20, ఫిబ్రవరి 2012, సోమవారం

గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు?


ఒక సందర్భంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారికి వచ్చిన అనుమానం. నిజమే గత చరిత్రని పరిశిలించి చూస్తే భారత దేశం ఎప్పుడూ తనంత తానుగా ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు. ఎప్పుడూ ఇతర దేశాల నుండి ధనం కోసం, బంగారం కోసం, మత వ్యాప్తి కోసం చేసే యుద్ధాల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడమే సరిపోయింది. ఇక్కడ ప్రబలంగా వున్న వైదిక జీవిత విధానంలో యుద్ధాలకి చోటే లేదు. (దీన్నే తరువాతి కాలంలో హిందూ మతమని మన మీదెక్కి తొక్కిన వాళ్ళు అంటే మనమూ చంకలు గుద్దుకుంటూ దానికి తందాన అంటున్నాము). నిజం చెప్పాలంటే ప్రపంచంలోని రెండు ప్రధాన మతాలయిన క్రైస్తవ, ఇస్లాం మతాలు తమ మత వ్యాప్తి కోసం మధ్య యుగాల్లో రక్తాన్ని ఏరులై పారించాయి. క్రైస్తవ మత యుద్ధాన్ని "క్రూసేడ్" అని, ముస్లిములు మతవ్యాప్తి కోసం చేసే యుద్ధాన్ని "జీహాద్" అని అంటారు. కాని మన సంస్కృతిలో మతానికన్నా మనిషికే ప్రాధాన్యత ఎక్కువ. ఇతర మతాల్లో, ఒకవ్యక్తి తాను అనుసరించే మతాన్ని మిగావారు అనుసరించకపోతే, వారు సొంత కొడుకయినా, కూతురయినా, భార్య అయినా, ఆఖరికి ప్రాణ స్నేహితుడయినా సరే, కత్తికి బలిపెట్టామని వారి "పవిత్ర గ్రంధాల్లో" రాసి వుంటుంది. కాని మతాన్ని బలవంతంగా ఇతరులపై రుద్దమని ఏ హిందూ సిద్ధాంతమూ చెప్పలేదు.

వేదాల్లో వున్న శ్లోకాల్ని ఒకసారి పరిశిలిస్తే మనవారు ప్రపంచ శాంతికి, సాటి మనిషి వున్నతి కోసం ఎంత పరితపించారో మనకి అర్ధ్మ అవుతుంది. "సర్వేత్ర సుఖినస్సంతు" అంటే మానవులందరూ సుఖంగా వుండాలి, "సర్వేసంతు నిరామయా" అందరూ ఆరోగ్యంగా జీవించాలి, "సర్వే భద్రాణి పశ్యంతు" అంటే అందరూ భద్రంగా వుండాలి అని అర్ధం. ఇటువంటి ఉదాత్త భావనలని ప్రపంచంలో ఏ మతమయినా చెప్పగలిగిందా? భగవద్గీతలో "విజ్ఞుడయిన వాడు ఒక ఏనుగులోనూ, పక్కనే వున్న కుక్క లోనూ, కుక్కని తినే చండాలునిలోనూ, సద్బ్రహ్మణుడిలోనూ పరమాత్మని దర్శిస్తాడు" అని చెప్పబడినది. అంతటి సమదర్శిత్వ భావన ఎప్పటికయినా మరో గ్రంధంలో చూడగలమా? మనం మనుషులమే కాకుండా, ప్రతీ ప్రాణిని తమతో సమానంగా భావించమని చెప్పే వున్నతమయిన సంస్కృతి గురించి, దేవుడు సృష్టించిన జంతువులన్నీ తమ ఆహారం కోసమే అని వాదించే వారికి ఏమని చెపితే తెలుస్తుంది? భూమి తల్లిగా భావించి, నదిని అమ్మగా ప్రేమించి, గాలిని దేవుడిగా ఆరాధించే వారి గురించి, పైవన్నీ వ్యాపార వస్తువులుగా భావించి, ప్రకృతిలో వున్న ప్రతీదీ అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి అని భావించే వారికి ఎలా చెపితే అర్ధం అవుతుంది? కూర్చున్న కొమ్మను నరుక్కోవడమూ, ప్రకృతిని నాశనం చేయ్యడం ఇదేగా మనం నాగరికులం అనుకునే వాళ్ళు చేసేది? తాగే మంచి నీళ్ళని కూడా కొనుక్కుని బ్రతకాల్సి వస్తుందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి వుంటుందా?

అసలు విషయానికి వస్తే హిందూ మతంలో వుండేది సర్దుబాటుతత్వం. వేద కాలం నుండి దాని మౌలిక సిద్ధాంతంలో వుండే వైవిధ్యంవల్ల ఎదురయిన ప్రతీ సవాలునీ సమర్ధవంతంగా ఎదుర్కొని ఈ నాటి స్తితికి చేరింది. ఈ మతంలో (నిజానికి హిందుత్వాన్ని మతం అంటే నేను ఒప్పుకోను, అది ఒక జీవిత విధానం) వున్న ఈ గుణం వల్ల ప్రాచీన యుగంలో బౌద్ధ, జైన మతాలు పుట్టినా, తరువాతి కాలంలో క్రైస్తవ, ముస్లిం మతాలు దాడి చేసినా సజీవంగా వుండగలిగింది. అయితే ఇంత మంచి విధానాన్ని ఎవరూ పనిగట్టుకుని (అంటే అబధాలు చెప్పి, భయపెట్టి, యుద్ధాలు చేసి) మతమార్పిడులు చేయ్యకపోవడం వలన మిగిలిన ప్రాంతాల్లో అది వ్యాప్తి చెందలేకపోయి వుండవచ్చు. అలాగని హిందువులు చేతగానివాళ్ళు కారు, సహనం కొంచెం ఎక్కువ. అయితే ఎంతటి సహనానికయినా ఒక హద్దు వుంటుంది. పిల్లి మామూలుగా చాలా మంచిది. ఎవరయిన వస్తుంటే అది పక్కకి తప్పించుకు పారిపోతుంది. కాని అదే పిల్లిని ఒకగదిలో తాళం పెట్టి కొట్టడానికి ప్రయత్నించారనుకోండి ఎదురు తిరుగుతుంది, ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తుంది. ముఖమంతా రక్కి పారేస్తుంది. హిందూ మతంలో వుగ్రవాదం అంటూ ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా, అది తాత్కాలికం మాత్రమే.

అందుచేత భారతదేశం గత 5000 సంవత్సరాలలోనే కాదు, మరో 10000 సంవత్సరాల తరువాతయినా సరే మరే దేశం మీదకీ యుద్దానికి వెళ్ళదు.

http://saradaa.blogspot.in/2010/05/5000.html

1 కామెంట్‌: