18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-2


ముస్లింల దండయాత్రల వలన అపారమైన ప్రాణ, ధన నష్టాలు మరియు సంస్కృతి వినాశనం జరిగాయి. చారిత్రిక గణాంకాల ప్రకారం క్రీ.శ. 1000 నుండి 1525వ సంవత్సరం వరకు సుమారు 10 కోట్లమంది ఊచకోతకోయబడ్డారు. అంటే 500 యేండ్లపాటు జనాభా అబివృద్ధి చెందాల్సిందిపోయి క్షీణించింది (లాల్ గారు  ఎం.ఏ.ఖాన్ రచించిన Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery అనే పుస్తకంలోని 216వ పుటలో సూచించిన గణాంకం). నమ్మశక్యంగా లేదా? ఐతే ఈ లెక్కలు గమనించండి: 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కేవలం 9 నెలల్లో సుమారు 30 లక్షలమంది బంగ్లాదేశి ముస్లిం మరియు హిందువులను, కొందరు భారతీయులను వధించింది (ఖాన్ 216 పుటలో). ముస్లింలు జరిగించే హింసాకాండను ప్రతీసారి చూసిచూడనట్లు విస్మరించే అంతర్జాతీయ సమాజం, ఈ ఊచకోతనూ పెద్దగా పట్టించుకోలేదు. 


అధారాలను మరియు గణాంకాలను పరిశీలిస్తే విస్మయకరమైన పెద్ద సంఖ్యలో భారతీయులను ఇస్లామిక్ క్రూర రాజ్యాలు బానిసలుగా చేసుకొన్నాయి. భారతభూభాగాలపై ముస్లింలు జరిపిన దండయాత్రలు బహుశా ప్రపంచచరిత్రలో అత్యంత రక్తసిక్తమైనవేమో! ఖాన్:201వ పుటలో చరిత్రకారుడైన డ్యురంట్ ఇలా అన్నాడు:

"హిందువుల ఊచకోత, బలవంతపు మతమార్పిడులు, హిందూ దేవాలయాల కూల్చివేత, బానిస సంతల్లో వేలంవేయడానికి చెరపట్టుకుపోబడిన హిందూ స్త్రీలు, పిల్లలను గూర్చిన విషయాలను, ముస్లిం రాజులు క్రీ. శ. 800-1700 వరకు జరిగించిన భయంకరమైన రాక్షస కార్యాలని గొప్ప విజయాలుగా గర్వంతో అత్యుత్సాహంతో ముస్లిం చరిత్రకారులు ఇస్లామిక్ రాజుల గ్రంథాలలో వర్ణశోభితంగా వ్రాసారు." 

అరబ్బు ఆక్రమణదార్లు అసలేంచేసారో తెలుపుతు రిజ్వాన్ సలీం ఇలా వ్రాసారు:
 
"నాగరికతలో అత్యంత హేయమైన క్రూరులుగా పిలవబడుటకు ఏ సంస్కృతీ ఇష్టపడని ముష్కరులు అరేబియా మరియు పశ్చిమాసియా నుండి 7వ శతాబ్దంలో భారతభూమిలోకి రాసాగిరి. ఈ ఇస్లామిక్ ఆక్రమణదార్లు దండెత్తి వచ్చి మగవారినందరిని తెగనరికి, అనేక హైందవ దేవాలయాల్ని, విగ్రహాలని, శిల్పాలని తుత్తినియలుచేసి, కోటలను రాజమందిరాలని కొల్లగొట్టి విస్తారమైన దోపుడు సొమ్మును, స్త్రీలను పట్టుకొనిపోయిరి.....కానీ చాలామంది భారతీయులు, ఎంతో పరిణతిచెందిన, అన్ని నాగరికతలకంటె విజ్ఞానంలో, వైద్యంలో ఇంకా అనేక శాస్త్రాలలో ముందున్న నాగరికత, ఎంతో సృజనాత్మకత కలిగిన, శాంతికరమైన సంస్కృతిని ఈ ముస్లిం ముష్కరులు నాశనం చేసారన్న విషయం గ్రహింపకున్నారు (ఖాన్:179వ పుటలో)." 

ఇస్లాం ఇండియాలో ప్రవేశింపకమునుపు కూడా యుద్ధాలు జరిగాయికాని, అవి ఒక జాతి లేక రాజ్య వినాశనానికి, అసంఖ్యాకమైన బానిసలకోసం, స్త్రీలకు, పిల్లలకు చివరకు పసికందులకు కనీస విలువ ఇవ్వకుండా, కొంచెమైనా కనికరం చూపకుండా కామతృప్తికొరకైన వస్తువులునగా వాడుటకు, దేవాలయాల్ని నాశనం చేయుటకు, చేలను పాడుచేసి రైతులను జంతువులనుగా పనిచేయించుటకు ఈ యుద్ధాలు జరుగలేదు మరియు ఈ యుద్ధాలు ఇరు సైన్యాల మధ్య జరిగేవి, రాజ్యాధికారం మారుతూ ఉండేది కాని సామాన్యుని ప్రాణానికి మానానికి ఇంటికి ఆస్తికి ముప్పువాటిల్లేదికాదు. దోపిడీలు ఊచకోతలు ఈ యుద్ధాలలో జరిగేవికాదు. కాబట్టి ఇస్లామిక్ దండయాత్రల పర్యవసానాలను భారతప్రజలు గ్రహింపలేకపోయారు. రాజు, ప్రజా తేడాలేకుండా ముస్లిం పాలకుల చేతుల్లో అందరూ విలవిలలాడారు. వీరి సమాజం, ఇస్లాం పాలకులయొక్క అధిక శిస్తులతో, శిక్షలతో చిన్నాభిన్నమైపోయింది. గత్యంతరంలేక కొందరు మతం మారారు, ఇంకొందరు అడవులకు, కొండలలోకి పారిపోయి బలహీనులై రోగాలతో, క్రూరమృగాలబారిన పడి తనువులు చాలించారు. ముస్లింలు, హిందూస్త్రీల భర్తలను వారి కళ్ళముందే చంపి, భర్తల నెత్తురు చల్లారకముందే వారి భార్యలతో బలవంతంగా శయనించేవారు. భారత సమాజాన్ని ఘోరంగా కీంచపరచి, సంస్కృతిని పాడుచేసి, తిరగబడినవారిని కిరాతకంగా చంపుతూ, అన్యాయంగా నేరారోపణలు చేస్తూ భారతావనిని దయనీయస్థితిలోకి చేర్చారు. అప్పుడప్పుడూ ముస్లిం రాజుల మధ్య జరిగే యుద్ధాల్లోను హిందువులే అధికంగా బలైయ్యేవారు, ఎందుకంటే హిందువులను ముందు  కవచంగా (battlefield front line) ఉపయోగించుకొనేవారు (ఖాన్ 205-207 పుటల్లో).    
http://carpenters-son.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి