18, ఫిబ్రవరి 2012, శనివారం

రజాకార్ల అఘాయిత్యం!


అనగా అనగా.....

స్వాతంత్రం వచ్చిన తొలిరోజులు! రజాకార్ల దౌష్ట్యంతోనూ, కౄరచర్యలతోనూ అల్లాడిన నిజాం సంస్థానం, పటేల్ తీసుకొన్న పోలీసు చర్య అనంతరం భారత్ లో కలిసిపోయింది. ఈ సంఘటన రజాకార్ల అఘాయిత్యాలు పెట్రేగి ఉన్న సమయంలో జరిగింది, తర్వాత వెలుగుచూసింది.


హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన కొద్దికాలం తర్వాత ఓరోజు – కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నారు. అప్పటి రాజకీయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ నాటి నిజాం క్రౌర్యం గురించి, రజాకార్ల హింస గురించి నడుస్తుంది. హఠాత్తుగా ఒక మహిళ తన ఒంటిమీది దుస్తులన్నీ విప్పి, అందరి ఎదుట నగ్నంగా నిలబడింది. అక్కడ పిల్లలూ, స్త్రీలూ, పురుషులు ఉన్నారు. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఎవరూ మాట్లాడలేదు.


కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న ఓ పెద్దాయన, "ఏమిటిది తల్లీ! ఇలా అందరి ఎదుట నిలబడతావా? ఆడదానివి కాదూ! ఇలా నిలబడటానికి సిగ్గుగా లేదూ?" అన్నాడట. ఒక్కసారిగా అగ్నిపర్వతం బ్రద్దలయినట్లు ఆమె “నేను కాదు. మీరందరూ సిగ్గుపడాలి” అంటూ భోరుమన్నది. దుఃఖాతిశయం తీరాక, దుస్తులు ధరించి, “నన్ను రజాకార్లు బహిరంగ స్థలంలో నగ్నంగా చెట్టుకి కట్టేసి వారం రోజులుంచారు. నానా హింసా పెట్టారు” అంటూ తన శరీరం మీద నాటి హింసల గుర్తులు చూపిందట. చూస్తోన్న అందరి కళ్ళల్లో నీళ్ళు!


ఇది ఆ రోజుల్లో కృష్ణాపత్రికలో ప్రచురింపబడినట్లుగా 2008 లో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కేసీఆర్ ’నిజాం’ని పొగిడిన సందర్భములో ఈ వార్తని ప్రచురించింది.


ఇంతటి కసాయి తనం, హద్దుల్లేని హింస!


ఇదీ కథ!


ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర. 


 http://anagaaanagaa.blogspot.in/2010/05/blog-post_19.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి