంటివి జరుగలేదు. ఇవి వెయ్యిసంవత్సరాల నాటి పరిస్థితులు. బ్రిటీషర్లు వచ్చాక పరిస్థితి మారింది. వాళ్ళు పద్దతి మార్చి కేవలం చదువుకున్నవారికి మాత్రమే ఉద్యోగం ఇచ్చేవారు. అందువల్ల సాంప్రదాయకంగా చదువుకోని కుటుంబాలు అలా ఉద్యోగాలలో వెనుకబడ్డారు. ఇవికాక బ్రిటీషర్లు ఇచ్చే విద్య ఖర్చుకో కూడుకున్నది కావడంతో కేవలం ధనవంతులు(పొరపాటున ఎక్కువమంది ధనవంతులు ఒకే కులం వారు అయ్యారు. ఎక్కువమంది మాత్రమే, అందరూ కాదు) మాత్రమే చదువుకొనేవారు. దీనిని మరో ఉదాహరణతో వివరిస్తాను. ఇప్పుడు మనం డబ్బును కాగితాల రూపంలో వాడుతున్నాం. హఠాత్తుగా Government of India అవన్నీ వాట్టి కాగితాలే, వాటికి విలువలేదు, ఇకనుంచి కరెన్సీ మొత్తం గవ్వలరూపంలో జరగాలి అని అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు బాగా Black Money ఉన్నవారందరూ వట్టి వెధవలయిపోతార్. అప్పుడు ఎవరివద్దనయితే ఎక్కువగా గవ్వలు ఉంటాయో వాడే ధనవంతుడు. మనకు సరిగ్గా అదే జరిగింది. తరతరాలనుంచీ చదువుకొనేవారు ముందుకుసాగిపోయారు, అది అలవాటులేని వాళ్ళు అందుకోలేక పోయారు. ఉద్యోగం వచ్చే పరిస్థితి మారింది. అదే విధంగా మారిని పరిస్థితులగురించి బాగా ప్రచారం చేసి అందరినీ ఇందుకు తగ్గట్లుగా ఉద్యక్తులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కాని అప్పటి ప్రభుత్వం బ్రిటీషువారిది, వారికి అంత తీరిక ఎక్కడిదీ, దేశాన్ని దోచుకోవడానికే సమయం సరిపోలేదు వారికి.

ఇంతవరకూ నేను భారతదేశంలో వర్ణవ్యవస్థ నుంచి కులవ్యవస్థగా ఎలా పతనమయ్యిందో వివరించాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనం ఏమి చేస్తే ఈ కులవ్యవస్థను పారద్రోలగలమో వివరిస్తాను. ఇంతకన్నా ముందు నేను ఒక విషయాన్ని గుర్తుచేయదలిచాను. సమాజం ఎప్పుడైనా బాగా చదువుకున్న అతి తక్కువ జనభాను అనుసరిస్తారు. అలా అంబేద్కర్ గారు మొదలుపెట్టినది అలా కొనసాగలేదు, ఇప్పటికి కులవ్యవస్థ్ తగ్గకపోగా ఇంకా వికృతంగా తయరయ్యింది. దీనికి కారణం ఏమిటి? ఒకసారి TV9లో ఒక ఫ్యాక్సనిస్టు తాను ఇరవైసంవత్సరాలుగా గొడవలలో మునిగిఉన్నానని, తనకు తన శత్రువుకు కూడా ఆ జీవితం ఎంతమాత్రం నచ్చకపోయినా తాము అలా జీవించాల్సివస్తుందని వాపోయారు. దీనికి కారణం ఎవరు? సమాధానం మన రాజకీయనాయకులు.

అవును మనం మన మధ్య, మనలో ఇది మన కులం అని చెప్పే ప్రతీ వస్తువునూ, ప్రతీ గోడను పడగొట్టగలిగితే ఈ కులవ్యవస్థను మనం పారదోలవచ్చు. దీనికి మనం మొదటా చేయాల్సినది చాలా చిన్నపని. అది ఏమిటంటే చరిత్రను మార్చి రాయడం. నేను ఇంతవరకూ రాసిన చరిత్ర కాకుండా, అసలు కులవ్యవస్థ చాలా అద్భుతమైనదిగా చిత్రీకరించాలి. అసలు కులవ్యవస్థ జరుగలేదనిపించేలా మన సామాన్య చరిత్ర పుస్తకాలు తయారుచేయాలి. ఎవరికైనా అనుమానం రావచ్చు, ఇది మన భావి తరాల వాళ్ళకి అబద్దం చెప్పడంతో సమానం కదా అని, పరవాలేదు మొదట అలా చేస్తే మన భావితరం తాము తక్కువవరమనే భావనలో (Inferiority Complex) నుంచి బయటపడతారు. అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మన గొప్పతనమంతా మన వారసత్వసంపదలోనే ఉంది. బ్రిటీషువాళ్ళు అందుకే మన వారసత్వసంపదను మనది కాకుండా చేసారు ఆర్య దండయాత్ర సిద్దాంతం (Aryan Invasion Theory) ద్వారా. నాకు ఇప్పటి తరంలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనబడుతోంది. దానికి ఉదాహరణ, ఇంతవరకు హిందూమతం మరియు భారతదేశం ఇంత అభివృద్ది చెందడానికి కారణమయిన వర్ణవ్యవస్థ ఇవ్వాళ అందరిచేత నిందింపబడుతోంది తన తప్పులేకుండా. ఇవ్వాళ అన్నికాలాల్లోనూ వర్ణవ్యవస్థకు ఎంతమంది స్థిరంగా మద్దతివ్వగలరు? అగ్రకులాలవారు తాము నిమ్నకులాలవారిపై చాలా అరాచకాలు చేసామని బాధపడుతున్నారు (కనీసం అలా నటిస్తున్నారు మరియు పిల్లలకు అలా నేర్పిస్తున్నారు. దీనిలో సినిమాల పాత్రకూడా ఎక్కువే). ఒక బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణుడిని అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి మనది ఎందుకంటే అతను ఒక కులపిశాచని అందరూ తిడతారని భయం. ఇది మారాలి. అందరూ ఒకటేననే భావం కలగాలి. ఈ ఇన్పీరియారిటీ కాంప్లెక్స్ పోవడానికి నేను చరిత్రను మార్చి చెప్పమన్నాను. అది కేవలం సామాన్య చరిత్ర అంటే పదవతరగతి వరకూ చెప్పే చరిత్ర. చరిత్రను చదివేవారికి నిజమయిన చరిత్రను పరిచయం చేయాలి. ఇది నేను రాసిన చరిత్రే, కాదని ఎవరినైనా వివరించమనండి చూద్దాం. కానీ ఆ చరిత్ర నిష్పక్షపాతంగా ఉండాలి, హిందూ వ్యతిరేఖిగా ఉండకూడదు. ఎందుకంటే హిందూ మతాన్ని ప్రేమించలేనివాడు భారతదేశాన్ని ప్రేమించలేడని నా ఉద్దేశం. ఇక్కడ హిందువంటే నా దృష్టిలో భారతదేశంలో పుట్టిన ఏ మతాన్నయినా పాటించేవ్యక్తి. చరిత్రను ఇలా మార్చిరాయడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని అనుమానం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనకు చెప్పిన చరిత్రలో తొంభై అయిదు శాతం అబద్దాలే. దీని వలన మనకు మన నిజమైన చరిత్ర తెలియదు, అలాగే మనం ఈ కులవ్యవస్థను చరిత్రలోంచి (చరిత్ర పాఠాలలొనుంచి) తొలగిస్తే మనం ఈ వ్యవస్థను మన నుంచి సగం పారద్రోలగలిగినట్లే.

మనకు మన కులాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్న మరో దుర్వవస్థ రిజర్వేషనులు. కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషనులను ఇస్తే నిజమైన పేదలకు చాలా ఉపయోగం. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. ఈ వ్యవస్థ మన సమాజాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తోందో మనకు తెలుసుకాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు.

ఇవికాక మన కులాన్ని మనకు అనుక్షణం గుర్తుచేసేవి కులసంఘాలు. వీటివల్ల జరుగుతున్న కీడు అంతా ఇంతా కాదు. నేను కులసంఘాలు ఇచ్చే స్కాలర్షిప్పులు గురించి మాట్లాడుతున్నాను. నిజమే. వాళ్ళు ఇలా ఇవ్వడం వలన కనీసం కొంతమందైనా (నిజమైన) పేదలకు కొంత సహాయం జరుగుతోన్న మాట నిజమే. కొంతమందైనా పేదవిద్యార్థులు చదువుకోగలుతున్నారు. కానీ దీనివల్ల ఆ పేద విద్యార్థి ఏమి అనుకుంటాడు? నాకు ప్రభుత్వం ఏమీ సహాయం చేయనప్పుడు నాకులపు వాళ్ళు ఎంతో మేలు చేశారని అనుకుంటాడు. దీనివల్ల అతనికి ప్రభుత్వం మీద వ్యతిరేఖత, తన కులం మీద విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. అతనిలో లేని కులకాంక్ష ప్రజ్వల్లితుంది. ఇలా కులం పేరు మీద ఇచ్చే స్కాలర్షిప్పులు మరియు కులం పేరు మీద ఇచ్చే రిజర్వేషనులకు తేడా లేదు. అంతిమంగా దేశం నష్టపోతోంది.

నాకు నేను ఇలా వ్రయడం వల్ల నన్ను ఒక హిందూ అతివాదిగా అనేక మంది అనుకుంటారు, దానివల్ల నా మాట ఎవ్వరూ వినరని కూడా నాకు తెలుసు. కాని నేను చెప్పేది ఒక్కటే. ఇలా ఎన్నాళ్ళు? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పరవాలేదు, కానీ ఒక్కసారైనా నిజం చెప్పాలి. ఇలా నాలా చెప్పేవాళ్ళనందరినీ పట్టించుకోకుండా ఉండి మీడియా మనకు చెబుతున్న అబద్దాలనే నమ్మితే ఏదో ఒక రోజు మనబ్రతుకులే అబద్దంగా మారిపోతాయి. 


 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post_16.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి