28, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఎక్కడైనా మహాసముద్రం ఇంకిపోతుందా?!!!


మహాసముద్రం ఇంకిపోతుందా?
గీతాంజలి మూర్తి


'ఎక్కడ ఆత్మ గౌరవం నిర్భయంగా తలెత్తుకుని తిరుగుతుందో 
ఎక్కడ లోకం సంకుచిత అడ్డుగోడలతో విచ్ఛిన్నం కాదో
అట్టి సర్వస్వతంత్ర స్వర్గంలోకి, 
తండ్రీ, నా దేశాన్ని నడిపించు'

- రవీంద్రనాథ్ టాగూర్ 'గీతాంజలి'

'ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉండాలి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేనందువల్లే భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడ్డాయని' కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం'లో అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు అవగాహనతో చేసిన ఆరోపణ. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయ సామాజిక రంగాలలో వలే ప్రజాస్వామ్యం ఉండటమేమిటి? మనమేదో కొత్త భావాలు, 'పదజాలం' నేర్చుకున్నాం కాబట్టి, వాటిని అలౌకికమైన ఆధ్యాత్మిక రంగానికి పులమటమే తప్పు. అయినా హిందూ వ్యవస్థలో, మానవులందరూ సమానమేననీ, అందరికీ ఆ భగవంతుని దృష్టిలో సమానావకాశాలు ఇవ్వబడినాయనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

దార్శనికులైన భారతీయ ఋషులు సమస్త మానవ జాతి సుఖ సంతోషాలతో ఏ భేద భావం లేకుండా జీవించాలనీ, పశుపక్ష్యాదులను సైతం కరుణతో చూడాలనీ బోధించారు. వారి స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ 'సత్యాహింసలను' ఉద్యమ సాధనలుగా చేసుకొని దేశ స్వాతంత్య్రం సాధించారు. అయితే పూర్వకాలంలో అజ్ఞానంతో, అహంభావంతో కొందరు మూర్ఖులు, కొన్ని మూఢాచారాలతో సమాజంలో ఎక్కువ తక్కువలను పాటించిన మాట వాస్తవం. అయినా కాలక్రమంలో ఇప్పుడు చాలా మంది అవన్నీ వదిలివేసి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఇష్టంగా ఆచరణలో పెడుతున్నారు.

ఆధునిక జీవన విధానంలో, విప్లవాత్మక మార్పులు వచ్చి, సమాజంలో, కులాంతర, మతాంతర వివాహాలు కూడా చాలా అసాధారణంగా జరిగిపోతున్నాయి. పెద్దలు కూడా విశాల హృదయంతో వాటిని ఆమోదించి, పరిణతి చెందిన మనసులతో అందరూ కలిసి మెలసి ఉండటం చూస్తున్నాం. హిందువులలో ఇలా విప్లవాత్మక మార్పులు నిశ్శబ్దంగా చోటుచేసుకోవటం గమనార్హం. ఇదొక గొప్ప మార్పు. ఇలా మార్పు జరిగింది. ఇంకా జరుగుతోంది. దీనిని ఐలయ్య గుర్తించి హర్షించరా? అంతేకాక అన్ని దేవాలయాలలోనూ, పరిపాలనా మండలులు చాలావరకు బ్రాహ్మణేతరుల చేతిలోనే ఉన్నవి కదా.

చాలాచోట్ల అన్ని కులాల, వర్గాల ప్రజలకు దేవాలయ ప్రవేశం నిరాటంకంగా హాయిగా జరుగుతోంది కదా. ఈ మధ్య మా తెనాలిలో శ్రీశ్రీ దండి స్వాముల వారి ఆధ్వర్యంలో సహస్ర హోమయాగం జరిగింది. అందులో అన్ని కులాల వారికీ వర్గాల వారికీ ఏ భేద భావం లేకుండా, ఆ యజ్ఞం స్వయంగా జరుపుకునే అవకాశం ఇవ్వబడింది. ఎందరో, ఎవరెవరో చుట్టు పక్కల ఊళ్ళ నుంచీ స్వేచ్ఛగా వచ్చి మహదానందంగా ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. తరువాత, అందరికీ సమానంగా ప్రసాదం (భోజనాలు) అందజేయ బడినాయి. నేను ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందించాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు కుల భేదం లేకుండా అనేక చోట్ల జరుగుతున్నది వాస్తవం.

మరొక అద్భుత మార్పు. డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయుని, దార్శనికుని నేతృత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి కలిగించిన రిజర్వేషన్ల వలన అన్ని రకాల క్రింది వర్గాల వారికి విద్య/ఉపాధి ఇతర రంగాలలో అవకాశాలు మెండుగా ఇవ్వబడుతున్నాయి కదా. అన్ని రకాల, రాజకీయ పరిణతి వలన వివిధ అత్యున్నత రాజ్యాంగ పదవులను సైతం ఆ వర్గాల వారు అలంకరించటం కూడా వాస్తవమే కదా. నాకైతే ఈ ప్రగతిశీల పరిణామాలు ఎంతో సంతోషదాయకంగా ఉన్నవి.

ఇలా అన్ని భేద భావాలూ పోగొట్టుకుని అందరూ సమానావకాశాలతో ముందుకు సాగుతున్న ఈ రోజులలో ఐలయ్య లాంటివారు పనిగట్టుకొని కులద్వేషాన్ని రెచ్చగొట్టే రాతలు రాయటం ఎంత మాత్రం సబబు కాదు. అంతే కాదు ఎంతమందో మఠాధిపతులు, పీఠాధిపతులుగా కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. నేను శిష్యుడిగా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ (రాంచి)లో నిర్వాహకులు (అధిపతులు) దాదాపు అందరూ బ్రాహ్మణేతరులే. చక్కగా సన్యాసం పుచ్చుకొని, అందరికీ యోగ సాధనలను శాస్త్రీయంగా నేర్పుతున్నారు.

ఆశ్రమంలో, నాకు దీక్షనిచ్చిన సాధువు, హిందూ మతాన్ని ఇష్టంతో స్వీకరించిన ఒక విదేశీ సాధువు అంటే నమ్ముతారా? ఇది నా అనుభవంలో జరిగిన వాస్తవం. ఈ వాస్తవ నేపథ్యంలో కంచ ఐలయ్య లాంటివారు కళ్ళు బాగా తెరిచి, వారి భాషలోనే 'ప్రజాస్వామ్యం' హిందూయిజంలో సజావుగా అమలవుతోందనీ, వారేమీ ఆందోళన పడనవసరం లేదని, ఉచిత సలహాల పేరుతో, తప్పుడుభాష్యాలు చెప్పొద్దనీ నా సలహా.

ఇక భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడటానికీ హిందూయిజం మాత్రమే కారణం కాదు. కొన్ని ఆచార వ్యవహారాలు పాటించలేకపోవటం వలన, పూర్వం క్రింది వర్గాలను దేవాలయాలలోకి రానివ్వక పోవటం, దూరంగా ఉంచటం జరిగిన మాట వాస్తవమే. ఇది చాలా తప్పే కాని శ్రామిక వర్గాలను అణచివేసింది ఆనాటి/నేటి వ్యాపార వర్గాలు, రాజకీయులు, పాలకవర్గాలనేదే వాస్తవం. పాలనలో ఎవరుంటే వారు శ్రామికులకు న్యాయమైన ప్రతిఫలం ఇవ్వక దోపిడీ చేసి పైకిరానివ్వలేదు. హిందుయిజానికీ శ్రామికులకు ప్రత్యక్ష విరోధమెప్పుడూ లేదే.

అయితే పారిశ్రామికీకరణ జరిగిన/జరుగుతున్న క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగా మాత్రమే శ్రామికులు అభివృద్ధిలోకి వచ్చారనేది కాదనలేని వాస్తవం. ఈరోజు రైతులనూ, కూలీలనూ గిరిజనులనూ/క్రింది తరగతుల వారినందరినీ, వారి మనుగడనూ కాలరాసే వారు ఎవరు? కేవలం ఒక మతపరమైన హిందువులా లేక వ్యాపార రాజకీయ వర్గాలా? శ్రామికుల తరఫున పోరాడితే వామపక్షాలతో కలిసి పోరాడండి. ఫలితం రావచ్చు. అసలు వామపక్షాల వారు మీ పిడివాదమైన హిందూయిజం వ్యతిరేకత జోలికిరారే. వారికి ఉన్న ఇంగిత జ్ఞానం ఆచార్య పదవిని అలంకరించిన ఐలయ్యకు ఎందుకు లేదో ఆశ్చర్యం కలుగుతుంది. మోటుగా వాదిస్తే అది హేతుత్వానికి నిలవదు సుమా!

"క్రైస్తవ సమాజం ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆచరించినందువల్లే, క్రిస్టియానిటీ 'వ్యాపించే గమనాన్ని' (స్ప్రెడింగ్ క్యారెక్టర్) సంతరించుకుని వేగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉందని'' డాక్టర్ గోపీనాథ్ ('ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మేదీ?' జనవరి19, ఆంధ్రజ్యోతి) అన్నారు. ఆయనే మరో మాట శెలవిచ్చారు: 'హిందూ మతం కనీసం భారతదేశంలోనైనా బ్రతకాలంటే, అది తనను తాను సంస్కరించుకోవడం ఒకటే మార్గం'. ఎంత గొప్ప అవగాహన!

ఇందుకే కాబోలు, ఆ మధ్య గౌరవనీయులు పోప్ పాల్ అన్నారు:"there is a lot of untapped potential in india, for christianity to expand...' (సరిగ్గా ఈ మాటలే కాకపోయినా, ఈ భావవ వచ్చే మాటల్లో). నేను ఒప్పుకుంటున్నాను. క్రైస్తవ మతం తన సామ దాన భేద దండోపాయాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తన కపట నాటకంతో, మాయ మాటలతో అమాయక పేదలు, గిరిజనులనే కాకుండా మితిమీరిన ధనాశ చూపించి, పెద్ద రాజకీయ నాయకులను కూడా బుట్టలో వేసుకోవటం జరుగుతోంది. మరి హిందువులు అస లు దురాశాపరులు కాదు కదా! వారిలాగా హిందూయిజం ఎలా వ్యాప్తి చెందుతుంది? చెందదు.

ప్రొఫెసర్ భూక్యా ఇలా రాశారు ('హిందూ ఫాసిజమే భారత్‌కు హాని' జనవరి 25, ఆంధ్రజ్యోతి): 'భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడైన వ్యక్తిని (ఇటలీ దేశస్థుడైన ఖత్రోచీ) చట్ట విరుద్ధంగా స్వదేశానికి వెళ్ళిపోవడానికి మన పాలకులే సహకరించలేదా?' హిందూయిజానికీ, ఖత్రోచీ పారిపోవటానికీ సంబంధమేమిటో పాఠకులకు తెలియజేస్తారా? ఖత్రోచీని, మీ నాయకురాలైన ఇటలీ దేశస్తురాలి ఆదేశాల పైనే కదా, ఆమె చేతినీళ్ళు తాగి బ్రతికే పాలకులు కుట్ర పూరితంగా, సురక్షితంగా దేశ హద్దులు దాటించారు? మీ నాయకురాలిని సూటిగా అడగలేకనా? దురదృష్టం. సరే, ఏది ఏమైనా కుయుక్తులతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం లాగా విస్తరించాలనుకున్న క్రిస్టియానిటీ పంథా హిందూ మతానికి అవసరం లేదు. హిందూ మతం అలా అధర్మ విధానానికి పాల్పడదు.

తెలిసో తెలియకో భూక్యా ఇలా రాశారు: 'ముస్లింల రాకతోనే హిందూ మతం పుట్టింది. అంతకు ముందు హిందూ అనే పదమే వాడుకలో లేదు'. రచయిత వాదనను బట్టి, ఇప్పుడు వ్యవహరిస్తున్న 'హిందూ' అనే పేరుతో పిలువబడుతున్న మతం ఈ భారతదేశంలో 'ముస్లిం' దోపిడీదారులు మన దేశంపైకి దండెత్తి వచ్చేవరకు లేదు. మరి ఈ జాతికి, అప్పుడు వ్యవహరిస్తున్న మతం ఏమిటి? ఏమీ లేదా? ఆలోచించడం. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అనుసరించిన అప్పటి ప్రజలు దేనిని అనుసరించారు? వారి గురువులు వాటిలోని బోధనలను ఏమని చెప్పారు? ముస్లింలు రాక పూర్వం ఈ జాతి అనుసరించినది 'సనాతన ధర్మం'. ఇతర మతాలు వచ్చిన తరువాతే ఈ 'మతం' (అంటే అభిప్రాయం) అనే పదం వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తున్నది. కాబట్టి, ఈ దేశానికి ఉన్న పేరు ప్రకారం- 'భారత'దేశం. అనగా భా అంటే జ్ఞానం/ప్రకాశం; రత అంటే కలిసి ఉండటం. కాబట్టి భారతదేశం అంటే జ్ఞానంతో వెలిగిపోవటం, కాంతినివ్వటం. ఈ భావమే ఈ జాతిలో/హిందువులలో, అణువణువునా నిండి నిబిడీకృతమైన, సనాతన ధర్మాచరణ.

ఐలయ్య చెప్పినట్లు హిందూయిజం అంతరించకపోవటం అటుంచి, అనూహ్యంగా, నిశ్శబ్దంగా, ప్రపంచ దేశాలలో తనదైన శైలిలో ఆధ్యాత్మికంగా (వ్యాపారాత్మకంగా కాదు) విస్తరిస్తోంది. ఇస్కాన్‌లోని అనుయాయులందరూ దాదాపు విదేశీయులే కదా. భగవద్గీత, రామాయణాలు అనేక దేశాలలో అనువదితమయ్యాయి. రష్యా/ ఇండోనేషియాలలో రామాయణం నృత్యరూపకంగా ప్రదర్శించుకుంటారట. ఈ మధ్యన, రష్యాలో భగవద్గీతను అక్కడి వారు రష్యన్ భాషలోకి అనువదించారని, అయితే ఆ అనువాదంలోని కొన్ని అంశాలు వివాదాస్పదమై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నదనీ తెలుస్తోంది కదా. సత్యసాయిబాబా కేంద్రాలు, రామకృష్ణా మిషన్, యోగదా సత్సంగ సొసైటీ వంటి అనేక సంస్థలు, ఆశ్రమాల కేంద్రాలు ఎన్నో దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇది వ్యాప్తి కాదా? అది కూడా ఎవరినీ, ఏ ప్రలోభం పెట్టకుండా సుమా! ఇది మీరు కూడా ప్రశంసించ వలసిన విషయం, సహృదయత ఉంటే.

హిందూ మతం ఒక నిరంతర గంభీర ప్రవాహం. సనాతన ధర్మ పీఠం. అదొక మహాసముద్రం. దానిలోని నీరును ఎంత తోడి ఖాళీ చేద్దామనుకున్నా ఖాళీ అవుతుందా? ఇంకిపోతుందా? కాదు. కానేకాదు. గంభీరమైన ఆ హిందూ మహా సముద్రంలో ఎన్నో నదులు/ (మతాలు) చేరినా దాని స్వస్వరూపం, పరిమాణం ఏమీ తగ్గదు. గుణం చెడదు. ఇంకా బలోపేతమవుతుంది. దీనికి కారణం ఇదొక మతం కాదు, జీవన విధానం. సనాతన (వేద విదితమైన) శాస్త్రీయమైనది దీని ఆధ్యాత్మికత. అందుకే, ఎన్ని దుర్మార్గపు దాడులు జరిగినా, విధ్వంసాలు జరిగినా, ఘోరమైన ద్వేషపూరితమైన మత మార్పిడిలు జరిగినా, మతద్వేషం కక్కినా ఈ పుణ్యభూమిలో, ఈ కర్మ భూమిలో, అణువణువూ నిండి నిబిడీకృతమైన సహిష్ణుత, సర్వ మానవ సౌభ్రాతృత్వం, లోక కల్యాణం కోసం, ఈ జాతి పడే తపన దీనిని చెక్కు చెదరనీయదు.

గంభీరమైన ఐరావతం వలే, హుందాగా ముందుకు నిరంతరంగా కదులుతూనే ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. మహాసముద్రం వంటి హిందూ మతానికి అంతం లేదు. ఉండదు. ఉంటుందని ఐలయ్య, గోపీనాథ్, భూక్యా వంటివారు అనుకుంటే వారు తీవ్రంగా పాత దురాక్రమణదారుల వలె భంగపడక తప్పదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఈ మేధా బ్రువులకు తెలియదనుకోను. కాని వారికి చివరిగా నాదొక సూచన. ఇప్పటికైనా ఈ ద్వేష పూరిత విషప్రచారం మాని ఆచార్య పదవి అలంకరించారు కాబట్టి పెద్ద మనుషులుగా, పెద్దమనసుతో సంస్కారయుతమైన భాషతో, తమ అభిప్రాయాలను ఇతరుల మనోభావాలను కించపరచకుండా వ్యక్తం చేయమని. వారి భాష/భాషణం హుందాగా ఉంచుకోమనీ.


- గీతాంజలి మూర్తి
వ్యాసకర్త రవీంద్రుని 'గీతాంజలి' అనువాదకులు 
 
 http://dharmasthalam.blogspot.in/2012/02/blog-post_23.html

తమవేమో పవిత్రనమ్మకాలు, ఇతరులవేమో మూఢవిశ్వాసాలు !


౧) ఒక  తెల్ల  మిషనరి, ఇతర సమాజాలను (Societies) స్టడి చేస్తే దానిని "Anthropology" అంటాడు. తన సమాజాన్ని స్టడి చేస్తే దానిని "Sociology" అంటాడు.

౨) తెల్ల మిషనరి, ఇతర మత నమ్మకాలను Myth (Mythology) అంటాడు. తన మత నమ్మకాలను "Sacred Beliefs" అంటాడు 

౩) తెల్ల మిషనరి, ఇతరుల చరిత్రను "కల్పితము, మతవిశ్వాసము" అంటాడు. తన మతగ్రంథం మాత్రం "నిజమైన, నిఖార్సైన చరిత్ర" అని బుకాయిస్తాడు.

౪) తెల్ల మిషనరి, "ఇతరులు సైతానును కొలుస్తారు" అంటాడు "తాను ఒక్కడే నిజమైన దేవుడిని కొలుస్తున్నాను" అంటాడు 

౫) తాను 1st World అంటాడు. ఇతరులు 3rd World అంటాడు 

౬) "తాను ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలలోకి చొచ్చుకుపోయి మత మార్పిడి చేసి ఆ సమాజాన్ని నాశనం చేయవచ్చు" అంటాడు అక్కడి స్థానిక ప్రజలు దానికి అభ్యంతరం చెబితే (ప్రతిఘటిస్తే) , వారిని "తీవ్రవాదులు" అంటాడు 

 ౭) "తన పుస్తకమే నిజమైనది" అంటాడు. "ఇతరుల పవిత్ర గ్రంధాలు సైతాను ప్రేరేపించినవి" అంటాడు. అవి మూడు వేల సంవత్సరాలకు ముందునుంచి ఉన్నా, తమ మతం వయసు కేవలం 2 వేల సంవత్సరాలే అయినా !

 http://dharmasthalam.blogspot.in/2012/02/blog-post_24.html

అల్లాహ్ ఎవరు ? మక్కా అంటే ఏమిటి ?


వాస్తవానికి ముస్లిములు అల్లాహ్ అని పిలుస్తున్నది అమ్మవారినే. అమ్మవారంటే ఉజ్జయినీ మహాకాళి. చంద్రగుప్త విక్రమాదిత్యుని పాలనలో అరేబియా ఉన్నప్పుడు - అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం - అప్పటికింకా మహ్మదీయ మతం లేదు. ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడి ప్రజలు తమక్కూడా ఉజ్జయినీ మహాకాళి ఆలయం లాంటిది కావాలని చక్రవర్తిని అభ్యర్థించారు. అప్పటికి అరబ్బీ మాట్లాడే అరేబియన్ లంతా హిందువులే. అరబ్బీ బ్రాహ్మలు కూడా ఉండేవారు. చక్రవర్తి సరేనని చెప్పి ఇప్పుడు మక్కా అని పిలుస్తున్న ప్రదేశంలో మహాకాళీ ఆలయాన్ని నిర్మించాడు.

అది నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఊహ కాదు. దీనికి పురావస్తు సాక్ష్యం (Archaeological evidence) ఉంది. అరబ్బీ భాషలో ఈ విషయం తెలియజేస్తూ అక్కడ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనమే ఇందుకు నిదర్శనం. ఆ దేవాలయం అతిత్వరలోనే యావత్తు అరబ్బీ దేశపు హిందువులకీ కేంద్రస్థానంగా, శైవ పీఠాధిపత్యంగా మారింది. ఇప్పుడు మక్కా వెళ్ళే హజ్ యాత్రికులంతా దర్శించేది ఆ మహాకాళీ ఆలయాన్నే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఆఱో శతాబ్దంలో ప్రవక్త మహ్మదుగారు తతిమ్మా అరబ్బీ తెగలతో (శైవులతో) హోరాహోరీ పోరాడాడు. ఆయన విగ్రహారాధకులతో పోరాడాడని కొరాన్ లో వ్రాశారు.

ఆ ఆలయంలో కాబా అని పిలిచే నల్లఱాయి (అదే అల్లాహ్ అంటారు వాళ్ళు) ఒక గోడలో తాపడం చేసి ఉంటుంది. శివలింగం లేని పానవట్టాన్ని ఒకసారి ఊహించుకోండి. అది సరిగ్గా అలా ఉంటుంది. లింగం స్థానంలో లోతుకు పోయిన ఖాళీసొట్ట కూడా ఉంటుంది. పానవట్టం పార్వతీస్వరూపమని కదా హిందూ సంప్రదాయం. హజ్ యాత్రికులు దాన్ని తాకడం కోసం ఎగబడుతూంటారు. కాబా దగ్గఱ దాన్ని పూజించే ముస్లిమ్ ఇమామ్ లు అచ్చం మన శైవపూజారుల తరహాలో బోడిగుండ్లు, పంచెలు, ఉత్తరీయాలూ ధరించి ఉంటారు. భక్తులు కూడా అసలు అదే వేషంలో కాబాని దర్శించాలని నియమం ఉందట.

ఆ నల్లఱాయి ఇస్లామ్ ఆవిర్భవించక ముందునుంచే అక్కడ ఒక పూజనీయవస్తువుగా ఉండేదని చారిత్రిక ఆధారాల వల్ల తెలుస్తున్నది. ఈ క్రింది ఉటంకింపుల్ని గమనించండి :

Edward Gibbon writes about the Ka'bah and its existence before the Christian era in his book:

"..... of blind mythology of barbarians - of the local deities, of the stars, the air, and the earth, of their sex or titles, their attributes or subordination. Each tribe, each family, each independent worrier, created and changed the rites and the object of this fantastic worship; but the nation, in every age, has bowed to the religion as well as to the language of Mecca. The genuine antiquity of Caaba ascends beyond the Christian era: in describing the coast of the Red sea the Greek historian Diodorus has remarked, between the Thamudites and the Sabeans, a famous temple, whose superior sanctity was revered by all the Arabians; the linen of silken veil, which is annually renewed by the Turkish emperor, was first offered by the Homerites, who reigned seven hundred years before the time of Mohammad."

Diodorus Siculus was a Greek historian of 1st century BC who wrote Bibliotheca Historica, a book describing various parts of the discovered world. The following lines are the English translation of Greek quoted by Gibbon from the book of Diodorus Siculus (Diodorus of Sicily) describing the 'temple' considered to be the the holiest in the whole of Arabia.

"....And a temple has been set-up there, which is very holy and exceedingly revered by all Arabians...."

చాలా దశాబ్దాల క్రితం - అంటే అరేబియా పాశ్చాత్యుల అధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఆ ఆలయప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెఱిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలూ, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడు. ఆ గదిని ఎవరూ చూడకూడదనే నియమాన్ని ఇప్పుడు మాత్రం కట్టుదిట్టంగా అమలు జఱుపుతున్నారు.

అసలు విషయమేమంటే - అల్లా అంటే సంస్కృతంలో అమ్మ అని అర్థం.

 http://dharmasthalam.blogspot.in/2009/09/blog-post_419.html

థాయ్ ల్యాండ్ : ఇది బౌద్ధదేశమా ? హిందూదేశమా ?

థాయ్ ల్యాండ్ - మనకు పొఱుగున బర్మా (మయన్మార్) పక్కన ఉన్న దేశం. మలేషియాతో కూడా దీనికిసరిహద్దుంది. అయితే మలేషియా ముస్లిమ్ దేశం కావడం చేత దీనికీ, దానికీ మధ్య చాలా గొడవలున్నాయి. మలేషియా తమ దేశపు దక్షిణప్రాంతంలోని ముస్లిమ్ లని మచ్చిక చేసుకొని వాళ్ళని టెఱ్ఱరిస్టులుగా మార్చి తమ మీదికి పంపుతున్నదని థాయ్ ల్యాండ్ చాలా రోజులనుంచి ఆరోపిస్తున్నది. ఇది ఆసియాఖండంలో విదేశీ పరిపాలనని ఎప్పుడూ చవిచూసి ఎఱుగని అరుదైన దేశాల్లో ఒకటి. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెట్టింపు ఉండే ఈ దేశంలో జనాభా ఆఱున్నఱకోట్లు మాత్రమే. ప్రస్తుతం ఆ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి శ్రీ భూమిబల్ అతుల్యతేజ(జ్) భారతీయ క్షత్త్రియవంశానికి చెందినవాడు. నేపాల్ రాజవంశం రాజా బీరేంద్ర బిక్రమ్ షహా తో అంతరించి పోయాక బహుశా ఈయనొక్కడే ఇప్పుడీ కలియుగంలో భూమండలం మీద మిగిలిన ఏకైక క్షత్త్రియరాజు. ఆయన బహుచిన్నతనం నుంచి అంటే 1945 నుంచి రాజుగానే ఉన్నాడు.

ఇక్కడ విచిత్రమేంటంటే రాజు హిందువు. ప్రజలేమో బౌద్ధులు. కానీ థాయ్ రాజబిరుదాల్లో ఆయన్ని థేరవాద బుద్ధధర్మ పరిరక్షకుడని చదువుతారు. (చిఱు వివరణ :- థేరవాదం అంటే బుద్ధుణ్ణి దేవుడుగా కాక గురువుగా మాత్రమే భావించే బౌద్ధశాఖ. మన ఆంధ్రదేశంలో ఒకప్పుడు నాగార్జునుడు బోధించిన మహాయాన బౌద్ధానికి ఇది కొంచెం విరుద్ధంఅన్నమాట. మహాయానంలో బుద్ధుణ్ణి దేవుడుగా కొలుస్తారు)

అయితే రాజు చాలా విషయాల్లో బౌద్ధాన్ని అనుసరించడు. అందుచేత తనకోసం ప్రత్యేకంగా ఒక హిందూబ్రాహ్మణ్ణి రాజగురువుగా పెట్టుకున్నాడు. ప్రస్తుత రాజగురువు పేరు ఫారా రాజగురు వామదేవముని. అలాగే సలహాలివ్వడానికి ఆయనకొక రాయల్ కౌన్సిల్ ఉంది. అందులో ఏడుగురు భారతీయ బ్రాహ్మలున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా రాజుగారి పూర్వీకుల మాదిరే ఏ కాలంలోనో భారతదేశం నుంచి వలసపోయినవాళ్ళు. స్థానిక థాయ్ ఆడవాళ్ళని చేసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ ముఖకవళికలు భారతీయుల్లా అనిపించవు. ఇప్పుడు వాళ్ళందఱికీ థాయ్ భాషే మాతృభాష. ఈ థాయ్ భాష అక్షరాలు ప్రాచీన దాక్షిణాత్యబ్రాహ్మి (అంటే ఇప్పటి తమిళలిపికి దగ్గఱ) నుంచి ఉద్భవించాయట.



థాయ్ ల్యాండ్ లో తొంభై అయిదుశాతం మంది బౌద్ధులుగా నమోదయ్యారు. అయిదుశాతం మంది మాత్రమేబౌద్ధేతరులు. అందులో కేవలం ఒక లక్ష జనాభా గల హిందువులు కూడా ఉన్నారు. ఈ హిందువుల్లో ఎక్కువమంది ఇటీవలి శతాబ్దాల్లో భారతదేశం నుంచి అక్కడికి వలసపోయినవాళ్ళే. వీళ్ళు వలసపోవడానికి ముందే ఆ దేశంలో శివాలయాలూ, బ్రహ్మాలయాలూ, విష్ణ్వాలయాలూ, విఘ్నేశ్వరుడి ఆలయాలూ వేలాదిగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటిల్లో పెక్కు ఆలయాలు ఈమధ్య కట్టినవి కావు. చాలా ప్రాచీనమైనవి. కట్టించినది భారతీయులు కారు. థాయ్ వాసులే. కొన్నైతే రాజుగారే ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేసి మఱీ కట్టించాడు. ఎటొచ్చీ, ఇక్కడొక తమాషా ఉంది. బౌద్ధంలోంచే హిందూమతం ప్రభవించిందని ఎక్కువమంది థాయ్ వాసులు నమ్ముతారు. ఇదొక అమాయక నమ్మకమే తప్ప ఇందులో మనల్ని (భారతీయుల్ని) అవమానించేదేమీ లేదు. ఎందుకంటే తాము అవలంబిస్తున్న హిందూమతాన్ని ఇండియా అనే ఒక పొఱుగుదేశంలో కూడా అవలంబిస్తారని బాగా చదువుకున్నవాళ్ళకి తప్ప సామాన్య థాయ్ పౌరులకి తెలీదు.


థాయ్ బౌద్ధ భక్తుల ద్వారా ఈ దేవాలయాలకి భారీగా ఆదాయలొచ్చిపడుతున్నాయి. కారణం ఏంటంటే - థాయ్ ప్రజలు వేదాంతంలో బౌద్ధాన్ని, లౌకిక జీవితంలో హిందూమతాన్ని అవలంబిస్తారు. ఉదాహరణకి - బౌద్ధంలో సన్న్యాసం తప్ప వేఱే ఆశ్రమం లేదు. కనుక పెళ్ళిళ్ళూ పేరంటాలూ, గృహప్రవేశాలూ గట్రా కర్మతంత్రాలకి హిందూ ఆచరణలు చేస్తారు. అలాగే కోరికల కోసం మొక్కుకోవడానికి హిందూ దేవాలయాలకి వెళతారు. బుద్ధుడు కోరికలు తీర్చడని వారి అభిప్రాయమట. అలా అక్కడ అడుగడుగునా బుద్ధుడికీ, హిందూ దేవతలకీ సమాన ప్రతిపత్తి చాలకాలంనుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలోని మతపరిస్థితుల మీద ఒక విపులమైన వ్యాసాన్ని ఈ క్రింది లంకెమీద నొక్కి చదవొచ్చు.
http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3760

మఱికొన్ని ఛాయాచిత్రాలు ఈ క్రింద:





http://dharmasthalam.blogspot.in/2011/10/blog-post_9934.html

ధర్మంపై బురదజల్లడానికి ముందు దీనికిసమాధానం చెప్పండి


ధర్మరక్షణ
- జి.నాగేశ్వరరావు

'ఆత్మవిమర్శా, అంతర్యుద్ధమా?' (జనవరి17, ఆంధ్రజ్యోతి) అనే వ్యాసంలో అరవిందరావు (మాజీ డిజిపి) హిందూ మత విమర్శకులకు కొన్ని సహేతుకమైన ప్రశ్నలు సంధించారు. కంచ ఐలయ్య ఎప్పుడో తాను హిందువును కానని ప్రకటించుకుంటూ ఒక పుస్తకం కూడా రాశారు. ఫరవాలేదు. హిందూ మతానికొచ్చిన నష్టమేమీ లేదు. అయితే హిందువుకాని ఐలయ్య హిం దూ మతాన్ని విమర్శిస్తారేమిటి? ఆయన ముస్లిం కూడా కాదు గదా. మరి ఇస్లాంను విమర్శించరేం? ఏ మతంలోని విషయాలైనా అవి ఆ మతస్తుల వ్యక్తిగతం. ఇతరులకు అవి అప్రస్తుతం. హైందవేతరుడైన ఐలయ్య హిందూ మతాన్ని విమర్శించడానికి కారణం హిందువుల్లో ప్రతిఘటన వుండదని తెలుసు గనుకనే.

లోపరహితమైన మతంగాని, సమాజంగాని యీ ప్రపంచంలో వున్నదా? వర్ణ వివక్షను, అంటరానితనాన్ని చూపి హిందూ మతాన్ని నిందించేటట్లైతే జాతి వివక్షను చూపి క్రైస్తవాన్ని కూడా నిందించాలి కదా? నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల అమెరికాలో నేడు గదా ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు కాగలిగింది? 1853లో బానిసత్వాన్ని రద్దు చేసినందుకు ఆగ్రహించిన దక్షిణాది అమెరికన్ రాష్ట్రాలు సౌత్ కరోలినా నాయకత్వంలో అమెరికన్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకున్నా యి. అబ్రహాం లింకన్ నాయకత్వంలో ఆ పది దక్షిణాది రాష్ట్రాలపై యుద్ధం ప్రకటించి తిరిగి యూనియన్‌లో విలీనం చేసుకోవడం జరిగింది.

కె.కె.కె. అనే తీవ్రవాద సంస్థ ద్వారా నల్లవారిపై దాడు లు చేసిన అమెరికన్ ప్రజల్లోనా వివక్ష లేక వారనుసరించే క్రైస్తవమతంలోనా వివక్ష? కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటనలను పదే పదే మననం చేసుకుంటూ మతాన్ని నిందించటం న్యాయ మా? లక్షల హిందువుల్ని వధించి వేలాది దేవాలయాల్ని నేల మట్టం చేసిన గజనీ, ఘోరీ, ఔరంగజేబులను ఉటంకిస్తూ మనం ముస్లింలను ద్వేషిస్తున్నామా?

ఇంకా వారికి రిజర్వేషన్లు కల్పించి సత్కరిస్తున్నాం! నేడు తిరుపతి, కాశీ, ప్రయాగ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో ఎవరిది ఏ కులమని అడుగుతున్నామా? గ్రామాల్లో కొంత వివక్ష వుండవచ్చు కానీ ప్రభుత్వం దానికి కఠినమైన చట్టాలను చేసింది. మహిళలపై రోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, దాడులు జరుగుతూనే వున్నవి. అందుకు ప్రతిగా మహిళలంతా హిందూ మతం విడిచి అన్యమత ప్రవేశం చేయాలా?

హిందూ మతంపై బురద జల్లే వారికి కులవ్యవస్థ ఓ తురుఫు ముక్క. దళిత హిందువులను (దళిత క్రైస్తవులను వేరుగా గుర్తించాలి) దేవాలయాల్లో పూజారులుగా నియమించరు. దళిత హిందువులతో అగ్రవర్ణాల వారు వియ్యమందరు. కలిసి భోజనం చేయరు. దేవాలయాలలోకి రానివ్వరు. అంటరానితనాన్ని పాటిస్తారు. ఇంక హిందూ మతంలో ఎందుకుండాలి అని వాదిస్తారు? సరే, మతం మారగానే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయా? క్రైస్తవులంతా సుఖంగా ఉన్నారా? అమెరికాలోని క్రైస్తవులు శ్రీమంతులు. ఆసియా, ఆఫ్రికాలలోని క్రైస్తవులు దరిద్రులుగానున్నారేమి? ఒకే దేముడిని ఆరాధించే వారంతా ఒకే తీరుగా లేరే?

అంటరానితనం, కులవివక్ష అనేదానికి మతంలో ఎటువంటి ప్రామాణికమూ లేదు. ఉంటే గనుక వాల్మీకి పూజనీయుడెలా అవుతాడు? నారాయణ గురు, నయనార్‌లు, తిన్నడు, స్వామి వివేకానంద, సాయిబాబా, ఇంకా వందలాది స్వామీజీలు వీరే కులానికి చెందినవారు? అంబేద్కర్‌కు ఆర్థిక సహాయం చేసింది బరోడా మహారాజు కాదా? ఒక మతంలో పుట్టే మహనీయుల్ని బట్టి ఆ మతాన్ని విశ్లేషించాలి తప్ప దానిలో పుట్టే అధములని బట్టికాదు. అంటరానితనాన్ని, కుల వివక్షను పాటించే వారెవరైనా సరే మూర్ఖులే. దేవాలయ పూజారులుగా బ్రాహ్మణ స్త్రీలు గూడా అర్హులు కాదు. అశౌచం వున్న కొంతమందిని ఉపేక్షించటం జరిగింది. హిందువుల్లోనే గాదు, క్రైస్తవుల్లో గూడా మహిళా పాస్టర్లు, ముస్లింలలో మహిళా ఇమాంలు లేరు. వారిదిగూడా వివక్షేనా?

మొదట్లో చాతుర్వర్ణ వ్యవస్థగావుండి తరువాత శాఖలు, ఉపశాఖలుగా విడిపోయిన హిందూ సమాజంలో ఎన్నడూ కులపరమైన ఘర్షణలు జరగలేదు. నేడు కొన్ని స్వార్థపరశక్తులు కుల వ్యవస్థను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఒకప్పుడు సంస్కృత భాష ఒక్కటే వుండేది. క్రమేపీ అందులోనుంచి అనేక భారతీయ భాషలు పుట్టుకొచ్చాయి. కానీ వారెవరూ భాషా పరంగా కలహించుకోవటం లేదే? వివిధ కులాల వారు మాత్రం ఎందుకు కలహించుకోవాలి? ఏ కులమూ మరొక దానికంటే తక్కువదని ఎక్కడా చెప్పబడలేదు. బ్రాహ్మణులు ప్రజాపతి ముఖం నుంచి, శూద్రులు పాదాల నుంచి జన్మించారన్నదానికి విపరీతార్థాలు తీసి శూద్రులను హిందూ మతం కించపరిచిందని వాదిస్తారు. కాని ఎవరికైనా పాదాభివందనం చేసినప్పుడు ఆ పాదాలే శిరోధార్యాలు కదా?

కులాంతర వివాహాలు వ్యక్తిగతం. బ్రాహ్మణులు కూడా తమ శాఖల్లోనే చేసుకోవటానికి ఇష్టపడతారు. ఇది ప్రత్యేకంగా దళితు ల పట్ల వివక్ష ఎట్లా అవుతుంది? డబ్బు, హోదా కలిగిన ఒక ఉన్నతోద్యోగి తన కార్యాలయంలోనే పనిచేస్తున్న అటెండరుతో వియ్యమందుతాడా? ఇక్కడ డబ్బు, హోదాగల వివక్ష. దీన్నికూడా ఖండించరేం? అమెరికాలో తెల్లవారు, నల్లవారి మధ్య వివాహాలు జరుగుతాయా? క్రైస్తవుల్లో గూడా జాతి వివక్ష ఉన్నట్లేగా?

భారతదేశంలో కుల వివక్షే గనుక రాజ్యమేలుతున్నట్లైతే రాష్ట్రపతిగా ఒక దళితుడిని ఎలా ఎన్నుకున్నారు? దళితులు మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులయ్యారు. కేంద్రంలోను, రాష్ట్రాలలోను పలువురు దళితులు మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. అగ్రవర్ణాల హిందువులు కుల వివక్షను పాటించి ఉండివుంటే దళితులకు రిజర్వేషన్లు ఎలా సమకూరినవి? ఊరూరా అంబేద్కర్ విగ్రహాలు ఎలా వెలిసినవి? మతం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే గాదు; అది ఒక సాంఘిక, సాంస్కృతిక ప్రక్రియ కూడా. హిందూ మతంతో సహా ఏ మతమూ మనలను స్వర్గానికి తీసుకెడుతుందన్న ధీమా ఏమీలేదు.

కానీ ప్రతి మతానికీ ఒక సంస్కృతి, సమాజం వుంటుంది. మతం మారితే ఇవి గూడా మారిపోతాయి. ఒక దేశంలో మతాలు ఎన్ని ఎక్కువైతే అస్థిరత అంత ఎక్కువగా వుంటుంది. ప్రజలు మతపరంగా చీలిపోయి వేర్పాటు వాదం తలెత్తుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పాకిస్థాన్. 1946లో జిన్నా ఒక ప్రకటన చేస్తూ హిందువులు, ముస్లింలు రెండూ వేర్వేరు జాతుల వారు; వారెన్నడూ కలిసి సఖ్యతగా జీవించలేరు గనుక పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయవలసిందేనన్నాడు. నిన్నటిదాకా హిందువుగా ఉన్నవాడు నేడు ముస్లింగా మారగానే వేరే జాతి వాడుగా, వేర్పాటు వాదిగా మారుతున్నాడు. అలాగే క్రైస్తవులైన ఈశాన్య రాష్ట్ర ప్రజలు గూడా వేర్పాటు వాదాన్ని వినిపిస్తున్నారు. అంతేగాక మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సంగీ తం, నాట్యం, శిల్పం ఇవన్నీ హిందూ మతం నుంచే పుట్టాయి.

మతం నశిస్తే ఇవి గూడా నశిస్తాయి. ఏదైనా ఒక మతాన్ని గాని, సంస్కృతిని గాని, వ్యవస్థను గాని నిర్మించడం కష్టం గాని దానిని నాశనం చేయటం చాలా తేలిక. హిందూ మతాన్ని సంస్కరించి దానిని పరిపుష్టం చేయడానికి సలహాలివ్వాలిగాని మతాన్ని బలహీనపరిచే చర్యలు న్యాయం కాదు. మనం కాశ్మీర్‌పై ఎన్ని చర్చలైనా జరపవచ్చు కాని ప్రధానాంశం మాత్రం కాశ్మీరు భారత్‌లో అంతర్భాగం అనేది. అలాగే హిందూ మత పునరుజ్జీవనం అనేది మౌలిక సూత్రంగా సలహాలు, సంస్కృతులకు స్వాగతం. బయటకు వెళ్లేవారు వెడుతుంటే కొత్త వారు పుడుతుంటారు తప్ప హిందూ మతానికి నాశనం లేదు. దేశ సమగ్రత కోసం, సంస్కృతీ పరిరక్షణ కోసం, జాతి వారసత్వం కోసం హిందూ మతం బ్రతికే వుండాలి. హిందువులందరూ దానిని బ్రతికించుకోవాలి.

ధర్మోరక్షతి రక్షితః
- జి.నాగేశ్వరరావు
(ధర్మప్రసార సమితి) 
 
http://dharmasthalam.blogspot.in/2012/02/blog-post_22.html

హిందువులు మేల్కోవాలి


ఏడాది పొడవునా అన్ని దేవాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. హుండీలు పొంగిపొర్లుతున్నాయి, భక్తులు చెల్లించుకున్న ముడుపులతోనూ, మ్రొక్కులతోనూ, తదితర కానుకలతోనూ ! దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ దేవాలయాలలో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవితాలు గడిపేస్తున్నారు. దేవాలయాల యాజమాన్యం క్రింద ఉన్న నానా విద్యా, వైద్యసంస్థల్లో వేలాదిమంది చేఱుతున్నారు.

అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ ? నిజానికి వాస్తవ పరిస్థితి అంత ఆశావహంగా లేదు. హిందూమతం ఒక అత్యవసర పరిస్థితి (Emergency) వైపు, ఒక మానవ వనరుల సంక్షోభం (Human resources' crisis) వైపు అతివేగంగా పయనిస్తోంది. ఎక్కడో అమెరికాలో కాదు, ఇక్కడే ఈ సనాతన భూమిలోనే ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయ దృశ్యం కనీసం పదేళ్ళ తరువాత, లేదా గరిష్ఠంగా పాతికేళ్ళ తరువాత పూర్తిగా అదృశ్యం కాబోతున్నది. అటుపిమ్మట ఆ దేవాలయాల పరిస్థితేంటో, వాటిల్లోని దేవుళ్ళ పరిస్థితేంటో, ఆ దేవాలయాల క్రింద నడుస్తున్న సంస్థల పరిస్థితేంటో, అసలు టోకుగా హిందూమతం పరిస్థితేంటో అంతా అగమ్యగోచరం. ఎందుకంటే హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులో ఎంత చిన్న అర్చామూర్తిని ప్రతిష్ఠించాలన్నా యాభైవేలు డిమాండు చేస్తున్నారు. కాస్త పెద్ద విగ్రహాలకైతే లక్ష తప్పనిసరి. జనం "సరే"నని విధిలేక ఇస్తున్నారు, చందాలేసుకుని మఱీ !

అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. పరిత్యజించడానికి కారణం - ఆ వృత్తికి ఒకప్పుడు హిందూసమాజం ఇచ్చిన ఉద్యోగ భద్రత (Job security) ని ఆ తదుపరి ఉపసంహరించుకోవడం. అలా ఉపసంహరించుకోవడాని క్కారణం అంతకుముందటి బ్రాహ్మణ ద్వేష ప్రచారాలూ, తద్ద్వారా హిందూ మతగురువుల పట్ల ఆదరాభిమానాల్నీ, సానుభూతినీ నశింపజేయడం. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి !

ఉన్న పురోహితుల పిల్లలే అర్చక-పౌరోహిత్యంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. అథవా కొంతమంది ఇష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళు "ఠాఠ్ ! వల్లకాదు. అర్చక-పౌరోహిత్యంలో ఏముంది ? నా కొడుకు ఇంజనీరో, డాక్టరో అవ్వాల్సిందే" నని ముక్కు చీదితే కాదనలేక అటు మళ్ళిస్తున్నారు. మిహతా బ్రాహ్మణ జనాభా అలవాటు చేసుకుంటున్న డబ్బువిలువలు ఈనాడు సాంప్రదాయిక అర్చక బ్రాహ్మణ కుటుంబాల్ని కూడా ఇతోఽధికంగా ప్రభావితం చేస్తున్నాయి. తమను తాము ఉద్యోగ వర్గపు బ్రాహ్మణులతో పోల్చుకుని "మనకేం తక్కువ ? ఇంగ్లీషు చదువుకుంటే ఆ మాత్రం ఉద్యోగాలు మనం చెయ్యలేమా ? సంపాదించలేమా ?" అని బయలుదేఱుతున్నారు, ధనసంపాదనా ప్రస్థానానికి ! ఆ విధంగా ఒకసారి మా దగ్గఱ పనిచేస్తున్న యువ పురోహితుడు కూడా HDFC బ్యాంకులో చేఱాడు. కానీ ఆ బ్యాంకువాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవడానిక్కూడా వీల్లేనంత బిజీ చేసేస్తున్నారని గమనించి ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ పౌరోహిత్యంలోకి వచ్చాడు. సరే, ఇది పురోహితుల సంగతి. ఇహ పూజారుల విషయానికొస్తే వాళ్ళని తప్పు పట్టలేం, వాళ్ళకి ఇస్తున్న జీతం ఒక మనిషిని పోషించడానిక్కూడా చాలని పరిస్థితుల్లో ! పూజారి, పురోహితుడంటే బ్రాహ్మణ అమ్మాయిలు ముందుకు రావడం లేదు పెళ్ళి చేసుకోవడానికి ! అందువల్ల కూడా చాలామంది బ్రాహ్మణులు ఈ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఇతర మతంలోనూ లేదు. హిందూ పూజారులే దీనికి గుఱిచేయబడుతున్నారు.

గతంలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డ బ్రాహ్మణ ద్వేషమే ఈ కొఱతకు మూలకారణం

ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. దీని అసలు చరిత్రని అందఱూ కాస్త తెలుసుకోవాలి.

౧. ఏ విధంగా మెజారిటీ బ్రాహ్మణులు దేవాలయాల్నీ, పురోహితవృత్తినీ వదిలిపెట్టి లౌకిక ఉద్యోగాల్లో చేఱాల్సి వచ్చింది ?

౨. తదుపరి కాలంలో ఆ లౌకిక ఉద్యోగాల నుంచి కూడా వారిని ఏ విధంగా బహిష్కరించడం జఱిగింది ?


౩. అది ఏ విధంగా వారిని విదేశాల పాలు చేసింది ?


౪. ఆ విదేశీ/ నవ నాగరిక బ్రాహ్మణులు ఏ విధంగా అర్చక-పురోహిత కుటుంబాలక్కూడా ఆదర్శమై కూర్చున్నారు ?


౫. తద్ద్వారా అర్చక-పురోహిత వృత్తి తన గ్లామర్‌ని పూర్తిగా కోల్పోయిన వైనం


౬. మతం గుఱించి బోధించేవాళ్ళు లేకుండా చేయడం ద్వారా ఈ పరిస్థితి ఏ విధంగా ముందు మతాన్నీ, తదుపరి సంఘాన్నీ దెబ్బకొట్టబోతున్నది ?


వీటి మధ్య ఉన్న గొలుసుకట్టు సంబంధమూ, పరస్పర ప్రభావమూ, సామాజిక వాతావరణమూ ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది.

గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో వ్యక్తిగత భూములూ, దేవాలయ భూములూ లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?

అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (false ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళ శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.

ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.

ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వారిని దేశానికి విలన్‌లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలకూ మతగురువులున్నారు. కానీ తమ మతగురువుల్ని హిందువులు అణచివేసినట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఎక్కడా ఎవఱూ చేయడం లేదు. పైపెచ్చు నెత్తిన బెట్టుకుని పూజించుకుంటున్నారు. కానీ భారతదేశంలో బ్రాహ్మణుల స్థానమూ, చారిత్రిక భూమికా ఇతరమతాలలోని మతగురువుల కంటే ఎన్నో రెట్లు గొప్పవీ, వైవిధ్య భరితమైనవీను. బ్రాహ్మణులు ఈ జాతికి ఎప్పుడు అపకారం చేశారు ? వారు ఎల్లప్పుడూ చేతనైనంత మంచే చేశారు. మనసా వాచా కర్మణా తెలుగుజాతిలో కలిసిపోయి తమ సంస్కృత నామాల్ని సైతం వర్జించి అచ్చతెలుగులో నన్నయ్య, తిక్కన్న, పోతన్న మొదలైన పేర్లు పెట్టుకుని ఇక్కడి జనసామాన్యంతో తాదాత్మ్యం చెందారు. వారు లిపిలేని తెలుగుభాషకు లిపి (బ్రాహ్మీలిపి) నిచ్చారు. వ్యాకరణం లేని తెలుగుభాషకు వ్యాకరణాన్నిచ్చారు. పదాలు లేని భాషకు సంస్కృత పదాలు జోడించి శక్తిమంతం చేశారు. సాహిత్యం లేని భాషలో సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచ భాషల సరసన దీని చరిత్రని సగర్వంగా, సుస్థిరంగా నిలబెట్టారు. రాష్ట్రం సంగతి పక్కన బెడితే బ్రాహ్మణులు లేకుండా భారతదేశం అనే పరిభావన (concept) అసలెక్కడుంది ? బ్రాహ్మణ వారసత్వం కాకుండా ఈ దేశానికి ఉన్న ఉమ్మడి వారసత్వం ఏంటి ?

దేసీ ప్రభుత్వాల చేతుల్లో తమ తల్లిదండ్రులు పడ్డ బాధలు గమనించి చాలామంది తెలుగు బ్రాహ్మణుల సంతానం ఇంగ్లీషు అభ్యసించి దశాబ్దాల క్రితమే ఉత్తర అమెరికాకి పారిపోవడం ప్రారంభించారు. ఇతరులకు విదేశీ ప్రయాణం ఒక హోదాచిహ్నం (Status symbol) కాగా బ్రాహ్మణులకు మాత్రం అదొక చావుబతుకుల సమస్యగా మారింది. ఏం చేసైనా సరే, పారిపోక తప్పని పరిస్థితిని అనుభూతి చెందారు. నిరంతర కృషీ, శ్రమా ఫలితంగా బ్రాహ్మణుల ఆర్థిక హోదా (Economic status) గత పాతికేళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పుకు లోనైంది. వారిలో కొంతమంది కోటీశ్వరులు కావడంతో అలాగే తానూ కోట్లకు పడగలెత్తాలనే దుగ్ధ ప్రతి బ్రాహ్మణుడిలోనూ పురివిప్పింది. ఏదేమైనా బ్రాహ్మణజాతి యావత్తూ ఉత్తర అమెరికాకు శాశ్వతంగా ఋణపడిపోయింది. స్వదేశంలో నిష్కారణమైన కులద్వేషానికి బలై కూడు లేక ఆకలితో అలమటిస్తూ వచ్చిన బ్రాహ్మణ బిడ్డల్ని అమెరికామాత ప్రేమగా దగ్గఱికి తీసుకుని అన్నం పెట్టింది. కోట్లు ప్రసాదించింది. MNC లకు అధిపతుల్ని చేసింది. అధికారాన్ని సైతం అనుగ్రహించింది.

అబ్రాహ్మణ హిందూ ప్రభుత్వాల చేతుల్లో నిష్కారణంగా అణచివేతకు గుఱైన వర్గంగా బ్రాహ్మణుల హృదయాంతరాళాల్లో ఒక కసి గూడు కట్టుకుని ఉంది. ఆ కసిలో అది తనకు పూర్వం ఉన్న అనేక అభిమానాల్నీ, సెంటిమెంట్లనీ వదులుకుంది. ఇది మిక్కిలి శోచనీయమే. వ్యక్తిగతంగా నేను హర్షించను. కానీ ఏం చేద్దాం ? చర్య (Action) కు ప్రతిచర్య (Reaction) తప్పకుండా ఉంటుంది. మానవజాతి అంతా గుఱ్ఱుపెట్టి ఆదమఱచి గాఢనిద్ర పోతున్న యుగాల్లో కళ్ళు తెఱుచుకుని మేలుకుని అన్నీ ఆలోచించిన ప్రకాశమాన చరిత్ర గల బ్రాహ్మణులు తమ అణచివేతకు రియాక్ట్ అవ్వరని అనుకోవడం ప్రభుత్వాల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆ రోజున ఆ అణచివేతల్ని నిరంకుశంగా పాశవిక రాజకీయ అధికార సహాయంతో అమలు జఱుపుతున్న కాలంలో బ్రాహ్మణులు నిస్సహాయులు. పేదవారు. అప్పటికే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో దెబ్బదిని చప్పున కోలుకోలేక అప్పటి దాకా తాము పాల్గొంటూ వస్తున్న అన్ని రాజకీయ, సాంఘిక కార్యకలాపాల నుంచీ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వాలకు ఆనాడు ఒక మంచి అవకాశం లభించింది. తాత్కాలిక విజయం సిద్ధించింది.

అలా దేశం నుంచి పారిపోవడం వెనక బ్రాహ్మణుల్లో కూడా చారిత్రికంగా చోటు చేసుకున్న మనస్తత్త్వపరమైన లోపాలున్నాయి. బ్రాహ్మణులు మొదట్నుంచీ ప్రభుత్వ పోషణ మీదే ఇనుమిక్కిలిగా ఆధారపడి బతికారు. ప్రభుత్వాదరణ మీదే తమ సాంఘిక గౌరవ పునాదుల్ని కూడా నిర్మించుకున్నారు. వారిని ఆదరించిన ప్రభుత్వాలు పోయాయి. వాటి స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వాలు హఠాత్తుగా తమ మీద కక్ష సాధించడం మొదలుపెట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదు. అందుకు మానసికంగా సన్నద్ధులై లేరు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. పర్యవసానమే ఈ కాందిశీకత్వం.

బ్రహ్మద్వేషపు గతం నుంచి హిందువులు ఇహనైనా పాఠాలు నేర్చుకోవాలి

బ్రాహ్మణులు ప్రాథమికంగా ఈ మత నిర్వహణకై నియోగించబడ్డవారు. కానీ ఈ కర్తవ్యాన్ని యథాపూర్వంగా నిర్వహించడానికి సమకాలీన పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకని వారు ఇందులోంచి అంతిమంగా విరమించుకోక తప్పకపోవడం అవగాహనీయం. కూడు కోసం, గుడ్డ కోసం, గౌరవం కోసం వారు ఈ హిందూసమాజంతో పోరాడి, పోరాడి పూర్తిగా అలిసిపోయినట్లు కనిపిస్తోంది. అయినా బ్రాహ్మణుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయలేం పూర్తిగా ! ఎందుకంటే ఒక పూజారి కొడుకు తన తండ్రి చేస్తున్నవన్నీ శ్రద్ధగా గమనిస్తూ తానూ పెద్దవాడై అలా చేయాలనుకుంటాడు. ఏ శిక్షణ ఇచ్చినా ఆ నిష్కపట అమాయక భావాన్ని కలిగించలేం. అదొక అమూల్యమైన వారసత్వపు సెంటిమెంటు. ఒకసారి ఆ వారసత్వం లోంచి బయటపడ్డ కుటుంబాలు తిరిగి అందులోకి వెళ్ళడం చాలా చాలా కష్టం, మా కుటుంబం లాగే ! అయినా దేవాలయాల్ని అనాథలుగా వదిలేయలేం. అక్కడ నిరాటంకంగా నిత్యనైమిత్తికాలు నడవాల్సి ఉంది. అందుకు హిందువులే ఏదో ఒక ఏర్పాటు చూసుకోవాలి. ఏ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు బ్రాహ్మణుల్ని హింసిస్తున్నట్లుగా కొత్తవారిని కూడా హింసించకుండా కనీసం వారినైనా ప్రేమతో, గౌరవంతో, ఆదరంతో, అభిమానంతో చూసుకోవడం అవసరం. చరిత్ర అబ్రాహ్మణ కులాల మీద మోపుతున్న ఐతిహాసిక ఉత్తరవాదిత్వం ఇది.


(కలగూరగంప బ్లాగు నుంచి ఉద్ధృతం)

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

కైలాసానికి తారు రోడ్డు


మానస సరోవరం.. ప్రతి రోజూ దేవతలు ఉదయాన్నే వచ్చి స్నానాలు చేసే పవిత్ర తటాకం.
కైలాస పర్వతం.. ఆది యోగి పరమ శివుడి నివాసం.
కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల.

తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు- ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోను, కావ్యాలలోను ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలు ఉన్నా, అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి తటాకం మానస సరోవరం.

దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి. సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంటుంది. లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని.. బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూపురాణాలు చెబుతాయి. బ్రహ్మ మానసంలో(మనసు) పుట్టింది కాబట్టి దీనికి మానససరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం.

బౌద్ధ జాతక కథలలోను, ఇతర గ్రం«థాలలోను కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. 'అనవతప్త' అని బౌద్ధులు పిలుచుకొనే ఈ సరోవరం ఒడ్డున 'చూ గంప బౌద ్ధఆరామం' ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించటానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందనేది బౌద్ధుల నమ్మ కం. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పటానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.

రెండు మార్గాలు..

ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించటానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది. మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేది. పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు. యాత్రకు వెళ్లాలనుకొనేవారు ముందు నేపాల్ చేరుకొనేవారు. ఖాట్మండులోని పశుపతినాథుడి ఆలయాన్ని సందర్శించుకొని.. అక్కడి నుంచి కాలినడకన మానస సరోవరానికి బయలుదేరేవారు. వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినటానికి ముందుగా వాటిని వదిలేవారు. ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనకే వెళ్లేవారు. ఎముకలు గడ్డకట్టే చలిలో ఆహారం దొరకక, ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.

అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు. వారిని అమితంగా గౌరవించేవారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కూడా టిబెట్‌లోను, అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోను ఎటువంటి మార్పు రాలేదు కాని భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. దీనితో 1954లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించటానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వటం మానేసింది. ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకొని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించటానికి వెళ్లేవారు. అదెలాగున్నా 24 ఏళ్ల తర్వాత- 1978లో చైనా సర్కారు మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించటం ప్రారంభించింది.


ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించటం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారయింది. 1990ల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి మరింత కఠినమయింది. ఇదే సమయంలో- ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించటం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది. దీనితో 1995 తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేయటం మొదలుపెట్టింది. ఒకప్పుడు కేవలం పర్వత మార్గం ద్వారానే యాత్రికులకు అందుబాటులో ఉండే కైలాస పర్వతం దగ్గరకు హెలికాప్టర్ సర్వీసు కూడా ప్రారంభమయింది. దీనితో కైలాస పర్వతం సందర్శించటానికి రెండు మార్గాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. ఏ నిమిషంలో వాన పడుతుందో.. ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనటం చాలా కష్టం. అంతే కాకుండా కొన్ని సార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్‌లలో ప్రయాణం చాలా ప్రమాదం. పైగా ఖర్చు ఎక్కువ. దీనితో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల క్రితం టిబెట్‌లోని కొందరు బౌద్ధ బిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరగబడడంతో దాన్ని వెంటనే అణచి వేసినప్పటికీ చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సైన్యం టిబెట్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవటానికి వీలుగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే మానస సరోవరం, కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణం ప్రారంభించింది.

70 శాతం పూర్తి..

మానస సరోవరానికి, కైలాస పర్వతానికి చేరుకోవటానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది- నేపాల్ నుంచి టిబెట్‌లోకి ప్రవేశించి జాంగ్ము, సాగాల మీదుగా మానససరోవరం చేరుకోవటం. ఖాట్మండు నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్‌కు చేరుకోవటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది. వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి.. హఠాత్తుగా విరిగి పడే కొండచరియలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటిన తర్వాత జాంగ్మూకు చేరుకోవటానికి ఒకప్పుడు 12-14 గంటలు పట్టేది. ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని తారురోడ్లు వచ్చేసాయి.

అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతున్నారు. అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు, ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది 30 శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే.. ఈ సారి అది 70 శాతానికి పెరిగింది. దీని వల్ల పన్నెండు నుంచి పదహారు గంటలు పట్టే ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమయింది.

వచ్చే ఏడాది మానస సరోవర యాత్ర ప్రారంభమయ్యే నాటికి సాగా నుంచి మానస సరోవరానికి ఆరు గంటల్లో వెళ్లిపోవచ్చంటే అతిశయోక్తి కాదు. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్‌క్యాంపు దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాది బేస్‌క్యాంపు నుంచి కైలాస పర్వతం కింది దాకా జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే- కైలాస పర్వతానికి నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. అంటే వచ్చే రెండు,మూడేళ్లలో- మానస సరోవర యాత్ర- చాలా మందికి ఒక పిక్నిక్‌గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనంగా ఐదు వేల యువాన్‌లు- అంటే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఉక్కు కవచం..


ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానససరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం.. మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటడానికి (అంటే టిబెట్‌లో ప్రవేశించటానికి) ఎంత సమయం పడుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దలైలామా గురించి కాని.. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం గురించిగాని పుస్తకాలు పట్టుకెళితే - వారికి టిబెట్‌లో ప్రవేశం ఉండదు.

ఈ ఏడాది జాంగ్ము, సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయటాన్ని కూడా చైనా సైన్యం నిషేధించింది. సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువుల, బౌద్ధుల ఇద్దరి విశ్వాసమూ. అందువల్ల చాలామంది ఈ నదీ తీరాన ప్రార్థనలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉం టారు. అయితే ఈ నదీతీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయటాన్ని.. ఫోటోలు తీయటాన్ని ఈ ఏడాది కొత్తగా నిషేధించారు. ఇక మానససరోవర ప్రాంతంలోని గుడారాలలో నివసించే వారిని చైనా సైన్యం అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి తీర్థయాత్రలోని ఆనందాన్ని మనకు తగ్గించేస్తున్నాయని చైనావాళ్లు గుర్తిస్తున్నట్టు లేరు.

ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం

కైలాసపర్వతాన్ని టిబెటన్ భాషలో రిన్‌పోచి అని పిలుస్తారు. ప్రతి ఏడాది వేల మంది హిందూ భక్తులు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. టిబెటన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతంపై పాదం మోపటం పాపంగా భావిస్తారు. అందువల్ల వీరు మోకాళ్లపై కైలాస పర్వతాన్ని ఎక్కుతారు. హిందువులు ఎక్కువగా కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కాని పర్వతాన్ని అధిరోహించరు. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి గతంలో ప్రయత్నించారు. అయితే ఏదో ఒక కారణం వల్ల ఈ ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. 1926లో హ్యుగ్ రటిల్ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదు అయిన తొలి ప్రయత్నం. 1936లో హ్యుబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించాడు.

అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రిన్‌హోల్డ్ మెస్‌నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్‌నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్‌కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.

అతి పవిత్రం మానస సరోవరం..

* బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు.
* సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.
* భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
* మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
* చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఒక హోటల్‌ను కూడా నిర్మిస్తోంది. ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవర పవిత్రత దెబ్బతింటుందని.. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతమంతా శక్తిమయం

సైన్స్ ప్రకారం- కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి (ఎనర్జీ) ఉంటుంది. దానిని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలు. నేను ఈ ప్రాంతానికి గత ఏడేళ్లుగా వస్తున్నాను. వచ్చిన ప్రతి సారి ఒకో విధమైన అనుభూతి ఏర్పడుతూ ఉంటుంది. దానిని నేను మాటల్లో వర్ణించలేను. మానస సరోవరంలో రాత్రి వేళ అనేక కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కనిపించే శక్తిరూపాలు. ఇక కైలాస పర్వతం గురించి చెప్పాలంటే ఆదిముని- ఈశ్వరుడు మానవ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించటానికి మొదట ఈ ప్రాంతానికే వచ్చాడు. మూడు నాలుగు నెలల పాటు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఈశ్వరుడిని చూడటానికి పెద్ద గుంపు తయారయింది. ధ్యానంలో ఉన్న యోగి ఏవో అద్భుతాలు చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.

రోజులు గడుస్తున్నాయి. ఎటువంటి అద్భుతాలు జరగటం లేదు. గుంపు పలచబడింది. ఏడుగురు మాత్రం మిగిలారు. ఈశ్వరుడు కళ్లు విప్పాడు. ఆ ఏడుగురు తమకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు. తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. ఈశ్వరుడు అప్పుడు ప్రసాదించిన విజ్ఞానం- ఈ పర్వత సానువుల్లో ఉంది. ఈ విజ్ఞానం శక్తి రూపంలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు దానిని నిలబెట్టడానికి కొన్ని కర్రలు అవసరమవుతాయి. ఈ పర్వత శ్రేణులు కూడా అలాంటివే. అమూల్యమైన విజ్ఞాన భాండాగారాన్ని తమలో దాచుకున్నాయి. ఈ విజ్ఞానాన్ని అందుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. నిబద్ధత అనివార్యం. ఈ రెండు ఉన్నవారు మాత్రమే ఈ ప్రాంతానికి రాగలుగుతారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి 'నేను' అనే అహం చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే నిష్ఠగా, ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చినవారికి అనేకమైన అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి.

(జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. గత ఏడేళ్లుగా మానస సరోవర్ యాత్రను నిర్వహిస్తున్నారు. మానస సరోవరం, కైలాస పర్వతం అనుపానులు తెలిసినవారు. ఈ ఏడాది కూడా ఆ సంస్థ ఆధ్వర్యంలో మూడు వందల మందికి పైగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి వచ్చారు.)

గామా బ్యాగులు, డైమాక్స్ మాత్రలు

సముద్ర మట్టానికి 2,500 మీటర్లు (దాదాపు ఎనిమిదివేల అడుగులు) కన్నా ఎక్కువ ఎత్తుకు ఎక్కినప్పుడు- ఆరోగ్యపరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలామందికి కొద్దిగా తలనెప్పి వస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతూ ఉంటాయి. పర్వతాలు ఎత్తు పెరుగుతున్న కొలదీ- ఆక్సిజన్ శాతం తగ్గుతూ వస్తుంది. ఈ ఇబ్బందిని తట్టుకోవటానికి- ఈ మధ్య కాలంలో డాక్టర్లు 'డైమాక్స్' అనే టాబ్‌లెట్‌ను వాడాలని సూచిస్తున్నారు. డైమాక్స్‌ను వాడిన తర్వాత కూడా కొందరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది.

పర్వతాలలో ఉండే పరిస్థితులను మన శరీరం తట్టుకోలేకపోయినప్పుడు- ఊపిరితిత్తులలోకి నీరు చేరుతుంది. కొందరికి మెదడులో కూడా నీరు చేరుతుంది. ఇలాంటి వారిని వెంటనే పర్వతాల నుంచి కిందకు తీసుకురావాల్సి ఉంటుంది. వారి కోసం ఈ మధ్యకాలంలో 'గామా బ్యాగ్స్' అందుబాటులోకి వచ్చాయి. ఈ బ్యాగ్‌లలో వాతావరణ ఒత్తిడి (ప్రెజర్) పర్వత ప్రాంతాల్లో కన్నా తక్కువగా ఉంటుంది. అక్సిజన్‌ను అందించే సదుపాయం కూడా ఉంటుంది.

* సివిఎల్ఎన్ ప్రసాద్


 http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/sep/4/coverstory&more=2011/sep/4/sundaymain

'సంస్కృతి”మారితే ఏమవుతుంది?

''కల్చర్‌'' అనే ఆంగ్లపదాన్ని తెలుగులో ఇతర భారతీయ భాషలలో ''సంస్కృతి'' అనే సమానార్థక పదంగా వాడుతున్నాయి. కల్చర్‌ అనే మాటకు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో భూమిని దున్నటం అనే అర్థం ఒకటి ఇచ్చారు, ఇది కూడా సబబే. (అగ్రికల్చర్‌) -మనస్సును శరీరాన్ని సంస్కరించటం కూడా సంస్కృతియే కదా? కల్చర్‌ శబ్దానికి అదే (ఆంగ్ల నిఘంటువులో ఇలా మరొక అర్థం ఇచ్చారు'' ఇంటలెక్చువల్‌ డెవలప్‌మెంట్‌ పర్టిక్యులర్‌ ఫాం -స్టేజ్‌, ఆర్‌, టైప్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్‌ సివిలిజేషన్‌ -( ద ట్రు -లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌)
ఈ నిర్వచనాన్ని బట్టి తేలే సారాంశమేమంటే

(1) సంస్కరించేది సంస్కృతి.
(2) సంస్కృతి నాగరికత సమాన భావాత్మకంగా ఉంటుంది.

ఈ విధంగా చూస్తే పైకి రూపభేదం ఉన్నా అంతర్లీనంగా ప్రవహించే సమాన భావధారను సంస్కృతి అనవచ్చు. పాలతో సందేశ్‌, కలాఖండ్‌, దూద్‌పేడా, పాయసం వంటి ఎన్నో మధుర పదార్థాలు తయారు చేయవచ్చు. అన్నింటికీ మూలం పాలే. నెక్‌లెస్‌, కంకణం, గండపెండేరం, కర్ణాభరణము, ముక్కెర-ఇలా ఆభరణాలు వేరైనా అన్నీ బంగారానికి భిన్న రూపాలే -సంస్కృతి కూడా అలాంటిదే.

కేరళలో ధరించే దుస్తులు వేరు -ఆంధ్రులు ధరించే దుస్తులు వేరు. తమిళులు పంచెకడితే ఆంధ్రులు బిళ్లగోచీ కడతారు. బెంగాలీ పంచె కట్టు మరో రకంగా ఉంటుంది. ఇక భాషా పరంగా చూసినప్పుడు మలయాళం, పంజాబీ, పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కన్పడుతాయి. ఆహారపు అల వాట్లు సరేసరి -కేరళలో పుష్కలంగా కొబ్బరి నూనెను వాడుతారు. అవియల్‌ వంటి కొబ్బరి వంటకాలు చేసుకుంటారు. కాని పంజాబ్‌లో సర్షప్‌ ఉపయోగిస్తారు అంటే ఆవనూనె, ఆవగరికెలతో వంటకాలు చేస్తారు. ఈ విధంగా చూసినప్పుడు పంజాబు సంస్కృతి కేరళ సంస్కృతి వేరే అని చెప్పాలి. కాని అది నిజం కాదు ఎందుకంటే కేరళలోని అయ్యప్పను దర్శించుకునే నిమిత్తం పంజాబునుండి భక్తులు వస్తారు. పంచనదీ స్నానం కోసం తమిళనాడు నుండి కూడా భక్తులు వస్తుంటారు. పంజాబులో పుట్టిన సుఖదేవ్‌ రాజగురు, భగత్‌సింగ్‌ వంటివారిరై రంజిత్‌సింగ్‌ వంటి పాలకులపై మొత్తం భారతదేశంలోని వారందరికీ సమాన గౌరవం ఉంది. అలాగే ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలను పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలపై భారత దేశంలోని వారందరికీ సమాన గౌరవ ప్రతిపత్తి ఉంటుంది. అంటే వీరంతా ఒకే సంస్కృతికి చెందినవారు అని అర్థం.

మొన్న శ్రీరామ నవమి ఉత్సవం వచ్చింది. రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, భారతీయులందరికీ పూజనీయులే. అమెరికాలో అబ్రహాం లింకన్‌ను జార్జి వాషింగ్‌టన్‌ను మాత్రమే ఆరాధిస్తారు. అంటే ఇక్కడ సాంస్కృతిక భేదం ఉన్నదని అర్థం. ఆవిధంగా చూస్తే భారతభూమి యొక్క అఖండతను సార్వభౌమాధికారాన్ని గుర్తించని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. రాముణ్ణి కృష్ణుణ్ణి కృష్ణదేవరాయలను హేళన చేసేవారూ ఉన్నారు. వారు ఈ దేశంలో పుట్టిన ఈ సంస్కృతికి చెందినవారు కాదు అని అర్థం. కాబట్టి సంస్కృతి జన్మసిద్ధం కాదని సిద్ధాంతీకరింపవలసి ఉంటుంది. అంటే సంస్కృతి భావాత్మకం అని అర్థం!

కమ్యూనిజం ఎక్కడైనా వ్యాపించాలంటే ముందుగా స్థానిక సంస్కృతిని నిర్మూలించాలని వారి సిద్ధాంతం - రామునిపైన శివునిపైనా గౌరవం ఉన్నంతకాలం ఒక భారతీయుడు కమ్యూనిస్టు కాజాలడు. అలాగే దుర్గ, హనుమంతుడు లక్ష్మీదేవిలను పూజించేవాడు క్రైస్తవుడు కాజాలడు. అందుకే ఒక వ్యక్తి, హిందువు, క్రైస్తవమత స్వీకారం చేసిన వెంటనే బొట్టుతుడిపి వేస్తాడు. గాజులు పూలు తీసివేస్తారు. పూజామందిరం నుండి శివుడు, విష్ణువు, రాముడు, హనుమంతుడు వంటి దేవతామూర్తుల విగ్రహాలను వీధిలో పారేస్తాడు. అంటే మతం మార్పిడిలో సాంస్కృతిక పరివర్తన జరుగుతున్నది అని అర్థం.

నేను అమరనాధ్‌ యాత్రచేయలేదు. మౌంట్‌ ఆబూ వెళ్లలేదు. కాని అమరనాథ్‌ శివలింగం మీద మౌంట్‌ ఆబూలోని ఆలయాల మీద బ్రహ్మకుమారీల మీద గౌరవం ఉంది. అంతేకాదు మక్కా -జెరుసలేములమీద ప్రేమ ఉంది. అది హిందువుల విశాల హృదయం. కాని ఒక హిందువు ముస్లింగా లేదా కమ్యూనిస్టుగా మతపరివర్తన పొందిన వెంటనే అతడు కాశి, మధుర, జెరుసలేంలను ఎందుకు ద్వేషిస్తున్నాడు? దూషిస్తున్నాడు? ఆలోచించండి. పరమత సహనం కేవలం హిందువుల ముఖాన్నే బ్రహ్మదేవుడు వ్రాసి పంపించాడన్నమాట!

స్వీయ ధర్మ సంరక్షణకోసం క్రైస్తవులు చేసే మత యుద్ధాలను క్రూసేడ్స్‌ అంటారు. ముస్లింలు చేసే యుద్ధాలను జీహాదీ అంటారు. మరి హిందువులు స్వధర్మ రక్షణకోసం పోరాడితే దానిని ఏమంటారు? కాషాయ తీవ్రవాదోన్మాదం అంటారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వసిష్టుడు, ఛత్రపతి శివాజీ ధరించింది కాషాయ జండానే. సన్యాసులంతా కాషాయి వస్త్రాలే కట్టుకుంటారు. అంటే సాధువులు సన్యాసులంతా తీవ్రవాదులా?

కాబట్టి సారాంశం ఏమంటే సంస్కృతి నాగరికత, వారి మానసిక అంతర్లీన ప్రవాహంలో ఉంటుంది. శైవులు శివరాత్రిని వైష్ణవులు రామనవమి గోకులాష్టమినీ చేసుకుంటారు. ఐనా శివునిమీద విష్ణువుమీద సమాన గౌరవం ఇరువురి హృదయాల్లో ఉంటుంది. ఒకవేళ గౌరవం లేకపోయినా ద్వేషం మాత్రం ఉండదు. ఇదే''కామన్‌ కల్చర్‌'' (సమాన సంస్కృ తి) అనే పదానికి నికషోపలం (కసౌటీ) గా భావింపవచ్చు.

భారతదేశంలో నేడు నూటఇరవై కోట్ల మంది జనాభా ఉంది. వీరి ఆచారాలు మతగ్రంథాలూ పండుగలు వేరువేరుగా ఉన్నాయి. ఐనా కామన్‌ కల్చర్‌ ఒకటి ప్రధానంగా ఉంది. అదే హిందూ సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి. క్రైస్తవులూ హేతువాదులు, ముస్లింలు, కమ్యూనిస్టులూ ఈ ప్రధాన సంస్కృతే ప్రవాహాన్ని గౌరవింపవలసి ఉంది. ఒకవ్యక్తి మతం మార్చుకున్నంత మాత్రాన తమ పూర్వీకుల పరంపరను ద్వేషించటం తగునా? బుచ్చయ్య కొడుకు అలగ్జాండరు. ఆయన కొడుకు ప్రభుకిరణ్‌.

అస్పృశ్యుడైన బుచ్చయ్యను ఒక ఫాదరీ చేరదీసి అన్నోదకాలు కల్పించాడు. దానితో బుచ్చయ్య క్రైస్తవ ప్రార్థనలు వరంగల్‌ (1905) మొదలుపెట్టాడు. మూడు తరాలు మారే సరికి బుచ్చయ్యగారి శైవంమీద ఆయన మనుమళ్లకు ద్వేషం ఏర్పడింది. అంటే ఇక్కడి ఆరాధనా విధానాలు పండుగలు సంప్రదాయాలు వేషధారణలు వారు పాటించరు. దీనిని సాంస్కృతిక పరివర్తన అంటారు. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో సాంస్కృతిక పరివర్తనలు అనేకసార్లు జరిగాయి. రోమనుల సంస్కృతిని తర్వాతి కాలంలో క్రైస్తవం నిర్మూలించింది. గ్రీసు దేశంలోని ప్రజలు తమ ప్రాచీన దేవతలైన అపోలో, జియస్‌ హీరా, గోట్‌గాడ్‌ (పవనసుత హనుమాన్‌) ఎధీనా (దుర్గాదేవి)లను మ్యూజియంలలో మాత్రమే చూసుకుంటాము. కారణం ఇప్పుడక్కడ రెండువేల ఏళ్లనాటి గ్గరీకు సంస్కృతి నిర్మూలింపబడింది. ఆర్థడాక్స్‌ క్రైస్తవం గ్రీసును ఆక్రమించింది. ఇలాగే మెక్సికోలో కూడా జరిగింది. అనేక ఆఫ్రికా దేశాల్లో జరిగింది. ఆఫ్రికనుల ప్రాచీన సంస్కృతి దేవీ దేవతలు అక్కడ లేరు. నల్లతోలు గల తెల్లసంస్కృతి మాత్రమే ఆఫ్రికాను పరిపాలిస్తున్నది. ఇండియాలో కూడా ఇదే పరివర్తనజరుగుతున్నది.

సాంస్కృతిక వినిమయం -విచ్ఛేదం జరిగితే నష్టం ఏమిటి? అం దరూ మానవులే కదా? అనే వాదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. సాంస్కృతిక పరిణామం మతం మార్పిడి జరిగిన మరుక్షణమే ఆ ప్రాంతం భారత ప్రధాన భూభాగం నుండి విడివడిపోతున్నది. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ బంగ్లాదేశ్‌ వంటి దేశాలను అందుకు ఉదాహరణలుగా చూపవచ్చు. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో క్రైస్తవం బాగా వ్యాపించింది. వారు తాము భారత దేశంలో అంతర్భాగం అని చెప్పుకోవడానికి ఇష్టపడటంలేదు. ''మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే మేము ఇండియాలో ఎందుకు ఉండాలి?'' అని ఒక విద్యార్థి అన్నట్లు కెసిఆర్‌ ప్రకటించారు. అంటే ఆ విద్యార్థి చైనా భావజాలంతో కూడిన విద్యార్థి సంఘానికి చెందినవాడు అనేది సుస్పష్టం.''

''నూరు పూలు వికసింపనివ్వండి నూరు భావాలు వ్యాపింపనివ్వండి'' ఈ నినాదం ఎంతో బాగుంది -ఇది మావోసేటుంగ్‌ గారిది -ఒక సోషలిస్ట్‌ రాజ్యం మరొక సోషలిస్ట్‌ రాజ్యంపై దండయాత్ర చేయదు ఈ నినాదం కూడా వారిదే మరి చైనా రష్యాపై ఎందుకు దండయాత్ర చేసింది. అమాయకులను లక్షలాది టిబెటన్లను ఎందుకు పొట్టన పెట్టుకున్నది. ఆరు లక్షల బౌద్ధవిహారాలలో ఎం దుకు నేలమట్టం చేసింది. కారణం ఒకటే ఇది సంస్కృతుల మధ్య సంగ్రామం -చైనా సామ్రాజ్యవాదానికి నిలువెత్తు దర్పణం!

ఎవడైనా కాస్త పచ్చగా ఉంటే వాడికి బూర్జువా అనే టాగ్‌ తగిలించి హతం ఖతం అంటూ వచ్చిన సామ్యవాదం ఎలాంటి భయంకర సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసిందో గమనించారా?

టిబెట్టు ఆదర్శ రాజ్యం కాకపోవచ్చు, ఇరాక్‌లో తప్పిదాలు ఉండవచ్చు. వారిని వారే సవరించుకుంటారు. వారి సంస్కృతులను నిర్మూలించవలసిన అవసరం, అధికారం మావోకు -జార్జిబుష్‌కు ఎవరిచ్చారు? లిబియాలో గఢాఫీ నిరంకుశుడు -అతనిని ఆ దేశ ప్రజలు శిక్షించాలి. అంతేకాని ఆ సాకుతో అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు, లిబియా మీద ఎందుకు దాడిచేశాయి? అంటే అక్కడి పెట్రోలు కోసం -ఇక్కడ వ్యాపార సంస్కృతియే విజయం సాధిస్తున్నది. ఇలా ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.

కాబట్టి సారాంశం ఏమంటే సాంస్కృతిక నిర్మూలన ద్వారా ఆ దేశాన్ని పాదాక్రాంతం చేసుకోవచ్చునని లోగడ ఎందరో పాశ్చాత్యులు గ్రహించారు. భారతీయ సంస్కృతీ నిర్మూలనకై అరబ్బు దేశాలు అమెరికా మతాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే చైనావర్గ సంఘర్షణను ఉపయోగించింది. ఈ సంక్లిష్ట పరిస్థితి నుండి భారత జాతి ఎలా బ్రతికి బట్టకడుతుందో మేధావులు చెప్పాలి.

శాంతి సహనం సత్యం అహింస ప్రేమ త్యాగం దయ-ఇవన్నీ వినడానికి ఎంతో అం దంగా ఉంటాయి-కాని దుర్మార్గుడైన శక్తిమంతుని ముందు దలైలామా లాంటి శాంతిదూతలు పరాజితులైనారు. ఈ అంశం, మనకు ఇస్తున్న సందేశం ఏమిటి? ఏసు గ్రీకు హిస్టరీ చదువుతున్నప్పుడు అందులో ఒక వాక్యం నన్ను ఆకర్షించింది‘‘The great Hellernie culture is destroyed by some unknown barbarians’’సోమనాథ దేవాలయం విషయంలో కూడా అలాగే జరిగుండాలి. భారత దేశంలో యుద్ధాలు వచ్చినప్పుడు శత్రువులు ఆవుమీద ఒక బ్రాహ్మణుణ్ణి ఎక్కించి ముందు వరుసలో నిలిపే వారు. గోబ్రాహ్మణ వధ నిషేధం కాబట్టి శత్రువులు అస్త్రసన్యాసం చేసేవారు. ఈ నియమాలు గజనీ మహమ్మదుకు వర్తించవు అని ఈ మూర్ఖులకు తెలియలేదు. ఫలితంగా సోమనాథ దేవాలయం పదిహేడుసార్లు దోపిడీకి గురి అయింది. ఇదంతా ఆర్థిక దృష్టిలోనే జరిగింది అని వామపక్ష మేధావులు వక్రభాష్యం చెప్పారు. అదే నిజమైతే వేల సంఖ్యలో మతం మార్పిడులు ఎందుకు జరిగినట్టు? చైనాలోని ప్రభువు యుద్ధవ్యతిరేకి బౌద్ధధర్మ ప్రేమికుడు. అలాంటి దేశాన్ని టిమోజిన్‌ అనే ఒక ఆటవికుడు కొలది సైన్యంతో నిర్మూలించాడు. చరిత్రలో ఇతనినీ ఛెంగిస్‌ ఖాన్‌ అంటారు. వీటన్నింటి సారాంశం ఒకటే. ప్రశాంత, సంస్కృతులు దుర్జన పదఘట్టనతో మొహంజోదారోలుగా నాగసాకి, హిరోషిమాలుగా మారటం చరిత్ర నేర్పిన (గుణ) పాఠం ఎడమచేతిలో పుష్పాన్ని ధరించి శాంతి ప్రవచనం చేసిన పద్మపాణి బుద్ధుడు కుడిచేతిలో కరవాలం కూడా పట్టుకోవాలి. అదే ''పద్మాపాశాంకుశ ధర'' దుర్గాదేవి ఇచ్చే సందేశం? అరవిందుడు సూచించిన అతి మానస యుగం వచ్చేవరకూ ఈ జాగ్రత్త తప్పనిసరి!

-ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌

ఔన్నత్యాన్ని మరువకూడదు


మానవాళి పుస్తక భాండాగారంలో మన ఋగ్వేదం ప్రథమ గ్రంథం. ఇతర దేశాలలో మానవులు అనాగరికులుగా ఉన్నప్పుడు, మన దేశంలో ప్రజలు సంస్కారవంతులుగా జీవించే వారు. షాహియాన్‌, హ్యూన్‌సాంగులు చైనా నుంచి రాయబారులుగా వచ్చి, మన దేశంలోని ప్రజల నీతి నియమాలను ఎంతగానో మెచ్చుకున్నారు. 'దొంగతనాలు లేవు.' తలుపులు తీసి ఉండేవి, ప్రజలకు అబద్ధం అంటే ఏమిటో తెలియదు, అంటూ ప్రశంసించారు. వైజ్ఞానికులుగా మనమేమీ తీసిపోము. సూర్య, చంద్రగ్రహణాలు సెకండ్లతో మన పంచాంగాలలో మొదటి నుంచి ఉన్నాయి. ఖగోళశాస్త్రం, ఇతర శాస్త్రాలతో సహా సాహిత్య పరమైన రచనా రంగాలలో ఎందరో మహనీయులున్నారు. ఆర్యభట్ట, వరాహ మిహురుడు, కాళిదాసు ఇందుకు ఉదాహరణలు. దైవముఖంగా వచ్చిన వేదాలు ఇప్పటివరకు ఉద్భవించినప్పటి నుంచి స్వరయుక్తంగా గురుశిష్య సంప్రదాయంగా ముఖత: రావడం ఒక అద్భుతమే. అసాధ్యమే. వేదోపనిషత్తులలోని ముఖ్యసూత్రాలు యావత్‌ మానవాళికి శాశ్వతంగా వర్తించేవి. 'సత్యం వదం ధర్మం చర', 'సత్యమేవ జయతే', 'త్యాగేనైన అమృతపుత్ర:' 'పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం' 'అహింసో పరమో ధర్మ:' ఇవన్నీ మన సంస్కృతిని చాటేవే. ఇవన్నీ హిందూధర్మానికి పునాదులు. ఐన్‌స్టీన్‌ ఇలా అన్నారు.' 'సున్నా హిందువులు ఇచ్చినదే. దీనివల్లనే వైజ్ఞానిక శాస్త్రం పెరిగింది. ఇందుకు మనం హిందువులకు ఎంతో రుణపడి ఉన్నాం'. పాశ్చాత్యులే భగవద్గీత విశిష్టతను ఎంతగానో కొనియాడారు. ప్రపంచ విఖ్యాత బ్రిటిష్‌ చరిత్రకారుడు ఆర్నాల్డ్‌ టాన్చీ ఇలా అన్నారు'. 'పాశ్చాత్య నాగరికత పతన దశలో ఉంది. ప్రస్తుత మానవాళి ప్రమాద పరిస్థితులలో బుద్ధుడు, గాంధీ ఇచ్చిన భారతీయ మార్గమే శరణ్యం'. చికాగోలో వివేకానందుని ఉపన్యాసం విన్న తర్వాత ఒక ప్రఖ్యాత దినపత్రిక 'ఇంత విజ్ఞాన వంతమైన భారతదేశానికి, మిషనరీలను పంపడం ఎంతో తెలివితక్కువ' అంటూ వ్యాఖ్యానించింది. ఇక మన వేదోపనిషత్తుల ఘనతను ఎందరో ప్రముఖ పాశ్చాత్యులే ప్రశంసించారు.

మాక్స్‌ముల్లర్‌, స్కోపన్‌హోర్‌ మాటల్లో చెప్పాలంటే. ఉపనిషత్తులలోని అత్యున్నతమైన, తేజోవంతమైన సత్యాలు, బోధనలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఇవి సర్వమానవాళికి వర్తించేవి. నిత్య జీవితానికి శాంతిని, ఆనందాన్ని ఇచ్చేవి. మరణ సమయంలో కూడా వేకువలో సూర్యరశ్మి లాగా, నిర్మలమైన కొండ గాలి లాంటివే అవి. అర్థం చేసుకుంటే ఎంతో సుళువు. హిందూ మతం లేకపోతే నలందా, తక్షశిల, ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయాలకు ఉనికి ఉండేదే కాదు. పాశ్చాత్య పాలనలో నష్టపోయిన స్వధర్మాన్ని పునరుద్ధరించుకోవడం మన కర్తవ్యం. చక్రవర్తి రాజగోపాలాచారి ఇలా అంటున్నారు, 'వివేకానందుడు హిందూధర్మాన్ని రక్షించాడు. హిందూ ధర్మం ఉంది కాబట్టే స్వాతంత్య్ర సమరం శాంతియుతంగా జరిగింది. లేకపోతే స్వాతంత్య్రం వచ్చేది కాదు. అందుకే స్వతంత్ర భారతావని వివేకానందునికి ఎంతగానో రుణపడి ఉంది.' గోపాలాచారి గారు రామాయణ, భారతాలపై ఆంగ్లంలో పలు గ్రంథాలను రచించి, హిందూ ధర్మం గొప్పతనాన్ని తేటతెల్లం చేశారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కూడా భగవద్గీత గీతపై వ్యాఖ్యానాలను రచించి భగవద్గీత అమూల్య సందేశాన్ని అందరికీ తెలియచేశారు. ఆయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. నోబుల్‌ లా రియల్‌ రిచెర్డ్‌ ఎర్నెస్ట్‌ అభిప్రాయం ప్రకారం, 'భారతీయులు (హిందువులు) జ్ఞాపకశక్తికి, సహజ ఆలోచనకు, మేధస్సుకు, పరిపూర్ణ విజ్ఞానానికి కారణం భారత, భాగవత రామాయణ, గీతలలోని పరిజ్ఞానమే' 'మన పూర్వీకుల ఘనతను మనమే విస్మరిస్తే భారతదేశానికి భవిష్యత్తు లేదు అని వివేకానందుడు అన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మన దేశపు ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ మున్ముందు ఎన్ని జన్మలెత్తినా భారత దేశంలోనే జన్మించాలని కోరుకున్నాడు. గాంధీ అంతటి గొప్ప నాయకుడు మరెవరైనా ఉన్నారా? ఒక బ్రిటిష్‌ ప్రఖ్యాత పత్రిక మాటల్లో ఒక్క భారత దేశమే, ఒక్క హిందూ మతమే, గాంధీ మహాత్మునికి జన్మనివ్వగలదు.' గాంధీ మన దోషాలను మనమే సవరించుకుందాం అని అన్నారు. ఇతరుల జోక్యం అవసరం లేదన్నారు.

సత్యసాయి బాబా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా సూత్రాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఆయన జన్మించిన పుట్టపర్తి అన్నిమతాలవారికి కేంద్రం ఔతున్నది. సత్యసాయి సేవా కార్యక్రమాలు, వైద్య, విద్యావిధానాలు ప్రపంచానికే ఆదర్శం. బ్లిట్జ్‌ సంపాదకుడు కరంజియా సత్యసాయి గురించి చెబుతూ, ఈ భారతీయుడు భగవత్స్వరూపుడు అని అన్నారు.

డాక్టర్‌ అంబేద్కర్‌ గొప్ప దేశభక్తుడు, హిందూమతం నుంచి వచ్చిన బౌద్ధమతమే తీసుకున్నాడు. హింసతో కూడిన, విచ్చలవిడితనంతో కూడిన పాశ్చాత్య మతాలు మనకు ఎంతమాత్రం వద్దని పదే పదే చెప్పాడు.

పాశ్చాత్య దేశాలలో క్రైస్తవం క్షీణిస్తోందని పోప్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ చర్చిలకు వెళ్ళేవారు తగ్గుతున్నారు. మన దేశంలో హిందూమత ప్రాబల్యం వల్లనే ప్రజాస్వామ్యం ఉంది. మిడి మిడి జ్ఞానంవారి వల్ల దేశం ముందంజ వేయలేదు. పరిపూర్ణ విజ్ఞానం అవగాహన ఉన్నవారే దేశాన్ని రక్షించగలరు. బ్రిటిష్‌ ప్రధాని బ్రిటన్‌లో ఇతర జాతుల వారు ఎందరో ఉన్నా, బ్రిటన్‌ క్రిస్టియన్‌ దేశం అన్నప్పుడు, భారతదేశం సనాతన ధార్మిక దేశం ఎందుకు అవకూడదు?

తిలక్‌, గోఖలే, గాంధీ లాంటి నాయకులు మన ధర్మంలోని విశిష్టతను చాటి క్రైస్తవం మన దేశాన్ని ఈ ఉద్యమాన్ని పూర్తిగా కబళించకుండా ఆపారు. మన ధర్మం అందరినీ ఇముడ్చుకొనేది. ఎవ్వరినీ వెలివేయదు. సత్యం ఎప్పటికైనా నెగ్గుతుంది.

-ఈమని సువర్ణం


http://www.prabhanews.com/specialstories/article-274536

భారతీయ ముస్లింలలో కుల అసమానతలు: యోగీందర్ శిఖండ్ పరిశోధన



హిందువులలాగే భారతీయ ముస్లింలలో కూడా కుల విభజనలు ఉన్నాయి. కుల వ్యవస్థని ఉర్దూ బాషలో జాత్, జాతి, బిరాదెరీ అనే పదాలతో వ్యవహరిస్తారు. ఇస్లాం మతం కుల వ్యవస్థని ప్రతిపాదించకపోయినా భారతీయ ముస్లింలలో కూడా కుల పట్టింపులూ, కుల సుప్రీమసీ భావాలూ కనిపిస్తాయి. హిందూ సంప్రదాయం అయిన కుల వ్యవస్థని ముస్లింలు ఎందుకు ఆచరిస్తున్నారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పై వాళ్ళ పక్క ఇళ్ళళ్ళో నివసించే హిందువుల ప్రభావం కూడా పడుతోంది. భారత దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కనుక హిందువుల ఆచారాలలో కొన్ని భారతీయ ముస్లిం సమాజంలో చేరడం విచిత్రం కాదు. కులం కట్టుబాట్లు కూడా భారతీయ ముస్లింలలో ఈ విధంగా చేరి ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. భారతీయ ముస్లింలలో కులం కట్టుబాట్ల గురించి ఉలేమా (ముస్లిం పండితులు) ని అడిగితే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇస్లాం మతం కుల వ్యవస్థని ప్రభోధించలేదు కానీ ముస్లిం పండితులు కూడా కులం కట్టుబాట్లని ఆచరిస్తున్నారు. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళు దేవుడిని, కర్మకాండలు (rituals) ని మార్చుకున్నారు కానీ చాలా సంప్రదాయాలని మార్చుకోలేదు. వాళ్ళు ఇస్లాం మతంలోకి మారకముందు ఆచరించిన సంప్రదాయాలని ఇప్పుడు కూడా ఆచరిస్తున్నారు. హిందూ సంప్రదాయాలని పూర్తిగా కాకుండా పాక్షికంగా ఆచరిస్తున్నారు. కులం కట్టుబాట్ల విషయంలో మాత్రం హిందూ సంప్రదాయాల ప్రభావం ముస్లింలపై ఎక్కువగానే కనిపిస్తోంది.

 హిందూ మతం వదిలి ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళలో ఎక్కువ మంది శూద్ర కులాల వాళ్ళు. పర్శియా (ఇరాన్), అరేబియా, టర్కీ, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చిన ముస్లింలు తమని తాము ఉన్నత జాతీయులగానూ, ఇస్లాం మతంలోకి మారిన శూద్రులని అల్ప జాతీయులగానూ భావిస్తారు. ఉన్నత జాతి ముస్లింలని అష్రాఫ్ అనీ, అల్ప జాతి ముస్లింలని అజ్లాఫ్ అనీ అంటారు. అల్ప జాతి ముస్లింలకి రజిల్, కమీనా అని కూడా పేర్లు ఉన్నాయి. అజ్లాఫ్ (దిగువ కుల) ముస్లింలలో ఎక్కువ మంది ద్రవిడులు (నల్లని శరీర ఛాయగల వారు) కావడం వల్ల కూడా వాళ్ళని అష్రాఫ్ (ఉన్నత కుల) ముస్లింలు హీనంగా చూడడం జరుగుతోంది. అజ్లాఫ్ ముస్లింలలో ఎక్కువ మంది చేతివృత్తిదార్లు, పేద రైతులు. ముస్లిం పండితులలో ఎక్కువ మంది ఉన్నత కులాలకి చెందిన వాళ్ళు కావడం వల్ల కులం కట్టుబాట్ల ప్రశ్న గురించి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. భారతీయ ముస్లిం సమాజంలో కులం కట్టుబాట్లని రద్దు చెయ్యడానికి ప్రయత్నాలు సరిగా చెయ్యడం లేదు. కొంత మంది ముస్లిం పండితులు కుల వ్యవస్థ ఇస్లాం మతానికి వ్యతిరేకం అని చెపుతున్నప్పటికీ వాళ్ళు కూడా ముస్లిం సమాజంలో కులం కట్టుబాట్లని రద్దు చెయ్యడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు.  
ముస్లిం మత పెద్దలు కూడా కులాలని ఆచరిస్తున్నప్పుడు సాధారణ ముస్లింలు కులాలని వదులుకోవడం కష్టమే. కులం కట్టుబాట్లకి మతం ఒక్కటే కారణమనుకోలేము. ఇందులో ఆర్థిక అసమానతల పాత్ర ఎక్కువ. పూర్వం హిందువులలో అగ్రకులాలవాళ్ళ పిల్లలకే చదువుకునే అవకాశం ఉండేది. అలాగే ముస్లింలలో ధనికుల పిల్లలకే చదువుకునే అవకాశం ఉండేది. తుగ్లక్ చక్రవర్తుల దగ్గర జియా-ఉద్-దీన్ బరాని అనే మంత్రి ఉండేవాడు. అతను పేద ముస్లింలు చదువుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అతను తుగ్లక్ చక్రవర్తులతో ఇలా అనేవాడు "పేద రైతు కొడుకు చదువుకుంటే అతను శిస్తు వసూలు అధికారి అవుతాడు, శిస్తు వసూలు అధికారి పదవి వచ్చిన తరువాత ఆ పదవితో సంతృప్తి పడకుండా రాజు అవుతానంటాడు. అతను కుట్ర పన్ని రాజునే పడగొడతాడు" అని. అప్పట్లో డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళని చదువుకోనివ్వకుండా అలా చేసేవాళ్ళు. కులం కట్టుబాట్లు బలంగా ఉంటే ఒక వర్గంవాళ్ళని చదువుకోనివ్వకుండా చెయ్యడం చాలా సులభం. అందు వల్ల కూడా ముస్లింలలో కుల వ్యవస్థని బలంగా ఏర్పాటు చేసి ఉండొచ్చు

 http://samajikasastralu.in/articles/muslim_society/23072011_1.html