20, ఫిబ్రవరి 2012, సోమవారం

పశ్చిమ దేశాలకీ మనకీ మధ్య సాంస్కృతిక వైరుధ్యాలు.


ప్రాచీన కాలం నుండి భారత దేశం తనదయిన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. భారతీయుల జీవన విధానం, ప్రకృతికి అనుగుణంగా వారు నిర్మించుకున్న తమదయిన ప్రత్యేక జీవన శైలి, అప్పటి పశ్చిమ దేశాల్లో ప్రజలని భారత దేశం వైపు ఆకర్షితమయ్యేలా చేసింది. చరిత్రకందని కాలం నుండి ఇప్పటి వరకు భారతీయ సంస్కృతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకుంటూ, అనేక రకాలయిన ప్రజలు, వివిధ రకాలయిన భాషలు, భిన్న రకాలయిన వాతావరణం ఇవన్ని కలసి మన దేశానికి ఉపఖండం అనే పేరుని సార్ధకం చేసాయి. ఇంత వైవిధ్యమయిన దేశం ప్రపంచంలో మరెక్కడ ఉండదనడం అతిశయోక్తి కాదు. ఇన్ని రకాలయిన వైరుధ్యాలున్నప్పటికీ, అందరమూ ఒకే దేశంగా కలిసే ఉంటాము. దీనికి మూల కారణం మనందరి ఆలోచనల్లో వున్న పాజిటివ్ థింకింగ్. మనం చేసే ఏ పనయినా ఇతరులకు నష్టం కలిగించకూడదనే చూస్తాము. అదే సమయంలో ప్రకకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటాము. దానివల్ల వ్యక్తిగా ప్రతీ ఒక్కరు సుఖంగా ఉంటారు, ప్రకృతికి హాని చేయ్యకుండాను ఉంటారు.


మా నాన్నగారు ఎప్పుడూ పుట్టిన రోజు ఫంక్షన్లకి గాని, మరే సందర్భంలోనూ కాండిల్స్ ఆర్పడం వంటివి చేయించరు. దీపాలార్పడం మన సంస్కృతి కాదురా అని అంటారు. "తమసోమా జ్యోతిర్గమయా" అనేది ఆయన సిద్ధాంతం. ఆయన మాటలు నాలో బలమయిన ముద్ర వేసి, పాశ్చాత్య దేశాలకి, మనకీ మధ్య వున్న తేడాల గురించి ఆరా తీయడం మొదలు పెడితే, ఎన్నో కొత్త విషయాలు ఆలోచనల్లోకి వచ్చాయి. మీరే చదవండి.


1. పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి అన్ని సందర్భాలలో వాళ్ళు దీపం (candle) ఆర్పుతారు. మనం దీపారాధన చేసిగాని ఏ పనీ కూడా మొదలుపెట్టం.

2. మనం ఏ పని మొదలుపెట్టేప్పుడయినా, నిర్మించడం లేదా కట్టడంతో ప్రారంభిస్తాము. తాళి కడతాం, సంఖుస్తాపన చేసి ఇల్లు మొదలుపెడతాము. కాని వాళ్ళు మాత్రం తెంచడంతో మొదలుపెడతారు. పుట్టిన రోజ్కి కేక్ కటింగ్, ప్రారంభొత్సవానికి రిబ్బన్ కటింగ్ అలాంటివే.

3. ఎవరయినా ఎదురయితే మనం రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తాము. అదే వాళ్ళయితే shake hand ఇస్తారు. అవతలి వ్యక్తి చేతికి ఎమున్నాగాని అది మన చేతికి అంటుకుపోవలసిందే. రక రకాల రోగాలు చేతి స్పర్శ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

4. ఆత్మీయులు చనిపోయినప్పుడు, విషాద చిహ్నంగా పువ్వులను పార్ధివ శరీరం మీద పెడతారు వాళ్ళు. మనం పుష్పాలను పవిత్రంగా ఎంచి దేవునికి మాత్రమే సమర్పిస్తాము. శుభ కార్యాలలో వాడుతాము.

5. ఏ స్త్రీనయినా గౌరవించే సంప్రదాయం మనది. తెలియని అమ్మయిగాని, మహిళగాని కనిపిస్తే, గౌరవంగా "అమ్మ" అని సంబోధిస్తాము. తల్లితో సమానమయిన స్థానం కల్పిస్తాము. పాశ్చాత్యుల దృష్టిలో బయటి స్త్రీ ఎవరయినా ఒకటే. తన భార్యతో సమానం.

6. మనది అందరి సుఖం కోరే సంస్కృతి. "సర్వే జనాస్సుఖినో భవంతు". అంటే, లోకంలో అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంతాము. వాళ్ళు ఎప్పుడూ పరాయి దేశాన్ని ఎలా కొల్లగొట్టాలా అని అలోచిస్తూంటారు. (ప్రపంచ యుద్ధాలన్ని పాశ్చాత్య దేశాల వారి వల్లే వచ్చినవి.)

7. మనకుంటే ప్రక్కవాడికి సాయం చెయ్యాలనే ఆలోచన మనది. ప్రక్క వాడితో కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనె ధ్యేయం వాళ్ళది. (భారతీయులెవరూ తాము కనిపెట్టిన వాటితో వ్యాపారం చెయ్యాలని అనుకోలేదు. కాని పడమర దేశాల నుండి కేవలం వ్యాపారం చెయ్యాలనే మన దేశానికి వచ్చారు.)

8. మనది ఆధ్యాత్మిక సంబంధమయిన ఆలోచనలయితే, వాళ్ళది పూర్తి వస్తుగత ఆలోచన. (మన వాళ్ళు వేదాలు రచించారు. భగవంతుడి గురించి ఆలోచించారు. అదే సమయం లో వాళ్ళు పిరమిడ్లు కట్టారు).

9. మనం ప్రకృతిని తల్లిలా భావిస్తాము. మనం పొందే ప్రతి ఉపకారానికి దైవంతో సమానంగా పూజిస్తాము. సూర్యుడు, భూమి, నదులు, చెట్లు ఇలా ఒకటేమిటి, అన్నిటిలోను దైవాన్ని చూస్తాము. కాని వాళ్ళ దృష్టిలో అవన్ని మనుషుల స్వార్ధం కోసం ఉపయోగపడేవి, పరిశోధనకి ఉపయోగపడే వస్తువులు మాత్రమే. మనం ప్రకృతిని ప్రేమిస్తాము, వాళ్ళు కామిస్తారు. అంతే తేడా.

10. మనం మనకి పాలిచ్చే ఆవుని గోమాతగా, తల్లికి ప్రతిరూపంలా భావిస్తాము, పూజిస్తాము. వాళ్ళు అదే ఆవుని తెగనరికి 'బీఫ్' పేరుతో లొట్టలేసుకుంటూ తింటారు.

ఇలా చెప్పుకుంటే పోతే చాలా విషయాలున్నాయి. 


 http://saradaa.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి