25, జూన్ 2012, సోమవారం

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: నాలుగవ భాగం


క్రితం టపాలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. వాటిలో నేను కొన్నింటికి జవాబులు చెబుతాను. మెగస్తనీసు కాలం తరువాత భారతదేశం గురించి వివరంగా రాసిన మరో వ్యక్తి చైనీసు యాత్రికుడు హుయాన్ సాంగ్. అతని రాతలలో కులవ్యవస్థ గురించి ఏమీ రాయలేదు, కానీ అప్పటికి భారతదేశంలో బౌద్దమతం పూర్తిగా అంతమయ్యింది. ఇక్కడి నుంచి కులవ్యవస్థ పతనమవ్వడం మొదలయ్యింది. అది భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఎందుకంటే ఉత్తరభారతదేశంలో 1198లో మూల్ రాజ్ ఆనంద్ అనే బాలుడి తల్లి (ఆమే ఆ రాజ్యానికి సైన్యాధిపతి కూడా) ముస్లిము సైన్యాన్ని యుద్దంలో ఓఢించి ముస్లిము సైనికులను హైందవ సమాజంలో కలుపుగోలిగింది. అప్పటికి ఇంకా బానిసవ్యవస్థ భారతదేశంలో లేదు కాబట్టి వారిని బానిసలుగా అమ్మలేదని మనం నిర్ధారణకు రావచ్చు. దీనిని బట్టి పదవ శతాబ్దానికి, క్రీస్తుకు మూడు శతాబ్దాల ముందు దానికి సమాజంలో పెద్దగా మార్పులు లేవని మనం రూఢి చేసుకోవచ్చు. పదవశతాబ్దం వరకూ దాదాపు హిందువులే (హిందువులంటే నా ఉద్దేశంలో బౌద్దులు, జైనులు, శైవులు, వైష్ణవులు, శక్తిని పూజించేవారు, ద్వైతులు, అద్వైతులు, చార్వకులు etc. ఇలా భారతదేశంలో పుట్టిన ఏ మతాన్ని ఆచరించినా నా దృష్టిలో వారు హిందువులే. దీని గురించి మరో టపాలో వివరిస్తాను.) భారతదేశాన్ని పాలించారు. పాలించేవారు, పాలించే పద్దతులలో పెద్దగా మార్పులు లేవు కాబట్టి సమాజంలో కూడా పెద్దగా మార్పులు లేవు. కానీ పదవశతాబ్దం నుంచి ఇరవైశతబ్దానికి వచ్చేసరికి ఏడుకులాలనుంచి లెక్కలేనన్ని కులాలు వచ్చిపడ్డాయి సమాజంలో. ఎలా జరిగింది ఇది అంతా? ముందు కాలానికి ఇప్పటికి తేడా ఏమిటి? గమనిస్తే బయటినుంచి దాడులు విపరీతంగా పెరిగాయి. అంతర్గతంగా జరిగే యుద్దాలకు బయటినుంచి వచ్చిన ఇతర మతస్థులతో జరిగే యుద్దాలకు చాలా తేడా ఉంది. ఉదాహరణకు ఒకటి. ఇక్కడి యుద్దాలలో ఎవరు గెలిచినా సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు, కానీ ముస్లిముల్ వచ్చాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. వారు గెలిస్తే ఇక్కడి ప్రజలను బానిసలుగా అమ్మేవారు. అందుకే సమాజంలో చాలా మార్పులు అనివార్యమయ్యాయి.
 

కొంతమంది హిందూ మతం గురించి చెప్పే మరో విషయం ఏమిటంటే హిందూమతం మార్పును స్వీకరించదని. వారికి నేను చెప్పబోయేది చెంపపెట్టు లాంటిది. కొన్ని చోట్ల కులవ్యవస్థ చాలా దారుణంగా పతనమయ్యింది. దీనికి వ్యతిరేఖంగా కులవ్యవస్థలో మార్పును కోరుతూ సమాజంలో కొందరు సమాజాన్ని బాగుచేయడానిక్ ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించడం రెండు రకాలు. ఒకటి హింసాత్మకం, రెండు అహింసాత్మకం. హింసాత్మకంగా జరిగిన పోరాటం మన పలనాటియుద్దం. మార్పును వ్యతిరేఖించే నాగమ్మ వర్గానికి మార్పును కోరుకుంటున్న బ్రహ్మనాయుడి వర్గానికి మధ్య జరిగిన యుద్దం అది. మనకు సినిమాలో చూపించినట్లు కాకుండా నిజమైన యుద్దంలో బ్రహ్మనాయుడి వర్గం పరాజయాన్ని పొందారు. మలిదేవనాయుడు, నగమ్మ కులాల్లో మార్పును వ్యతిరేఖించారు, నలగామనాయుడు మరియు బ్రహ్మనాయుడు కులాల్లో మార్పును కోరారు. ఈ యుద్దం వల్ల జరిగినది ఏమిటంటే ఇరువర్గాల్లో సైనుకులు మొత్తం చనిపోయారు. ఈ యుద్దం వల్ల చాలుక్యుల వంశం త్వరగా అంతమయింది. ఈ కథను మనకు హరికథలుగా మాదిగలు మాత్రమే వినిపిస్తారు, కానీ అన్నిరకాల హరికథలు వినిపించే బ్రాహ్మణులు ఈ కథను మనకు వినిపించరు. శ్రీనాథుడు బ్రాహ్మణుడు అయినా ఈ చరిత్ర గ్రంథస్తం చేసాడు. చూసారుగా తేడాలు, బ్రాహ్మణులలో. ఒకరు మనకు ఈ కథను చెప్పరు, మరొకరు గ్రంథస్థం చేసారు. మార్పును వ్యతిరేఖించే వారు ఎప్పుడయినా ఉంటారు, అదే జరిగింది అప్పటి సమాజంలో.
 

ఇప్పుడు మనం అహింసాత్మకంగా మార్పును కోరిన ఉద్యమాన్ని చూద్దాం. హింస మన కోస్తాంధ్రలో జరిగితే, అహింసాయుత విధానం మన పక్కనే ఉన్న కర్ణాటకలో జరిగింది. అది పన్నెండవ శతాబ్దం. కులవ్యవస్థ ఉన్న పరిస్థితి నచ్చక బసవన్న అనే ఒక బ్రాహ్మణుడు వీరశైవమనే కొత్త మతాన్ని ప్రారంభించాడు. తన మతంలో అందరూ సమానమేనని చెప్పాడు. చనిపోయిన వాళ్ళను హిందువులలా దహనసంస్కారాలతో కాకుండా పూడ్చిపెట్టమని చెప్పాడు. కొన్నాళ్ళు బాగానే సాగింది. కానీ తరువాత వీరశైవులు ఒక కులంగా మారిపోయారు. అంతే కాకుండా వారిలో ఉపకులాలు కూడా వచ్చాయి. మరి ఈ రెండు పద్దతులవల్ల మనసమాజానికి మేలు జరిగిందా లేక కీడు జరిగిందా? రెంటిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా పనిచేయాలి, కానీ మనకు ఇరవై శతాబ్దంలో సమాజాన్ని చూస్తే పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనబడదు. ఎందుకు ఇలా జరిగింది? మధ్యలో కొన్నాళ్ళు ముస్లిములు పాలించారు, తరువాత విజయనగర సామ్రాజ్యంతో ఉన్నత స్థాయిని అందుకున్నాము, మళ్ళీ ముస్లిముల చేతిలోకి పాలన వెళ్ళాక పరిస్థితి మామూలు అయ్యింది. విజయనగర సామ్రాజ్యం ఆంధ్రను పాలించినప్పుడు మనం సాంస్కృతికంగా ఎంత బాగా అభివృద్ది చెందామో మనకు తెలుసు. శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని మనకు చరిత్ర చెబుతున్న సత్యం. దీనిని బట్టి పలనాటి యుద్దం తరువాత సమాజంలో చెడు బాగా తగ్గిందని మనం అర్థం చేసుకోవచ్చు.

ముస్లిముల పాలన గురించి ఇతరులు ఏమి చెప్పారో చూద్దాం. మనకు 712 ADలో మహమ్మద బిన్ ఖాసీం నుంచి ముస్లిముల దండయాత్ర మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ముస్లిము దండయాత్రలు 638 AD లో మొదలయ్యాయి, కానీ వారికి చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం 712 తరువాతే వచ్చాయి. కొన్నాళ్ళు బాగానే సాగినా తరువాత ఆ దండయాత్రలు ఆగిపోయాయి. (ముస్లిము దండయాత్రల గురించి తరువాతి టపాలలో వివరిస్తాను) తరువాత 990 AD లో మళ్ళీ దండయాత్రలు మొదలయ్యాయి, అవి మహమ్మద్ గజినీ కొడుకు మరణంతో ఆ దండయాత్రలు ముగిసాయి. తరువాత చెప్పుకోదగ్గ దండయాత్రలు 1191లో మహమ్మద ఘోరీతో మొదలయ్యాయి. ఇక ఆ దండయాత్రలు ఆగలేదు. అవి భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించేంతవరకూ విశ్రమించలేదు. భారతదేశాన్ని సైనికంగా ఎనిమిది వందల సంవత్సరాలకుపైగా అక్రమించుకోగలిగినా హిందువులను పూర్తిగా ముస్లిములుగా మార్చలేకపోయారు. ఇది వారి దయవలన ఎంతమాత్రం కాదు, ఎందుకంటే వారికి దయ అనేది తెలియదు కాబట్టి. ఇస్లాము ప్రవేశించిన ఇతర దేశాలను గమనిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది.

ఫెర్నాంన్డ్ బ్రౌడెల్ తన పుస్తకంలో(1) “భారతదేశంలో ముస్లిముల పాలన చాలా హింసాత్మకమయినది, ముస్లిములు ప్రజలను విపరీతమయిన భయాందోళనలకు గురిచేస్తూ తప్ప దేశాన్ని పాలించలేకపోయారు. కౄరత్వం అనేది రోజూవారీ కార్యక్రమం అయిపోయింది. తగులబెట్టడం, సామూహికంగా ప్రజలను ఉరితియ్యడం, ప్రజలను శిలవేయడం, చర్మాన్ని తొలిచివేయడం, కొత్త కొత్త రకాలుగా ప్రజలను చంపడం వంటివి దైనందిక వ్యవహారమయిపోయాయి. హిందువుల గుడులు నిర్మూలించి మసీదులు కట్టారు. అప్పుడప్పుడూ హిందువులను ముస్లిములుగా మార్చేవారు. ఎక్కడైనా ప్రజలు తిరగబడితే అక్కడి ప్రజలను దారుణంగా హింసించి చంపేవారు, ఊళ్ళకు ఊళ్ళు తగులబెట్టేవారు, పల్లెటూర్లను ఎప్పుడు ఎండబెట్టేవారు, మగాళ్ళను చంపేవారు, ఆడవాళ్ళను బానిసలుగా అమ్మేవాళ్ళు”, అని రాసాడు. విల్ డ్యూరాంట్ తన పుస్తకంలో(2) “భారతదేశంలో ముస్లిముల దండయాత్ర బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతమయినది. అది ఒక నిరాశాజనకమైన కథ, ఎందుకంటే ఇక్కడి నాగరికత చాలా నాజూకైనది, ఇక్కడి స్వేఛ్ఛాస్వాతంత్రాయాలు ఎప్పుడైనా బయటినుంచీ లోపలినుంచీ విపరీతంగా పెరిగిపోతున్న అనాగరికుల చేత ఎప్పుడయినా నిర్మూలించబడతాయి”, అని రాసాడు. వీళ్ళిద్దరూ క్రైస్తవులు మరియు పాశ్చాత్యులు. వీరి మాటలలో అప్పటి హిందూసమాజం ఎలాంటి పరిస్థితులలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పటి కులవ్యవస్థకు కారణం ఖచ్చితంగా ఆ దండయాత్రలు, మరియు అప్పటి హిందూ సమాజం అనుభవించిన యాతనలు. వర్ణవ్యవస్థ పతనమవ్వడం అలా మొదలై బ్రిటీషర్లు వచ్చాక బాగా ఊపందుకుంది.

జయచాంద్ విద్యాలంకార్ తన “ఇతిహాస్ ప్రవేశ్”లో ఇలా వ్రాసాడు, “కులవ్యవస్థ మొదలైనప్పుడు కాస్త Flexibility ఉండేది, కానీ అది కాలం ముందుకు సాగడంతో పోయింది. 1000 AD నుంచి కులవ్యవస్థలో Flexibility తగ్గి పూర్తిగా జడపదార్థంలా తయారయింది. దీనికి కారణం ముస్లిములు సాగించిన హింసాకాండ. వారు జరిపిన హత్యలు, మానభంగాలు, దేశాన్ని దోచుకోవడం ద్వారా ప్రజలను బాగా భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్నారు.” ముస్లిముల దండయాత్రలు ఎంత ఎక్కువగా ఉండేవంటే గుజరాత్ లోని గవల్గరాజ్యంలో “తురుష్కదంద” అనే ప్రత్యేక పన్ను విధించారు. అది కేవలం ముస్లిములను ఎదుర్కోవడానికి మాత్రమే వాడేవారు. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పన్నెండవ శతాబ్దాంతానికి ఢిల్లిలో ముస్లిములు పాగావేయగలిగారు. వాళ్ళు అందరిమీదా విపరీతమైన పన్నులు వేసేవారు. జిజియా పన్ను అలాంటివాటిల్లో ఒకటి. ఆ పన్ను ఎలాంటిదంటే శాంతి సమయాల్లో 80% గానూ యుద్దసమయాల్లో 150% గానూ ఉండేది. ప్రజలను ముస్లిములుగా మారేందుకు ప్రోత్సహించడానికి గానూ ముస్లిములు ఈ పన్నుల నుంచి బౌద్దులకు మరియు బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చారు. పాలకులకు పాలితులకు మధ్య బాగా దూరం పెరిగింది. ఒకప్పుడు సమాజానికి కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చగలిగిన వర్ణవ్యవస్థ Flexibilityను కోల్పోయి భయంకరమైన వ్యవస్థగా దిగజారిపోవడం మొదలయ్యింది.

బ్రిటీషర్లు వచ్చిన తరువాత హిందూ మతం ఇంకా ఎలా పతనమయ్యిందో వివరిస్తాను. బ్రిటీషర్లు ఊరిలో బాగా ధనవంతుడైన వ్యక్తిని పన్నులు వసూలుచేయడానికి ఉపయోగించుకొనేవారు. అలాంటి వ్యక్తిని “చౌదరి” అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన కులం ఉంది. మనం గమనిస్తే చౌదరి అని పేరులో ఒక భాగం కలిగిఉండేవాళ్ళు మనకు ఉత్తరభారతంలోనూ, బంగ్లాదేశ్ లోనూ, చివరికి పాకిస్తానులో కూడా కనిపిస్తారు. భాషాభేదాల వల్ల కూడా కొన్ని కొత్త కులాలు ఆవిర్భవించాయి. ఉదాహరణకు ఉపాధ్యాయులను అప్పటి సమాజంలో అయ్య వారు, అయ్యగారు అని పిలిచేవారు. అది తమిళనాడులో అయ్యంగార్ గా మారింది. ఇప్పుడు వారు తమిళనాడులో బ్రాహ్మణులలో ఒక ఉపకులంగా ఉంటున్నారు. రెడ్డి అనేది అప్పట్లో ఊరిలో బాగా ధనవంతమైన వ్యక్తిని పెద్దిరెడ్డి అని పిలిచేవారు. ఆ పిలువు ఒక పదవిగా భావించేవారు. కానీ కాలక్రమంలో రెడ్డి అనేది ఒక కులంగా రూపాంతరం చెందింది.

కులం అనేది హిందువులకు మాత్రమే పరిమితమని మనందరి దురభిప్రాయం. జైనులలో కూడా కులాలు ఉన్నాయి. హిందూ మతం నుంచి ఇతర మతాలలోకి మారినవారు ఇంకా కులాలను ఆచరిస్తున్నారు. అందుకు ప్రబల ఉదాహరణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S. రాజశేఖరరెడ్డిగారు. ఆయన క్రైస్తవుడు, కానీ ఇంకా పేరులో రెడ్డిని ఉంచుకున్నారు. అటు రెడ్డిలను ఇటు క్రైస్తవులను ఆకర్షించగలనని ఆయన భావించి ఉండవచ్చు. మళ్ళీ భారతదేశం దాటి ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడినవారు కులాలను పట్టించుకోరు. దానికి అమెరికా, బ్రిటన్ లలో ఎన్నో సంవత్సరాలనుంచి ఉంటున్న ప్రవాస భారతీయులు ఉదాహరణ. దక్షిణాఫ్రికాలో భారతసంతతి జనాభా విపరీతంగా ఉంటారని మనకు తెలుసు. అది గాంధీ సమయం నుంచి ఉందని మనకు తెలుసు. కానీ అక్కడ ఎవరూ ఇలా కులాలను పట్ట్ంచుకోరే. హిందూమతంలో, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో మరో చోటకూడా ఇలా కులాలను పాటించేవారు. అది అర్థాశిర్ అనే రాజు పర్షియాను ఏకం చేసిన కాలం. పర్షియా చరిత్రలో చెప్పుకోదగ్గ వంశాలు రెండు. అర్థాశిర్ స్థాపించినది రెండవది, మరియు అధికకాలం మనగలిగినది కూడా. ఇస్లాము పర్షియాలో అడుగుపెట్టేవరకూ ఆ వ్యవస్థ కొనసాగింది. ఆ వ్యవస్థ ఇలా సాగుతుంది. The four segments of society are Soldiers, Scribes, Priests and Commoners. దాదాపుగా వర్ణవ్యవస్థను పోలిఉంది ఆ వ్యవస్థ. ఇవి అన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఒకటే, కులవ్యవస్థ అనేది కేవలం హిందూ మతానికి మాత్రమే కాపీరైటు అయిన వ్యవస్థకాదు. సామాజికంగా జరిగే మార్పులకు ఒక మతాన్ని బలిపెట్టడం ఎంతవరకూ సమంజసం? ఎంత గొప్పగా ప్రారంభమయిన వ్యవస్థ అయినా కుళ్ళిపోవలసిందే, కానీ అప్పుడప్పుడూ గొప్ప గొప్ప యోగులు వచ్చి సమాజాన్ని బాగుచేస్తారు. బుద్దుడు, (వీరశైవమతాన్ని ప్రారంభించిన)బసవన్న, బ్రహ్మనాయుడు, శంకరాచార్య వంటి వారు ప్రతీ సమాజానికి అవసరం. కులవ్యవస్థ బ్రాహ్మణుల వల్ల వచ్చింది అనడం కేవలం చరిత్ర అస్సలు తెలియని (పిచ్చిపట్టిన కమ్యూనిస్టు) మేథావులు మాత్రమే అనగలరు. కత్తి మహేష్ కుమార్ గారూ, మీకు నా టపాలలో ఎక్కడయినా తప్పు కనబడితే చెప్పగలరు. మీరు కులవ్యవస్థకు వ్యతిరేఖి అని తెలుసు. మీరు నా టపాలకు ఏమి సమాధానం చెబుతారో చూస్తాను. మీరు ఒకసారి మీ టపాలో అన్ని కులాలవారు స్వతంత్రులని, అన్ని కులాల మధ్య కొన్ని similar rituals ఉన్నాయనీ చెప్పారు. నేను అదే వక్యాన్ని ఇలా చెబుతాను, అన్ని కులాలూ ఒకే rituals పాటిస్తారు కొన్ని తప్ప. అవి కులానికి కులానికి మధ్య మార్పులు. ఒక చిన్న ఉదాహరణ. మొదట వ్యవసాయానికి యంత్రాలు చేసేవారు ఒక కులస్థులు. వారు చెక్క మరియు ఇనుముతో యంత్రాలు చేసేవారు. తరువత వారిలో రెండు కులాలు వచ్చాయి, ఒకరు చెక్క యంత్రాలు, మరొకరు ఇనుముతో యంత్రాలు తయారుచేసేవారు. ఇనుముతో చేసేవారు ఇంకొన్ని రకాలు, ఒకరు వ్యవసాయానికి పనిముట్లు చేసేవారు, మరొకరు ఆయుధాలు తయారుచేసేవారు. అలాగే చెక్కపని చేసేవారు కూడా. ఒకరు వ్యవసాయానికి పనిముట్లు చేసేవారు మరొకరు పడవలు, ఓడలు తయారుచేసేవారు. అలా కులాలు విడిపోయాయి. మొదట సాయానికి యంత్రాలు చేసేవారు అందరూ ఒకేరకమయిన పద్దతులు పాటించేవారు. పనులలో తేడాలవల్ల ఆచరణ పద్దతులలో మార్పులు వచ్చాయి. అలా కులాల్లో పద్దతులలో పైపై మార్పులు ఉన్నా లోలోపల అన్నీ ఒకే చోటినుండి మొదలయ్యాయి. అన్ని కులాల్లోనూ పెళ్ళి జరిగేటప్పుడు తాళి ఖచ్చితంగా కడతారు, కానీ తమిళుల తాళి ఒకరకంగా, తెలుగువారి తాళి మరో రకంగా ఉంటుంది. అది భాష మరియు సాంస్కృతికంగా వచ్చిన మార్పే కానీ రెండు రాష్ట్రాలూ రెండు వేరే దేశాలనుంచి వచ్చినందువల్ల కాదు. ఇలాంటివి మనం అల్లోచిస్తే ఎన్నో గమనించవచ్చు. ఇవి అన్ని ఒకే సంస్కృతి నుంచి మారిన పద్దతులు కానీ వివిధ పద్దతులు ఒక తాటిపైకి వచ్చినవి కావు.

(ఇంకా ఒక టపా నేను బాకీ ఉన్నాను.)

వనరులు
1. Fernand Baurdel, A History of Civilizations (Penguin 1988/1963, p.232-236)
2. Will Durant, Story of Civilization, vol.1, Our Oriental Heritage, New York 1972, p.459


 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post_13.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి