26, జులై 2012, గురువారం

శాస్త్రి గారికి దండం పెట్టండి!!





శాస్త్రిగారికి దండం పెట్టండి.
ఆయన మహా పండితుడు.
వేదాల్ని అధ్యయనంచేశాడు.
సంస్కృతాన్ని అవుపోసన పట్టాడు.
శాస్త్రాలలో దిట్ట.
సంస్కృత శ్లోకాలను అవలీలగా చెప్పేస్తుంటాడు.

శాస్త్రిగారికి దండం పెట్టండి.

ఆయన సంస్కృత భాషా ప్రచారమే జీవన ధ్యేయంగా పనిచేస్తూంటాడు.
ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ఆయన ప్రొఫెసర్.
ఆయన అనునిత్యం సంస్కృతం గురించే తపిస్తూంటాడు.
సంస్కృతం తప్ప ఆయనకు మరొక ధ్యాస లేదు.

శాస్త్రిగారికి దండం పెట్టండి.

ఆయన్ని కాబూల్ యూనివర్సిటీ సంస్కృతం నేర్పించేందుకు ఆహ్వానించింది.
ఆయన సంస్కృత పాండిత్యం చూసి తాలిబాన్లు సైతం ఆయనకి శిష్యులయ్యారు.
తమ కంచుకోటల్లోకి పిలిపించి, మాట్లాడి పంపించేశారు.

శాస్త్రిగారికి దండం పెట్టండి.

కంచి శంకరాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు శాస్త్రిగారిని ఆశీర్వదించడమే కాదు. సన్మానించారు కూడా.
శాలువ కప్పించారు. జ్ఞాపిక ఇప్పించారు.
ఆయన కృషిని ప్రశంసించారు.

శాస్త్రిగారికి దండం పెట్టండి.

ఆయన సంస్కృతంతో పాటూ కురాన్ నూ పుక్కిట పట్టారు.
సురాలు, ఆయత్ లూ ఆయనకు కంఠోపాఠం.
హిందూ శాస్త్రాల్లో ఉన్నదీ, కురాన్ లో చెప్పిందీ ఒకటేనని ఆయన అంటారు.
అంతే కాదు. కురాన్ లోని చాలా అంశాలకు హిందూ శాస్త్రాలే ప్రేరణ అంటారు.

శాస్త్రిగారికి దండం పెట్టండి

ఆయన చేసిన సేవలకు, మత సామరస్యానికి ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయన్ను నేషనల్ కమ్యూనల్ హార్మొనీ అవార్డు నిచ్చి సత్కరించింది.
2010 లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయనకు ఈ అవార్డునిచ్చారు.
ఆ సభలో ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కూడా ఉన్నారు.



శాస్త్రి గారికి దండం పెట్టండి.

శాస్త్రిగారు ముక్కుసూటి మనిషి. ఉన్నదున్నట్టు మాట్లాడేస్తారు.
తనకు ప్రేరణ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ జీ నుంచే వచ్చిందంటారు. ఆరెస్సెస్ ఒక జాతీయవాద సంస్థ అంటారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలు బలపడితేనే దేశం బాగుపడుతుందంటారు ఆయన.

శాస్త్రిగారికి దండం పెట్టండి.

ఇంతకీ శాస్త్రిగారి పూర్తి పేరేమిటో చెప్పనే లేదు కదూ?
ఆయన పూర్తి పేరు ఆచార్య మహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి.
శాస్త్రి చదువుల వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రిలాంటి డిగ్రీ అది.



శాస్త్రిగారికి మనస్ఫూర్తిగా దండం పెట్టండి!! 


 http://rakalokam.blogspot.in/2012/07/blog-post.html

అస్సాం హింసాకాండ



బోడోలాండ్ హింసాకాండలో నలభై మందికి పైగా మరణించడం, లక్షలాది మంది నిరాక్షిశయులు కావడం విషాదకరం. ఆందులో అత్యధికులు భూమిపుత్రులయిన బోడోలు కావటం, మరియు ఈ మారణకాండ కొనసాగిస్తున్నవారు గొడవలకు అసలు కారకులు మొదలుపెట్టిన వారు బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన ముస్లింలు కావటం గమనార్హం మరియు గర్హనీయం. ఈ హింసాకాండను అదుపు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవలసిందే. అయితే ఇంత భారీ స్థాయిలో భూమి పుత్రులైన బోడోలకు, స్థానికేతర బెంగాలీ ముస్లింలకు మధ్య విద్వేషాలు పెరగడానికి కారణమేమిటనేది చర్చించుకోక తప్పదు.

బోడోలాండ్ సమస్య సలసల మరుగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం సమస్యను కప్పి పెట్టడానికి ప్రయత్నించాయి. ఎప్పటికప్పుడు దాటవేయాలనే యత్నమే తప్ప శాశ్వత పరిష్కారానికి పూనుకోలేదు. బోడోల పోరాటం దశాబ్దాలుగా సాగుతున్నా వారి ఆకాంక్షలు నెరవేర్చకపోవడం పాలకులు చేసిన పెద్ద తప్పిదం. పైగా బోడో ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు అతి తెలివితో విభజించి పాలించే విధానాలను అవలంబించారు. పాలకుల ఈ కుత్సితం వల్ల సమస్య రగిలి రగిలి ఈ రీతిలో భగ్గుమన్నది. అయితే ఇంత భారీ ఘర్షణలకు దారి తీసిన తక్షణ కారణం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొదట ఇద్దరు బెంగాలీల హత్య జరిగింది. ఆ తరువాత మరో ఇద్దరు హతమయ్యారు. ఎవరు ఎందుకు ఈ హత్యలు చేశారో తెలువదు. ఆ తరువాత నలుగురు మాజీ బోడో మిలిటెంట్ల హత్య జరిగింది. ఈ హత్యలు కూడా ఎవరు చేశారనేది తెలువదు.

కానీ తమ గడ్డపైనే తమవారు హతులు కావడాన్ని బోడోలు జీర్ణించుకోలేక పోయారు. ప్రతీకార దాడులతో పరిస్థితి ఇంత తీవ్రంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోడోల ఆకాంక్షలు నెరవేర్చక పోవడం వల్ల, భిన్నవర్గాల మధ్య విభేదాలు పెంచి పోషించడం వల్ల ఉద్రిక్తత నెలకొని ఉన్న మాట నిజమే. అయితే ఘర్షణలు హటాత్తుగా చెలరేగడం వెనుక మాత్రం ఆధిపత్యవర్గాల కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తున్నది. బోడో రాష్ట్ర సాధన కోసం మళ్ళీ పోరాటం ఉధృతమవుతున్న దశలో, ఉద్యమం ఆప్రతిష్టపాలయ్యే విధంగా ఘర్షణలు చెలరేగుతున్నాయంటే, అందుకు అస్సాంలోని ఆధిపత్య వర్గా లు బాధ్యత వహించాల్సిందే. 


బోడోలతో గొడవ పడుతున్నది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ ముస్లింలు అయినందు వల్ల ఈ ఘర్షణలకు మతం రంగు పులమడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ భూమి పుత్రులకు, స్థానికేతరులకు మధ్యగల వైరుధ్యమే ఇక్కడ ప్రధానమైనది.

పైగా బోడోల అసంతృప్తికి కారణం బెంగాలీ ముస్లింల వలసలు మాత్రమే కాదు. అస్సామీయుల ఆధిపత్యం నుంచి విముక్తి కోసం వారు పోరాడుతున్నారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే తప్ప తమ ఆకాంక్షలు తీరవని వారు భావిస్తున్నారు. అస్సాంలో భాగంగా ఉంటూనే తమ ఆకాంక్షలు తీర్చుకోవడం కోసం గతంలో ఒప్పందాలను నమ్మి రాజీ పడినా వారికి నిరాశే మిగిలింది. బోడోల పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. స్థానికేతరులు తమ భూములను ఆక్రమించుకుంటున్నారని గమనించిన బోడోలు, ఇతర గిరిజనులు 1960 దశకంలోనే అస్సాం మైదాన గిరిజన మండలిగా ఏర్పడి ఆదివాసీ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరారు. అస్సాంలోని విద్యా సంస్థలలో తమకు చోటు లభించక పోవడం, ఉద్యోగాలలో వివక్ష చూపించడం, తమ భాషా సంస్కృతులు నిర్లక్ష్యానికి గురికావడం వంటి అనేక కారణాల వల్ల బోడోలు స్వరాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించారు.

1987 మార్చి రెండవ తేదీన ఉపేంవూదనాథ్ బ్రహ్మ నేతృత్వంలో ఆల్ బోడో స్టుడెంట్స్ యూనియన్ ఆవిర్భావం బోడోల స్వరాష్ట్ర ఉద్యమ చరివూతలో మైలురాయి. బోడో రాష్ట్రం ఇవ్వడానికి బదులుగా బోడో పరిపాలక మండలి ఏర్పాటుకు కేంద్ర రాష్ట్రాలు బోడోలను ఒప్పించాయి. ఈ మండలి వల్ల ప్రయోజనం లేదని తెలిసిపోవడంతో బోడోలు మళ్ళీ ఉద్యమించారు. మళ్ళీ మరిన్ని అధికారాలతో బోడో ప్రాదేశిక మండలి ఏర్పాటు జరిగింది. 

బంగ్లాదేశ్ నుంచి వచ్చే బెంగాలీల
ముస్లింల సమస్య బోడో ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. అస్సాం ఉద్యమం కూడా ఈ స్థానికేతరులకు వ్యతిరేకంగా భారీ ఎత్తునే సాగింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్ మొదలుకొని, అస్సాం తదితర ఈశాన్య ప్రాంతాలలో బెంగాలీముస్లింల పెత్తనం సాగుతున్నది. భూములు వీరి చేతుల్లోనే ఉన్నాయి. వ్యాపారాలలోనూ వీరిదే ప్రాబల్యం. త్రిపురలోనైతే స్థానికులు మైనారిటీలుగా మారిపోయారు. కేంద్ర ప్రభుత్వంలో పట్టు మూలంగా బెంగాలీ లాబీ ఆధిపత్యాన్ని ఈశాన్యంలోని ఇతర జాతులు, తెగలు ఎదుర్కోలేక పోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ముస్లింల వలసల సమస్యను దౌత్యపరంగా, మానవతా దృక్పథంతో పరిష్కరించడం అసాధ్యమేమీ కాదు. కానీ ఈ వలస లు కాంగ్రెస్, సీపీఎం కనుసన్నలలోనే సాగడం వెనుక కుట్రపూరిత రాజకీయం ఉన్నది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. 1970 దశకంలో ఈ వలస వచ్చినబెంగాలీ ముస్లింలందరికి ఓటు హక్కు ఇవ్వడం వివాదాస్పమైంది.

అస్సాంలో ఉద్యమం చెలరేగింది. అయినా కేంద్రం ఈశాన్యం ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడానికి పూనుకోవడం లేదు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలూ చుట్టూ ఉన్నాయనే తొంపుతో ఈశాన్యంలోని ఉద్యమాలను కేంద్రం సైన్యాన్ని పెట్టి అణచివేస్తున్నది. కీలకమైన ప్రాంతమనే సోయి మొదటి నుంచి ఉంటే, అక్కడి భిన్న జాతులు, తెగల సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలె. వారికి పాలనలో భాగస్వామ్యం కలిగించాలె. భూమి పుత్రులు తమ ప్రాంతంలో తాము అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నామనే భయాందోళనలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలె. ఈశాన్యంలోని తెగల మధ్య వచ్చే వైరుధ్యాలను సామరస్యంగా పరిష్కరించాలె. అంతే తప్ప సైన్యాన్ని దింపి మానవ హక్కులను హరించడం, విభజించి పాలించే కుటిల నీతిని అనుసరించడం వల్ల సంక్షోభాలు ముదిరిపోతాయి. ఈ అనిశ్చితి ఈశాన్యానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపించవచ్చు. అందువల్ల ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి వ్యవహరించడం శ్రేయస్కరం.

అస్సాంలో కాంగ్రెస్ మత రాజకీయాలు!

- నిర్మలా సీతారామన్

అస్సాం సామాజిక, రాజకీయ సంరచన ఎంతో సంక్లిష్టంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. స్వతంత్ర జిల్లా మండళ్ళ ఆలోచనకు చురుకైన మద్దతిచ్చిన అంబేద్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో పర్వతప్రాంత గిరిజనుల హక్కుల గురించి వివరించారు. 2001 జనాభాలెక్కల ప్రకారం అస్సాంలోని మొత్తం 20.33 మిలియన్ జనాభాలో, గిరిజనులు 15.64శాతం వరకు ఉన్నారు. ఈ గిరిజనుల్లో ముఖ్యమైన తెగలు బోడో, మిసింగ్, రభా, సోన్వాల్, లాలంగ్ (తివ), డియోరి మరియు ధెంగాల్ (మెక్).
 

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలును అనుసరించి అస్సాంలో మొత్తం మూడు స్వతంత్ర పాలక మండళ్ళు ఏర్పాటు చేశారు. మరికొన్ని ఏర్పాటుకోసం ఎదురుచూస్తున్నాయి. చాలా గ్రూపులవారు ఇదే షెడ్యూలు కింత తమకు కూడా స్వతంత్ర పాలక మండళ్ళను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆస్సాంలో ఈ మండళ్ళు చాలా పరిమితంగానే విజయం సాధించాయని చెప్పాలి. 2009లో ఒక మంత్రివర్యుని నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం, మండళ్ళ వల్ల ప్రయోజనాలపై తెలుసుకోవడానికి త్రిపుర వెళ్ళింది.
 

తమ భూమి ‘అపహరణ’కు గురయిందంటూ లాలంగ్ (తివ) జాతి గిరిజనులు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వినతిపత్రం అందజేసారు. 1983లో ‘తివ’తెగవారు, విదేశీయులకంటే చాలా ఎక్కువసంఖ్యలో ఉండేవారు. అప్పట్లో విదేశీయుల సంఖ్య కేవలం మూడువేలు మాత్రమే. అయితే మండలిలో తమను రక్షించేవారు ఎవరూ లేకపోవడంతో వీరు తమ భూములను స్వల్పకాలిక ప్రయోజనాలకోసం అమ్ముకున్నారు. దీనికంటే చాలా సంవత్సరాలక్రితం, అంటే 1937 నవంబర్ నెలలో జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ నాయకుడిగా, ప్రాంతీయ ఎన్నికల ప్రచారం కోసం అస్సాంను సందర్శించారు. అప్పుడుఅస్సామీయ సంరక్షణి సభ నెహ్రూకు ఒక వినతిపత్రం సమర్పిస్తూ, ‘క్షేత్ర వ్యవస్థను తొలగించవద్దు’ అని కోరింది. ముఖ్యంగా వలసలను నిరోధించే ఉద్దేశంతోనే వారు ఈ విధంగా కోరారనేది నిర్వివాదాంశం. మరి దీనికి ప్రతిస్పందనగా నెహ్రూ.. అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాస్తూ, ‘అస్సాం మరింత అభివృద్ధి చెందాలన్నా, సౌభాగ్యవంతం కావాలన్నా వలసలు అత్యవసరమ’ని పేర్కొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే వలసల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించింది. పైకి మాత్రం వలసలు వద్దంటూనే ఆంతరంగికంగా వాటివల్ల ప్రయోజనమున్నదని భావించింది. బంగ్లాదేశ్‌నుంచి అక్రమవలసలు విపరీతంగా కొనసాగుతున్నాయని, వీటివల్ల భవిష్యత్తులో అనవసర సమస్యలు ఉత్పన్నమవుతాయని తాను హెచ్చరించినట్టు 2008లో కెపిఎస్ గిల్ గుర్తు చేసుకున్నారు. ఈ వలసల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన మొట్టమొదటి ఎస్‌పి ఆయనే కావడం విశేషం. 1964 ప్రాంతంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్‌లు అక్రమంగా వలసలు వచ్చిన బంగ్లాదేశీయులను, మన దేశంనుంచి పంపించివేసాయని కూడా ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ స్వార్ధపూరితంగా తన ఓటుబ్యాంకును కోల్పోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
 

1980లో అస్సాంలో ఆందోళన ప్రారంభమైన తొలినాళ్ళలో కాంగ్రెస్ మరోకోణంలో దాన్ని చూసింది. అక్రమంగా ఓటర్ల లిస్టులో చొప్పించిన పేర్లన్నింటిని తొలగించాలని..ఆ విధంగా చేసిన తర్వాతనే 1983 ఎన్నికలు జరపాలనేది అప్పటి ఆందోళన ప్రధాన లక్ష్యం. కానీ కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు! అందువల్ల తర్వాతి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నవారిని, క్రమంగా క్రమబద్ధీకరించడానికే యత్నించింది. అస్సాంలో ఒకపక్క ఆందోళన కొనసాగుతున్నా, ఓటర్ల జాబితాలో మాత్రం అక్రమంగా కొత్త పేర్లు చొప్పించడం కొనసాగుతూనే ఉంది. అప్పట్లో మంగల్‌డోయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 45వేలమంది అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నట్టు తేలింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి లాలంగ్ (తివాస్)లు తమ భూములు అక్రమంగా ఆక్రమణకు గురికాకుండా రక్షించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో జరిగిన 1983 ఎన్నికల్లో జరిగిన హింసాకాండ చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని ముద్ర వేసింది. ముఖ్యంగా నెల్లి సామూహిక హత్యాంకాండ దీనికి పరాకాష్ఠ! మానవత్వం నశించిపోయిన క్రూర భయానక మారణకాండ అది! (వేద్ ప్రకాశ్ రచించిన ‘్భరత ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం: విస్తృతమవుతున్న తుపాను. వాల్యూమ్-1). ఈ ఎన్నికలు జరిగిన ఇరవైఐదు సంవత్సరాల తర్వాత కెపిఎస్ గిల్ మాట్లాడుతూ ‘1983 ఎన్నికలు చాలా తప్పిదం’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. నెల్లి జనాభాను పరిశీలిస్తే లాలంగ్(తివా)ల సంఖ్య చాలావరకు పడిపోవడాన్ని గమనించవచ్చు. కానీ ఏమైనా న్యాయం జరిగిందా? 1983 ఫిబ్రవరి 18, అధికారికంగా 2191మంది హత్యాకాండకు బలయిట్టు తేలింది. అనధికారికంగా ఐదువైలకు పైమాటే. హతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్న పిల్లలు. వీరంతా బంగ్లాదేశ్‌కు చెందినవారు. ఈ మారణకాండలో మొత్తం పదహారు గ్రామాలు విధ్వంసానికి గురయ్యాయి. 370 మంది పిల్లలు అనాధలయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన మారణకాండ దాదాపు ఆరుగంటలపాటు అప్రతిహతంగా కొనసాగింది. ఇంత జరుగుతున్నా మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక్క పోలీసు కూడా సంఘటనా స్థలానికి చేరుకోలేదు. ఇటువంటి దాడి జరుగుతుందన్న విషయంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ముందే హెచ్చరికలు అందాయి. ఈ దారుణ కాండపై పోలీసులు ఆరువందల ఎనబై ఎనిమిది కేసులను నమోదు చేసారు. అయితే ఎజిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులన్నింటిని ఎత్తి వేసింది. దీనిపై కాంగ్రెస్ ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. 1983 జూలై నెలలో త్రిభువన్ ప్రసాద్ తివారీ నేతృత్వంలో ఒక కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటి 1984 జనవరిలో ఆరువందల పేజీల నివేదికను సమర్పించింది.
 

నాటి అస్సాం ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా ఈ నివేదికను అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇవ్వాల్టి వరకు ఆ నివేదికలోని అంశాలు వెల్లడికాకుండా రహస్యంగా దాచేసారు. మైనారిటీల పట్ల కాంగ్రెస్‌కున్న అభిమానం కారణంగా, వారి సానుభూతి కోల్పోవలసి వస్తుందన్న భయంతోనే ఈ నివేదిక వివరాలను బయటపెట్టలేదు. నెల్లి మారణకాండలో బతికి బట్టకట్టినవారికి ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు, మూడు బండిళ్ళ టిన్ రేకులను (ఇళ్ళపై కప్పుగా ఉపయోగించేందుకు) ప్రభుత్వం నష్టపరిహారంగా అందించింది. అప్పట్లో ఒక మ్యాగజైన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, నెల్లి మారణకాండలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి మాట్లాడుతూ, ‘ప్రధాని ఇందిరాగాంధీ వచ్చినప్పుడు, తాము ఇక్కడికి తిరిగిరావాలనుకోవడం లేదని చెప్పాం. అయితే ఆమె దీపం దగ్గరినుంచి అన్నీ అందిస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు వాటికోసం ఎదురుచూస్తూనే ఉన్నాం,’ అని చెప్పాడు. మరి 1984లో న్యూఢిల్లీ మరియు సమీప ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో బాధితులు ఒక్కొక్కరు రూ.7 లక్షల వంతున నష్టపరిహారాన్ని అందుకున్నారు.
 

నెల్లి సంఘటన జరిగిన పదేళ్ళ తర్వాత, 1993లో బోడో ఒప్పందం కుదిరింది. జరుగుతున్న అల్లర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. 2008లో హర్షమందిర్ మాట్లాడుతూ, ‘జాతుల ఏరివేతకు ప్రభుత్వం తనకు తానే పునాదిరాయిని వేసింది.’ బెంగాలీ ముస్లింలపై నిరంతర హత్యాకాండ కొనసాగింది. 1993లో వారి ఇళ్ళకు నిప్పు పెట్టారు. మరి ఇదే పరిస్థితి సంథాల్ మరియు ముండా గిరిజనులకు కూడా అనుభవంలోకి వచ్చింది. గత పదిహేనేళ్ళుగా వేలాది మంది గిరిజనులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. తిరికి ఇళ్లకు వెళ్ళాలంటే వారు తీవ్రంగా భయపడుతున్నారు. జాతుల మధ్య పరస్పర విద్వేషాలతో అస్సాం నేడు ఒక అగ్నిగుండంగా మారింది. బీహార్‌నుంచి ఇక్కడకు వచ్చిన కూలీలు, జార్ఖండ్ నుంచి వచ్చిన ఆందోళనకారులపై దాడులు జరుగుతున్నాయి. బోడోలు, బంగ్లాదేశ్ ముస్లింల మధ్య జరుగుతున్న ఘర్షణలవల్ల చాలామంది మరణించడం, పెద్దసంఖ్యలో సహాయక శిబిరాల్లో తలదాచుకోవడం జరుగుతోంది. జపాన్‌కు చెందిన మేధావి మకికొ కిమురను, నెల్లి మారణకాండపై మాట్లాడకుండా అస్సాం ప్రభుత్వం 2004లో ఆంక్షలు విధించింది.
 

ఇక తాజాగా అస్సాంలో కాంగ్రెస్ జరుపుతున్న మతరాజకీయాలను పరిశీలిస్తే.. ఎమ్మెల్యే డాక్టర్ రుమినాథ్ కథను చెప్పుకోవాలి. ఆమె తన ముస్లిం స్నేహితుడిని వివాహం చేసుకుంది. ఆమె పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే కాజీలను, నిక్కాకు ఏర్పాట్లు చేసారు. ఇక ఆమె పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే బహిరంగంగా ఈ వివాదాస్పద వివాహంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసాడు. డాక్టర్ రుమినాథ్‌ను, ఆమె సరికొత్త మొగుడిని తీవ్రంగా కొట్టడంతో మతపరంగా చాలా సున్నితమైన బారక్ లోయ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ రూమినాథ్ ఆమె రెండో భర్త, తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి, తమపై దాడికి పాల్పడ్డారన్న అనుమానంతో అతిథులపై దాడికి దిగారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు, పోలీసు కేసు పెట్టారు. ప్రస్తుతం ఆస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు సున్నితమైన మత సమస్యపై రాజకీయ చదరంగాన్ని నడుపుతున్నారు. కానీ ఈ ప్రయోగాలన్నీ ఎట్టకేలకు బెడిసికొట్టక తప్పదు.

8, జులై 2012, ఆదివారం

రామతత్వ దర్శనం: సాక్షిలో స్వామి మైత్రేయి గారి సందేశం (యధాతధం)

ఒక వ్యక్తి ఆదర్శవంతమయిన పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, ఇంద్రియాలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలి వంటి విషయాలు రాముని పాత్ర ద్వారా వివరించాడు వాల్మీకి. రామ అంటే "ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి" అని అర్ధం. "రం" అనేది మణిపూర చక్రానికి సంబంధించిన బీజాక్షరం. అలాగే "ర" అంటే సూర్యతత్వం, "మ" అంతే చంద్రతత్వం. ఇవే మనలోని ఇడ, పింగళ నాడులు. రాముడంటే ఆత్మా రాముడే. దశరధునికి, కౌసల్యకి రాముడు జన్మించడమంటే మనలోని "దశ" రధాలనే కర్మేంద్రియల, జ్ఞానేంద్రియాల మధ్య కుశలత ఉండి, ఆత్మను చేరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందని. అన్నదమ్ములు నాలుగు పురుషార్ధలు. వీరిని వరుసగా, ధర్మానికి, శ్రద్ధకు, భక్తికి, శక్తికి ప్రతీకలుగా చెప్పవచ్చు. మనలోని సత్వ రజస్తమో గుణాలే దశరధుని భార్యలు. సీతను స్వచ్చమయిన మనస్సుకు ప్రతీకగా చెప్పవచ్చు. ఆమెకు బంగారు లేడి కావాలనే కోరిక కలగనంత వరకు రాముని చెంతనే ఉంది. లేడి కావాలనే కోరిక కలిగినప్పటి నుండి రామునికి దూరమై అనేక బాధలు పడింది. మనస్సులో కోరికలు, వ్యామోహం, రాగద్వేషాలు ఉన్నంతవరకు ఈ బాధలు ఉంటాయి. అలాగే మనిషి అన్ కాన్షస్‌గా ఉండేటప్పుడు తప్పొప్పుల విచక్షణ పోతుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చెడు వైపునకు వెళ్ళిపోతాయి. రావణుడు తెలివిగలవాడే కాని ఆ తెలివి అహంకారాన్ని పెంచి చెడువైపునకు తీసుకెళ్ళింది. అందుకే పదితలల వ్యక్తిగా చూపిస్తారు.

హృదయాన్ని తెరిచి రాముణ్ణి చూపడమంటే మనిషి శిరస్సుతో గాక హృదయంతో వుండాలని అర్ధం. అప్పుడే వానరుడు హనుమ కాగలడు. రావణుడు అరిషడ్వర్గాలకు ప్రతీక అయితే, హనుమ హృదయానికి ప్రతీక. లంక అంటే మన శరీరం . దానికున్న తొమ్మిది ద్వారాలే నవరంధ్రాలు. ఈ లంక చుట్టూ వున్న సముద్రమే మాయ. ఈ మాయను దాటి అసుర గుణాలయిన రాగద్వేషాలను హరించివేయాలి.

సీత జనకునికి పుడమిలోనే దొరికి, పుడమిలోకే వెళ్ళిపోతుంది. ధ్యానంలో సమాధి స్థితిలో మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికే వెళ్ళిపోతుంది. అయోధ్య అంటే ఏ ఘర్షణ వుండదు. ఏ కోరికలు, రాగద్వేషాలు లేక ప్రశాంతత నెలకొని ఉంటుంది. మనం మైండ్‌ను శుద్ధి చేసుకోక, మంచి హృదయంతో లేనంతవరకు ఆత్మారాముణ్ణి చేరుకోలేం. 


 http://saradaa.blogspot.in/2010/03/blog-post_31.html

మానవ సమాజానికి ఒక మహనీయ కానుక... రామాయణం.

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయనం. మనుషులు తమ జంతు ప్రవృత్తిని వీడి ఒక సమాజంగా రూపొందుతున్న కొత్తల్లో మనసులో ఎన్నో సందేహాలు.. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ మంచి అయితే ఎందుకు మంచి? చెడయితే ఎలా చెడు? ఒక మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంకంగా, ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ వుండే రకరకాలయిన మనుషుల్ని ఒక దారిలో నడిపించడం ఎలా అన్న విషయంపై ప్రాచీన భారత దేశంలో జరిగినన్ని ప్రయోగాలు ప్రపంచంలోని మరే సంస్కృతిలోనూ, మరే నాగరికతలో జరిగుండవని నిరాఘాటంగా చెప్పవచ్చు. అటువంటి సంఘర్షణలో నుంచి పుట్టిందే రామాయణం. రామాయణంలో ప్రతీ సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి.

రామాయణంలో ముందుగా చెప్పాల్సి వస్తే చెప్పవలసింది సీతా దేవి గురించే. భర్త పట్ల ఒక స్త్రీకి వుండవలసిన ధర్మాన్ని గురించి సీత నుంచి తెలుసుకోవచ్చును. తెల్లారేసరికి తన భర్త రాజు కావలసిన వాడు అడవులకి వెళుతున్నాను అని చెప్పినాగాని, ఒక్క మాట మారు మాట్లాడలేదు. ఇప్పటి ఆడవాళ్ళలాగా "నువ్వేమి చేతగాని భర్తవని నిందించలేదు. ఒక దేశానికి రాకుమార్తె అయి వుండికూడా పుట్టింటికి వెళ్ళిపోతానని అనలేదు. తన భర్తనే అనుసరించింది. ఆయనతో అరణ్యవాసం చేసింది, అష్ట కష్టాలు పడింది. భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలవాలనేదే సీత ఇచ్చే సందేశం.

లక్ష్మణుడి వంటి సోదరుడిని మనం చరిత్రలో ఎక్కడా చూసి వుండం. చరిత్ర ప్రారంభం నుంచి పరిశిలిస్తే రాజ్యం కోసం సొంత సోదరుల్నే కడతేర్చిన వారిని చూసుంటాము. సొంత తండ్రినే ఆస్తి కోసం కిరాతకంగా హతమార్చినవారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటింది అన్నగారి కోసం రాజభోగాల్ని వదిలి, కూడా వెళ్ళిన లక్ష్మణుడి గురించి మనం ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. మిగతా ఇద్దరు సోదరులు భరతుడు, శతృఘ్నుడు కూడా అన్నగారు లేని రాజ్యం తమకెందుకని సింహాసనంపై పాదుకలు వుంచి పరిపాలన చేశారు. ఇటువంటి అన్నదమ్ముల అనుబంధం ఏ దేశ చరిత్రలోనయినా వుంటుందా?

స్వామి భక్తి అనేది హనుమంతుడి నుంచి నేర్చుకోవచ్చు. కాస్త ఎక్కువ జీతం ఇస్తే చాలు వెంటనే వుద్యోగం మారిపోయే ఈ రోజుల్లో హనుమంతుని గురించి ఆలోచించేవాళ్ళు ఎంత మంది వుంటారు? ఒక సారి తన ప్రభువుగా అంగీకరించిన తరువాత, తనకు రాముడు అప్పజెప్పిన పనిని పూర్తి చెయ్యలేకపోయానే మరలా నా స్వామికి నా ముఖం ఎలా చూపించను? అని ప్రాణ త్యాగానికి సిద్దపడతాడు హనుమ. అంతేగాని బాస్ చూడడంలేదు కాబట్టి ఈ పని పూర్తి చేసేసాను అని అబద్దం చెప్పలేదు. రామ రావణ యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్దమంతా తానే అయి నడిపించాడు హనుమ. అంతటి శక్తిమంతుడయి వుండి కూడా ఎప్పుడూ తనవల్లే ఇదంతా జరుగుతుందని గొప్పలు చెప్పుకోలేదు. తన హృదయంలో కొలువయి వున్న రామ నామంవల్లనే తనకింత బలం వచ్చిందని వినమ్రంగా చెపుతాడు హనుమ. అటువంటి సేవకుడిని మనమెప్పటికయినా మరల చూడగలమా?

ఒక పరాయి స్త్రీని ఆశపడితే ఎంతటి విషమ పరిస్తితులని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదానికి సరయిన వుదాహరణ రావణుడు. రావణుడు నిజానికి ఎంతో విద్వాంసుడు, మహా శివ భక్తుడు. రక రకాల శాస్త్రాల్లో నిష్ణాతుడు. అయినా ఒక స్త్రీని బలాత్కరించబోయి యావత్ దానవ సామ్రాజ్యానికే ముప్పుని కొనితెచ్చుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ రోజు ఏ పేపర్ చూసినా, ఏ టి.వి. పెట్టినా పర స్త్రీ గురించి జరుగుతున్న నేరాలే కనిపిస్తున్నాయి. కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనిషి ఎంత పతనమవుతాడో రావణుడే ఒక హెచ్చరిక.

సీతా దేవి నగల మూట దొరికినప్పుడు రాముడు నీళ్ళు నిండిన కళ్ళతో "లక్ష్మణా, ఇవి మీ వదినగారి నగలేనా చూడవయ్యా" అని అడిగితే, దానికి లక్ష్మణుడు నేను వీటిలో వదినగారి కాలి మట్టెల్ని మాత్రమే గుర్తుపట్టగలను అని చెప్పాడు. అంటే ఎప్పుడూ తన తల్లి లాంటి వదినగారి పాదాల వంక తప్ప పైకి కూడా చూడలేదన్న మాట. అదీ ఒక వదినకీ, మరిదికీ వుండవలసిన గౌరవం.

ఇక రాముడి గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. అది మీకు తెలుసు. తండ్రికి మంచి తనయుడిగా, ఇల్లాలికి మంచి భర్తగా, సోదరులకి మంచి అన్నయ్యగా, సేవకుడికి మంచి యజమానికి, స్నేహితుడికి మంచి స్నేహితుడిగా, శతృవుకి సరయిన ప్రత్యర్ధిగా, ఇలా రాముడి ప్రతీ మాట, ప్రతీ కదలిక, ప్రతి సంఘటన మనకి ఒక సందేశాన్నిస్తూనే వుంటాయి. ఒక స్ఫూర్తిని నింపుతూనే వుంటాయి. రాముడు ఒక మతానికో, ఒక కాలానికో లేదా ఒక సమాజానికో సంబంధించిన వ్యక్తి కాడు. వ్యక్తిగా ఆయన అనుసరించిన మార్గం మానవ సమాజంలో వున్న ప్రతీ వ్యక్తికీ దేశ, కాల, మత, కుల ప్రసక్తి లేకుండా అనుసరణీయం.

రాముడు నిజంగా దేవుడా, కాడా అన్న విషయాన్ని పక్కన పెడితే, అప్పటి వరకూ పుస్తకాలకే పరిమితమయి వున్న అనేక ధర్మ సూత్రాల్ని, న్యాయాల్ని ఆచరణలో చూపించిన మహనీయుడు. అందరికీ నీతులు చెప్పాలని వుంటుంది. అందరికీ తాము ఆదర్శప్రాయుడుగా ఉండాలని వుంటుంది. కాని దాన్ని ఆచరణలో చూపించేది కొందరే. ఎన్ని కష్టాలు ఎదురయినా తాను నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినవాడే చరిత్రలో ధీరోదాత్తుడిగా మిగిలిపోతాడు. కోట్లాది భారతీయులకి స్ఫూర్తిని రగిలించిన గాంధీజికి ఆత్మ బలాన్ని అందించిన వాడు రాముడు. రాముడు నిజంగా వారధి కట్టాడా లేదా అని కొట్టుకు చచ్చే బదులు రాముడి జీవితంలో ఆయన ఆచరించి చూపిన సద్గుణాల్లో కొన్నయినా ఆచరించగలిగితే ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతుంది. అందుకే రామాయణం ఒక మహత్తర కావ్యం అయింది. కొన్ని వేల సంవత్సరాలుగా సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతుంది.

ఈ శ్రీరామ నవమి నాడు ఆ మహనీయుని ఒకసారి మరలా స్మరించుకుందాం. ప్రతీ వ్యక్తీ తనలోని రావణుడిని రూపుమాపగలిగితే, ఒక రాముడిగా అవతరిస్తాడు. తన సమాజానికి అనుసరణీయుడవుతాడు. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో... లోక స్సమస్తా సుఖినోభవంతు....


 http://saradaa.blogspot.in/2010/03/blog-post.html

ఇంగ్లీష్ భాష యొక్క సంస్కృత భాషా మూలాలు.

ప్రపంచలో అతి ప్రాచీనమయిన భాష సంస్కృతం. దేవ భాషగా ప్రసిద్ది చెందిన ఈ భాషలోనే మన మహర్షులు వేదాలు, పురాణాలు, మానవ సమాజ సంస్కృతీ వికాసానికి కావలసిని అనేక గ్రంధాలను రచించారు. ప్రపంచంలో అనేక భాషలకు తల్లి వంటిది సంస్కృతమే. ఇండొ- యూరోపియన్ భాషల్లో అత్యంత శాస్త్రీయంగా, సంపూర్ణముగా, వ్యాకరణబద్దమయిన మొట్టమొదటి భాష కూడా సంస్కృతమే. ఇంగ్లిష్ భాషలోనే కాక అనేక యూరోపియన్ భాషల్లో అనేక పదాలు సంస్కృత భాషా మూలాలకు సంబందించినవే అయి ఉంటాయి.


మానవులు సామాజిక జీవనం గడిపే తొలినాళ్ళలో మానవ సంబంధాల యొక్క పేర్లన్నీ సంస్కృత భాషలోనే ఉంటాయి. (కింద పట్టిక గమనించండి) మాత, పిత, సూన, దుహిత, ఇలా అన్ని మానవ సంబంధాలన్ని సంస్కృత భాషా సమాజంలోనే ఏర్పడ్డాయని మనకి అర్దం అవుతుంది. అసలు మనందరము మానవులం అనే మాట కూడా ఆ సమాజంలోనే ఆవిర్భవించింది. వేదాల ప్రకారం భూమిపై మనుషులందరము మనువు సంతతి. ఒక్కొక్క మహా యుగంలో ఒక్కొక్క మనువు ద్వారా మనుష్య సంతతి వ్యాపిస్తుంది. ప్రస్తుత యుగంలో వైవశ్వతుడు అనే మనువు మూలపురుషుడు. అందుకే ప్రస్తుత కాలాన్ని వైవశ్వత మన్వంతరంగా వ్యవహరిస్తారు. ఆ మనువు శబ్దం నుండి వచ్చిందే మానవ (MAN) అనే పదం.


ఇవే కాక, మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక వస్తువుల, జంతువుల పేర్లు ఇవన్ని సంస్కృతం నుండి వచ్చినవే. ఏదయినా కాదు లేదా వద్దు అనే విషయాన్ని సూచించదానికి ఇంగ్లిష్‌లో No అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. అది సంస్కృతంలో "న" అనే శబ్దం యొక్క రూపాంతరం. వ్యతిరేక అర్ధాన్ని సూచించేలా మనం వాడే Non- Un అనేవి కూడా వ్యతిరేక పదాలే. ఉదాహరణకు అభయం అంటే భయం లేక పోవడం. న+భయం= అభయం అయింది. un-expected అనే పదాన్ని తీసుకోండి. న+ ఆపేక్షిత = అనాపేక్షిత.


ఇవే కాక కొన్ని ముఖ్యమయిన పదాలు వాటి సంస్కృత మూలం కింద పట్టికలో ఇచ్చాను. ఇంగ్లిష్ భాష అంతా సంస్కృతం నుండి వచ్చింది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గాని, ప్రస్తుతం మనం చూస్తున్న సమాజ మౌలిక నిర్మాణం అంతా ఒకే భాషా, సాంస్కృతిక కుటుంబానికి చెందిందని భావిస్తున్నాను. వసుదైక కుటుంబం అనే మాటకి అర్ధం ఇదేనేమో. (All universe is one family)

ఇంగ్లీష్ - సంస్కృతం - తెలుగు
Mother - మాతృః - అమ్మ

Father - పితృః - నాన్న

Brother - భ్రాతః - అన్న/ తమ్ముడు

Sister - సహోదరి - అక్క/ చెల్లి

Son - సూన - కుమారుడు

Daughter - దుహిత - కుమార్తె

Man - మానవ - మానవుడు

Name - నామ - పేరు

Three - త్రయ - మూడు

Decimal - దశ - పది

Door - ద్వార - తలుపు

Divine - దివ్య - దైవ సంబందమయిన

Path - పథ - దారి

Dental - దంత - దంతము

Nerve - నర - నరము

Tree - తరు - చెట్టు

Me/my - మై - నేను

Naval - నావ - నౌక/ఓడ

Heart - హృద్ - హృదయము/ గుండె

Cruel - కౄర - కౄరమయిన

Location - లోక - లోకము/ప్రదేశము

Axis - అక్ష - అక్షము

Yes - అసి - నిజం

No - న - లేదు/కాదు

Hunt - హంత - చంపు

Vehicle - వాహన్ - వాహనం

Mouse - మూషక్ - ఎలుక

Owl - ఔల్యూక - గుడ్లగూబ 


http://saradaa.blogspot.in/2008/07/blog-post_15.html

భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పతనానికి కారణాలు, నివారణలు....

      ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రాచీన భారతదేశం సాంకేతికంగా, ఆర్థికంగా అత్యంత బలమైన దేశం. సహజంగా, ఇప్పుడు మనం అమెరికా పరుగులు తీస్తున్నట్టుగా, అప్పటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భారతదేశం వెళ్ళాలని ఉవ్విళ్ళూరేవారు. అలా వ్యాపారం నిమిత్తమం, విజ్ఞానం నిమిత్తం ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. మంగోలాయిడ్లు, నీగ్రిటోలు, సుమేరియన్లు, పర్షియన్లు, అరబ్బులు ఇలా అనేక రకాల జాతుల ప్రజలు భారతదేశంలోకి వరదలా ప్రవహించారు. అలా బయటి వ్యక్తుల ప్రమేయం అధికమయ్యే సరికి ఇక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం చోటు చేసుకుంది. కొత్త భాషలు, మతాలు, సంస్కృతులు ప్రవేశించే కొద్దీ సమాజంలో ఎన్నో సర్దుబాట్లు అవసరం అవుతాయి. వారి అలవాట్లు, వేషభాషలు ఇక్కడి వారికి అలవాటు పడడమో లేదా ఇక్కడి వారి సంస్కృతినే కొద్ది పాటి మార్పులతో వచ్చిన వారు అనుసరించడమో జరుగుతుంది. దీనినే సమాజ శాస్త్రం (సోషియాలజీ) లో అసిమిలేషన్‌ (తెలుగులో ??) అంటారు. అలా కొద్ది కాలం గడిచేప్పటికి సమాజంలో ఎన్నో చీలికలు కనిపిస్తాయి. పెద్ద కుటుంబాలు, ప్రాంతాలు, రంగులు, భాషలు ఇలా ఎన్ని రకాలుగా విడిపోవచ్చో అన్ని రకాలుగా సమాజం విడిపోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు అనుభవించిన సాంకేతిక పరిజ్ఞానం నిర్లక్ష్యం చేయబడుతుంది. సమాజంలో అలజడి రేగుతుంది. రాజ్యాలు కూలిపోతాయి. దేశమంతా చిన్న చిన్న ముక్కలవుతుంది. ఇక అంతటితో మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతారు. ఈ విధమైన అలజడులు భారతదేశ చరిత్రలో ఎన్నో పర్యాయాలు సంభవించాయి. వేదకాలం పూర్తయిన తరువాత ఒకసారి, మరలా రాముడు రాజ్యం చేసిన తరువాత మరోసారి, మహాభారత యుద్ధం జరిగిన తరువాత మరోసారి సమాజం పూర్తిగా కల్లోలమయింది. వీటినే మనం యుగాలు అంటున్నాము. పాశ్చాత్య చరిత్రకి అందినంత వరకు భారతదేశంలో అటువంటి స్థితి మౌర్య సామ్రాజ్య స్థాపన వరకు ఉంది. అశోకుడు చిన్న చిన్న రాజ్యాల్ని జయించి, విశాల భారత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాని అశోకుడి మరణం తరువాత మరలా సామ్రాజ్యం విచ్చిన్నమయింది. భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల మధ్య మత పరమైన విబేధాలు రాజుకున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ తదితర మతాల మధ్య విద్వేషాలతో భారతదేశం అనేక కష్టాలలో పడింది. అటువంటి సమయంలో భారతదేశాన్ని ఆదుకొన్నవారు శంకర భగవత్పాదులు. ఆయన ఆసేతు హిమాచలం పర్యటించి, తన జ్ఞానంతో అన్ని మతాల సారం ఒకటే అని ప్రకటించి, దేశం నలుమూలలా శక్తి పీఠాలు స్థాపించి, అనేక చిన్న చిన్న మతాల్ని విలీనం చేసి, భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక్కటే అనే రూపుని తీసుకువచ్చారు. మరలా దేశం అభివృద్ధి పొందడం మొదలయింది.
    కాని ఆయన ప్రయత్నం మరలా వృధా అయింది. ఈ సారి ముస్లిం దురాక్రమణదారుల చేతిలో భారతదేశం నష్టపోయింది. 13వ శతాబ్ది మొదలుకొని జరిగిన దండయాత్రల్లో దేశానికి ఆర్థిక నష్టంతో పాటు, సాంకేతిక, ఆధ్యాత్మిక నష్టం కూడా జరిగింది. వారి చేతుల్లో అనేక విలువైన దేవాలయాలు కొల్లగొట్టబడ్డాయి, అరుదైన శిల్ప కళ ధ్వంసం చేయబడింది. కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన విలువైన గ్రంధాలు, పరిజ్ఞానం మంటల్లో కాలి బూడిదయిపోయింది. ఈ సారి భారత సమాజంలో మరిన్ని దుర్మార్గపు మార్పులు చేయబడ్డాయి. ముస్లిం దురాక్రమణదారుల నుండి కాపాడుకోవడానికి సంపదనంతా దాచిపెట్టేసుకోవడం, పక్కవాడికి ఉన్నా లేకున్నా మన వరకు దా(దో)చుకొని, జాగ్రత్త పడడం వంటివి భారతీయుల జీన్స్‌లో అప్పుడే ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఇప్పటికీ మనల్ని వదల్లేదనుకోండి - అది వేరే సంగతి. మన రాజకీయ నాయకుల్లో మరింత స్పష్టంగా వీటిని గమనించవచ్చు. ఆ సమయంలో ముఖ్యంగా, ఎక్కువగా బలయిపోయింది, నష్టపోయింది - ఆడపిల్లలే. చిన్న తనంలోనే పెళ్ళిళ్ళు చేయడం (బాల్య వివాహాలు), భర్త చనిపోతే ఎవరికీ దక్కకుండా భార్య కూడా చితిలో దూకి చనిపోవడం (సతీ సహగమనం), వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరికీ కనబడకుండా ఉండాలనడం (పరదా పద్దతి) ఇవన్నీ మధ్య యుగాల్లోనే భారతీయ సమాజంలో ప్రవేశించి, మూఢాచారాలుగా స్థిరపడిపోయాయి. భారతీయులకి, ముస్లింలకి జరిగిన ఆధిపత్య పోరులో కూడా దేశం ఎంతో నష్టపోయింది.
    వీరిద్దరి పోరు ఇలా కొనసాగుతుండగా, మరో పెద్ద శత్రువు, యూరోపియన్లు వచ్చారు. వారి రాకతో హిందు, ముస్లింలు ఏకమైపోయి, ఆ పెద్ద శత్రువుని ఎదిరించే పనిలో లీనమైపోయారు. అయితే యూరోపియన్ల వల్ల, ముఖ్యంగా బ్రిటీష్‌ వారి వల్ల జరిగిన మంచి ఏమిటంటే, దేశానికి ఒక రూపం వచ్చింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ పోయి, ఒకే దేశంగా ఆవిర్భవించింది - భారతదేశం.
    ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా జరిగిన పోరాటాల వల్ల గాని, భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల వల్ల గాని భారతీయులలో మితిమీరిన సోమరితనం, నిర్లక్ష్యం, ఎదుటి వారిని దోచుకొనే తత్వం నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. దాని వల్లనే ఈనాడు సమాజంలో మనం చూస్తున్న అవినీతి, కోట్ల రూపాయిల కుంభకోణాలు, అభివృద్ధి లేకపోవడం, పేదరికం వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాడు కూడా నాకు లాగే భారతీయుడే, సాటి మనిషే అన్న స్పృహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి మతాన్ని గాని, సంస్కృతిని గాని ప్రాతిపదికగా తీసుకోవడంలో ఏ తప్పూ లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏదో ఒక మతం వైపు మొగ్గుచూపాయి. కాని భారతదేశంలో దీనికి భిన్నంగా అన్ని మతాలు సమానమే అనే ధృక్పధంతో అందరినీ ఆదరించారు. అదే వారి పాలిట శాపమైంది.
    మనం ఏ మతాన్ని విమర్శించనవసరం లేదు. ఎవరిపైనా ఎదురు దాడి చేయవలసిన ఆగత్యం లేదు. మనలోని లోటుపాట్లని సరిచేసుకుని, మనల్ని మనం కించపరుచుకొని, ఎదుటి వారికి లోకువ ఇవ్వకుండా, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని భద్రంగా భావి తరాలకు అందించగలిగితే చాలు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కూడా బాల గంగాధర్‌ తిలక్‌ వంటి వారు ప్రసిద్ధ గణేష్‌ మహోత్సవాలు మొదలుపెట్టి, ప్రజల హృదయాల్లో జాతీయ భావనని రగిలించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సమర్థ రామదాసు శివాజీకి, విజయనగర సామ్రాజ్య స్థాపనకి హరిహరరాయలు, బుక్కరాయలకి విద్యారణ్య స్వామి వంటి వారు వేదాలు, పురాణ కథల ద్వారానే దేశ భక్తిని రగిలించారు. పిల్లలకి కూడా పాఠ్యాంశాల్లో వేద శ్లోకాలని, పురాణాల్లోని ఆదర్శమూర్తుల కథల్నీ పెట్టడం వలన వారు కూడా పెద్దయాక ఆయా ఆదర్శాలని అవలంభించడానికి వీలవుతుంది. భారతదేశం ఎవరో దోచుకుని వదిలిపెట్టేసిన దేశం కాదని, మనం కూడా దోచుకోవడానికే ఉన్నామని కాకుండా, ఇది మనదేశమని, నేను భారతీయుడినని గర్వంగా చెప్పుకోగలిగిన విజ్ఞానం ఇక్కడ ఉందని, ఇక్కడి సంస్కృతికి నేను నిజమైన వారసుడనని, ప్రాచీన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడం మన తక్షణ కర్తవ్యమని (-స్వామి వివేకానంద) ప్రతి వ్యక్తి భావించే విధంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రతి రోజు పాఠశాల ప్రతిజ్ఞలో చెప్పుకోవడమే కాకుండా, నిజంగా ప్రతి ఒక్కరి చేత ఆలోచింపచేసి, ఆచరింపచేసే విధంగా చేయగలిగితేనే భారతదేశానికి నిజమైన విముక్తి, స్వాతంత్య్రం.
 
 http://saradaa.blogspot.in/2012/03/blog-post.html

జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు (పార్ట్- 1)


       జ్యోతిశ్శాస్త్రం గురించి ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వాదోపవాదాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి. వేదిక మారింది. తెలుగు బ్లాగులే ఆ వాదాలకి వేదిక. అత్యంత ప్రాచీనమైన భారతీయ శాస్త్ర సాంకేతిక విషయాలకి పట్టిన గతే ఇపుడు జ్యోతిశ్శాస్త్రానికి కూడా పట్టబోతోందనేది సుస్పష్టం. దీనికి కారణం ఈ శాస్త్రంపై అనేక మందికి ఉన్న అపోహలు మాత్రమే.

    జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...

    ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో మొదటి సూత్రం. అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆ అణువులు అలా పరస్పర ఆధారితాలు కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్న విశ్వమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే కాదు. అంతెందుకు ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. మన శరీరంలోని అతి చిన్న కణం, మరో కణం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల కణాలు కలిసి, భూమిచేత ఆకర్షించబడి ఉన్నాయి. ఈ భూమి తన కన్నా పెద్దదైన నక్షత్రం - సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరలా ఆ సూర్యుడు తన గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు వంటి వాటిటో కలిసి పాలపుంత (మిల్కీవే గెలాక్సి) చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారు. అంటే, ఈ విశ్వంలోని ప్రతి అణువు మరో అణువు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాండం కూడా. ఆ తిరగడం కూడా ఎంతో ఖచ్చితత్వంతో.... ఎంత ఖచ్చితత్వమంటే పరమాణు గడియారంలో కొలవగలిగినంత... మిల్లీ సెకనులో అరసెకను కూడా తేడా రానంత... ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి.

    ఇక జ్యోతిష శాస్త్రం విషయానికి వద్దాం. విశ్వంలో ఉండే ప్రతి గ్రహం, నక్షత్రం అంత నిర్దుష్టంగా ప్రవర్తిస్తున్నపుడు భూమి మీద ఉన్న మానవ జీవితం మాత్రం ఎందుకింత గందరగోళంగా ఉంది? దీనిపై ప్రాచీన ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు జరిగాయి. ఒకసారి గ్రహాలు, నక్షత్రాల నడవడికను, దానిలోని నిర్ధుష్టాన్ని కనిపెట్టిన తరువాత, మానవ జీవిత విధానం కూడా వాటికి అనుగుణంగా ఉందేమో అన్న భావన ప్రాచీన సమాజంలో తలెత్తి ఉంటుంది. ఆ విదంగా గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.

    ఈ ప్రకృతిలో... ఆ మాటకొస్తే ఈ విశ్వంలో ఉండే ప్రతీ అణువు ఒక నిర్ధిష్ట విధానంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా సరే... చర్మంపై ఉండే కణాలను భూతద్దంతో పరిశీలిస్తే, అవి ఒక రకంగా ఉన్నట్టు అనిపించవు. గందరగోళంగా, గజిబిజిగా ఉంటాయి. కాని దూరం నుంచి చూస్తే మాత్రం కణాలన్నీ కలిసి ఒక చక్కటి ఆకారంగా... మనిషిగా కనిపిస్తాయి. ఆపిల్‌ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన సూత్రం ఇదే. కనెక్టింగ్‌ డాట్స్‌... జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు అర్ధం పర్థం లేనివిగా కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపితే వాటిలో అర్థం ఉంటుంది.... అవన్నీ కలిస్తే... అదే జీవితం. ప్రతి మనిషి జీవితం వ్యక్తిపరంగా చూస్తే, ఎటువంటి అర్థం ఉండక పోవచ్చు. కాని, అందరినీ కలిపి, ఒక పద్దతి ప్రకారం వర్గీకరిస్తే, జీవితం యొక్క మౌలికాంశాల్లో ఏకరూపత మనకు అర్థం అవుతుంది. మనుషుల్ని ప్రవర్తనా పరంగా, ఆలోచనల పరంగా, జీవన విధాన పరంగా విడదీసి చూస్తుంది జ్యోతిశ్శాస్త్రం.

మానవులపై గ్రహాల ప్రభావం వుంటుందా?: 
జ్యోతిషాన్ని విమర్శించే వాళ్ళు ముందుగా చూపే కారణం... ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాలు, అంత కన్నా దూరంగా ఉండే నక్షత్రాలు మానవ జీవితంపై, వారి ప్రవర్తనపై ఎటువంటి కారణాన్ని చూపలేవు అనేది. ఎక్కడో ఉండే కుజ గ్రహం (మార్స్‌ లేదా అంగారకుడు) భూమిపై ఒక సూదిని కూడా కదిలించలేడు, యుద్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అవుతాడా.. అంటూ ఎగతాళి చేస్తారు. వీళ్ళందరికీ గురువయిన న్యూటన్‌ కనిపెట్టిన గ్రహబలం సిద్ధాంతం ఆధారంగా ఒక గ్రహం మనిషిపై చూపించే ప్రభావం కన్నా, ఇంట్లో వెలిగే బల్బు మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని లెక్కలు కట్టి మరీ వాదిస్తారు. కాని కఠోర వాస్తవం మరోలా ఉంది. దాన్ని మనం నమ్మక తప్పదు.

    జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. చంద్రుడి ప్రభావం మనిషి మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చంద్రుడు మనసుకి అధిపతి. ఈ ప్రతిపాదనకి మూల కారణం కూడా వివరిస్తాను. భూమిపై సముద్రంలో సంభవించే ఆటు పోట్లకి కారణం చంద్రుడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమావస్య, పౌర్ణమి రోజుల్లో ... చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు సముద్రంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది. అది పైకి బోర్లించిన గిన్నెలా సముద్ర జలాల్లో కనిపిస్తుంది. చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటిబుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దాని వల్లనే పోటు వచ్చి, సముద్ర జలాలు ఉప్పొంగుతాయి. దీని వల్ల చంద్రుడి ప్రభావం భూమిపై ఉందని నిర్ధారణ అయింది. మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది. అది చంద్రుడిచే ఆకర్షించబడుతుంది. అందుకే అమావస్య, పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకి పిచ్చి ఎక్కువవుతుంది. చంద్రుడి వల్ల ప్రేరేపించబడతారు కాబట్టి వారిని ఇంగ్లీష్‌లో లూనాటిక్స్‌ (లూనార్‌ అంటే చంద్రుడు) అని వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలింది.

    ఇక సూర్యుడు... భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక ఆధార భూతుడు. ఆయన నుంచి వచ్చిన శక్తి రకరకాల రూపాల్లోకి మారి, భూమిలోకి, భూమి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి మనకి ప్రవహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రంగులు, తరంగ దైర్ఘా ్యలు (ఫ్రీక్వెన్సీలు) మొక్కలు, జంతువుల్లో ఎన్నో మార్పుల్ని కలుగజేస్తాయి. ప్రాణులకి ఎంతో అవసరమైన 'డి' విటమిన్‌ మొదలుకొని, ప్రాణ హానిని కలుగజేసే అతి నీలలోహిత కిరణాలు (ఆల్ట్రా వయోలెట్‌ రేస్‌) కూడా సూర్యుడిలోనే ఉద్భవిస్తాయి. సూర్యుడి తాపం 5 డిగ్రీలు పెరిగితే చాలు... భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు. సూర్యుడికి ఉన్న విశిష్టతను, ప్రాచీన నాగరికతలన్నీ సూర్యుడినే ఎందుకు దైవంగా కొలిచాయన్న విషయాన్ని గురించి అత్యంత రహస్యమైన, విలువైన విషయాల్ని తరువాతి పోస్ట్‌లో వివరిస్తాను. దీన్ని బట్టి మానవ జీవితంపై సూర్యుడి ప్రభావం ఉందని తేలింది.

    ఇక మిగిలింది... ఇతర గ్రహాలు. బుధుడు మొదలుకొని, వరుణుడు (యురేనస్‌) వరకు గ్రహాలన్నీ సౌర కుటుంబంలో భాగమే. ముందు చెప్పుకున్నట్లుగా, గ్రహాలన్నీ పరస్పర ఆధారితాలు. సౌర కుటుంబంలో ఉన్న ఏ ఒక్క గ్రహాన్ని తొలగించినా సౌర కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. సూర్యుడు తన అఖండమైన శక్తితో ఏ విధంగా తనకు దగ్గరగా ఉన్న బుధ గ్రహాన్ని ఆకర్షించి ఉంచాడో, అంతే శక్తి వంతంగా తనకు అత్యంత సుదూరంలోని తోకచుక్కల్ని కూడా ఆకర్షించి, తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకుంటున్నాడు. అత్యంత సాంద్రత కలిగిన గురు గ్రహం, నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగిన శని గ్రహం కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది.

    మానవ శరీరం కూడా ఒక యంత్రమే. ఇంకా మాట్లాడితే... ఈ విశ్వంలో ఒక భాగమే. విశ్వంలోని ప్రతి శక్తి, ఈ చిన్ని యంత్రంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. మానవ శరీరంలో ఎన్నో మూలకాలున్నాయి. అవి అత్యంత సూక్ష్మమైన మోతాదుల్లో ఉన్నాయి. మానవ ప్రవర్తనపై ఈ మూలకాలన్నీ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం పెరిగినా లేదా తగ్గినా, అలా జరిగిన మనిషి భావోద్వేగాల్లో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో ఎంతో తేడా రావడం మనం గమనించవచ్చు. ఆయా మూలకాలు, ఆయా గ్రహాల ఫ్రీక్వెన్సీ బట్టి ప్రభావితం అవుతాయి. దాన్ని బట్టే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా పతనమవ్వడం సంభవిస్తాయి. మనిషి ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మెదడులో ఒక చిన్న కణంలో సంభవించే మార్పు చాలు. కోపం రావడానికి గాని, ప్రేమ రావడానికి గాని. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడు. అదే విధంగా కుజుడు భూమి మీది గుండు సూదిని కదల్చలేకపోవచ్చు. కాని, అదే కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు. ఇవన్నీ గ్రహ ప్రభావితాలే. ఇదే సూత్రం నక్షత్రాలకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి సందర్భాలలో మనిషికి తెలిసిన భూమి మీది భౌతిక సూత్రాలు ఎందుకూ పనిచేయవు. అసలు గురుత్వాకర్షణ శక్తిని లెక్కగట్టడమే చాలా కష్టం. మనకి తెలిసిన సైన్స్‌ ప్రకారం కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఇతంత బ్రహ్మాండమైన గ్రహాలని, నక్షత్రాలని, తోకచుక్కల్ని ఒక చోట కట్టిపడేసి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగేలా చేయడం, పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. మనకి తెలియని ఆ పదార్థానికే కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) అని పేరుపెట్టారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. మనకు తెలిసిన ద్రవ్యం... భౌతిక పరమైనది ఈ విశ్వంలో 10 శాతం మాత్రమే. తెలియని ద్రవ్యం 90 శాతం ఉండొచ్చని అంచనా. ఆ డార్క్‌ మేటర్‌ విశ్వంలోని అన్ని శక్తుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందే మన ఊహలకి కూడా అందదు. ఇలా గ్రహాలకి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని, మనిషి జీవితం కూడా కొన్ని ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటుందనే భావనని నిరూపించే ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. (ఇంకా వుంది)


 http://saradaa.blogspot.in/2012/03/1.html

తెలుగు వారికి మాత్రమే గల ప్రత్యేకతలు

    తెలుగు వారి అచ్చ తెనుగు పండుగ 'ఉగాది' వచ్చింది. నందనానంద కరంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు, అవి చాలా ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుందామని...

అవధానం:
సాహితీ ప్రక్రియల్లో విశిష్టమైనది అవధాన ప్రక్రియ. అష్టావధానం మొదలుకొని, సహస్రావధానం వరకు పృచ్ఛకులు అడిగిన అన్ని రకాల సాహితీ ప్రశ్నలను, గుర్తుంచుకొని, ఏక కాలంలో, ఆశువుగా అవధాని ఎవరి సమాధానం వారికి చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అవధాని యొక్క మేధస్సు, ధారణా శక్తి, సాహిత్య పటిమ మీద అవధాన ప్రదర్శన, విజయం ఆధారపడి ఉంటాయి. ఇంతటి క్లిష్టతరమైన ప్రక్రియ మరే భాషా సాహిత్యంలోను కనిపించదు.

ఆవకాయ:
ఆవకాయ పేరు చెప్పగానే నోరూరని తెలగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరో కవి చెప్పినట్లు, చెట్టు మీద కాయని, సముద్రంలో ఉప్పుని కలిపి చేసే ఈ పచ్చడి, దాని రుచి తెలుగు వారికి మాత్రమే సొంతం. పెళ్ళిజరిగినా, పేరంటం జరిగినా ఆవకాయ ఘుమఘుమలు లేకుండా నిండుదనమే ఉండదు కదండి.

బుర్ర కథ:
గ్రామీణ ప్రాంతాల్లో బుర్రకథని మించిన కాలక్షేపం మరోటి ఉండదు. గ్రామీణుల జీవనం, జానపదుల సాహిత్యం, వారి కథలు, పురాణాలు ఇలా ఒకటేమిటి? తందాన తాన అంటూ ముగ్గురు కలిసి ప్రదర్శిస్తూ, పాటలు పాడుతూ, పద్యాలు ఆలపిస్తూ  బుర్రకథ చెబుతుంటే, చెవి ఒగ్గని తెలుగు వాడు ఉంటాడా?


నాటకాల్లో పద్యాలు:
తెలుగు వారి  నాటకాల్లో ప్రత్యేకత పద్యాలు. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని రాయబారం పద్యం ఆలపించినా, 'చెలియో చెల్లకో' అంటూ హరిశ్చంద్ర కాటిసీను పద్యం ఆలపించినా, తెలుగు వారు మైమరచిపోతారు. ఒకసారి ఒకటో కృష్ణుడు పద్యం ఆలపించి, దాని చివర ఆ..ఆ......ఆ........ఆ....... అంటూ రాగం ఆలపించడం మొదలు పెడితే ఇక నాటకం పూర్తయే సరికి తెల్లారిపోవలసిందే. తెలుగు అజంత భాష అవ్వడం వలన పద్యం చివర రాగం తీసినా మధురంగానే ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వరుడు / అన్నమయ్య కీర్తనలు :
తెలుగు వారికే ప్రత్యేకమైన ఇష్ట దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. అందరు దేవతలకి అన్ని చోట్ల దేవాలయాలు ఉండొచ్చు గాని, సాక్షాత్తు విష్ణువు వేంకటేశ్వరునిగా కొలువై వున్న తిరుమల గిరి తెలుగు వారి వరాల కొండ.  'ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే' అంటూ ఆ స్వామిని నోరారా కీర్తించిన అన్నమయ్య కీర్తనలు మనకు మాత్రమే సొంతం. 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ అచ్చ తెలుగు సొగసులద్దిన అన్నమయ్య మన తెలుగు వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం కాక మరేమిటి?

వేమన పద్యాలు:
చిన్న చిన్న పద్యాలలో కొండంత భావాన్ని పొదిగిన వేమన పద్యాలు జీవిత సారాన్ని విశదీకరిస్తాయి. వేయి మాటల్లో చెప్పలేని విషయాన్ని నాలుగు వరుసల్లో చెప్పగలగడం, అదీ అతి చిన్న తెలుగు వాక్యాల్లో ఇమిడిపోవడం తెలుగు భాష గొప్పదనమైతే, అలా ఇమడ్చగలగడం వేమనకే సాధ్యం. తెలుగు వారి హృదయాలలో వేమన స్థానం ఎప్పటికీ పదిలం.

గోరుముద్ద, ఉగ్గుపాలు:
మీరు ఎంత గొప్పగా ఎన్ని భాషలు మాట్లాడగలిగినా, గోరుముద్దని, ఉగ్గుపాలుని ఏ భాషలోకైనా అనువదించి చూడండి. తెల్ల ముఖం వేసారే? ఎందుకంటే ఈ పదాలకి సమానమైన పదాలు వేరే భాషల్లో దొరకవు. చిన్న పిల్లలకి పెట్టే గోరు ముద్దలు, ఉగ్గుపాలు తల్లి ప్రేమకు చిరునామాలు. తెలుగు తల్లులు ప్రేమకు ప్రతిరూపాలు.

వావి వరుసలు:
తెలుగు వారి వావి వరుసలకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకు ఉన్నన్ని వరుసలు, బాంధవ్యాలు మరే భాష వారికి లేవంటే అతిశయోక్తి కాదేమో? అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, వదిన, మరదలు, బావ, బావ మరిది, తోడికోడలు, తోడల్లుడు అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఒక్కొక్క వరుసతో పిలుస్తూ ఉంటే ఉండే ఆనందమే వేరు. ఇప్పుడంటే కాన్వెంట్‌ చదువులు సోకయిపోయి, రిక్షా వాడి దగ్గర్నుండి, పాలబ్బాయి దాకా కనబడ్డ ప్రతి మగాడిని ఆంకుల్‌, ఆడాళ్ళని ఆంటీ అని పిలుస్తున్నారు, ఈ కాలం పిల్లలు. వారికి తెలుగు వారి వావి వరుసల్లో ఉండే మధురమైన ఆనందాన్ని తెలియజేయాల్సిన అవసరం అందరి మీదా ఉంది.

చీర / పంచెకట్టు:
భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లండి, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళండి. అచ్చ తెలుగు వాళ్ళని ఇట్టే పసిగట్టవచ్చు. తెలుగు వారి పంచెకట్టు, ఆడవారి చీరకట్టు జగత్‌ ప్రసిద్ధమైనది. పంచె కట్టుకుని, నుదుటన బొట్టు పెట్టుకుని, భుజాన ఉత్తీరీయం వేసుకుని తెలుగు పెద్దాయన నడిచి వెళుతుంటే, అప్రయత్నంగా చేతులు జోడించ బుద్దేస్తుంది. అలాగే చీర కట్టులో మగువ అందాన్ని వర్ణించడం మహాకవులకయినా సాధ్యం కాదేమో కదా..

తెలుగు భాష:
గొప్ప చెప్పుకోకూడదు కానీ, అసలు తెలుగు భాషే తీయనైనది, కమ్మనైనది. అందుకే రాయల వారు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు విశిష్టతను చెప్పకనే చెప్పారు. గోదారి గలగలలు, కృష్ణమ్మ ఉరవళ్ళు కలగలిపి, కొంచెం తేనె, కొంచెం పంచదార కలిపితే అది తెలుగు భాష అవుతుందని ఒక కవి హృదయం. అది నిజమే కదా. 'నల్లని వాడు, పద్మ నయనమ్ముల వాడు, కృపా రసంబు పై జల్లెడు వాడు' అని పోతన అచ్చ తెలుగులో కృష్ణుడి వర్ణిస్తుంటే ఎంతటి అపురూపం... అసలు పోతన వల్ల తెలుగులో అన్ని మంచి పద్యాలు వచ్చాయా, తెలుగు సొగసు వల్ల పోతన అన్ని మంచి పద్యాలు రాయగలిగాడా అంటే... సమాధానం లేని ప్రశ్నే. 'విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి, మా ప్రాణముల్‌ తీతువానని ప్రశ్నించె' అని కరుణ రసాన్ని పాపయ్య శాస్త్రి ఒలికించినా, గోదారి అలలపై నాయుడు బావపై కన్నేసిన ఎంకి పాడిన పాటలు నండూరి వారి కలం నుంచి జాలువారినా, 'వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ రథ చక్రాలొస్తున్నాయ్‌' అని శ్రీశ్రీ కలం ఘర్జించినా, అన్నీ తెలుగు వారి సంపదలుగానే మిగిలిపోయాయి. అంతటి అపురూప సంపదను జాగ్రత్తగా భావి తరాలకి అందించే భారాన్ని మన భుజాల మీదే పెట్టుకునే అపురూప అదృష్టానికి నోచుకునే తెలుగువారిగా పుట్టిన మనం ఎంతటి పుణ్యాత్ములమో కదా...


http://saradaa.blogspot.in/2012/03/blog-post_22.html

ఆంగ్లం వల్ల మాత్రమే మనం బ్రతకగలమా?

    'కన్న తల్లిని, సొంత ఊరిని మరువకూడదు' అంటారు. మాతృ భాషకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఒక వ్యక్తి తను పుట్టిన కుటుంబంలో కొన్ని తరాలుగా వాడుకలో ఉన్న భాషనే మాతృ భాషగా వ్యవహరిస్తుంటారు. మనందరికి మాతృభాష తెలుగు మాత్రమే. మాతృభాష అనేది ఒక వ్యక్తికి అత్యంత స్వాభావికంగా, సహజంగా వస్తుంది. నేర్చుకునేటపుడు కృత్విమత్వం అంటూ ఉండదు. కారణం... కొన్ని వేల సంవత్సరాలుగా ఆ కుటుంబంలో, సమాజంలో వాడుకలో ఉండడం వలన ఆ భాష పలికే తీరు, దాని భావం, వ్యాకరణాలతో సహా ఆ వ్యక్తికి సహజంగా సంక్రమిస్తుంది. ప్రత్యేకించి వ్యాకరణ సూత్రాలు, వాడుకను గురించిన నియమాలు ఎవరూ చెప్పనక్కర్లేదు. మాతృభాషలోని భావం హృదయానికి ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు అన్నీ మాతృభాషలోనే ఏర్పడతాయి, బయటకు వెల్లడించబడతాయి. మహాత్మా గాంధీ చెప్పినట్లు 'తన మాతృభాషలో సంపూర్ణ జ్ఞానం సంపాదించిన వ్యక్తి, ఇతర భాషలని కూడా ఎంతో తేలికగా నేర్చుకోగలుగుతాడు'.
    కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సామాన్యుడి దగ్గర నుండి ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరు పర భాషా జపం చేస్తున్నారు. ఆంగ్లం నేర్చుకుంటేనే భవిష్యత్తు, అది లేకపోతే జీవితమే లేదు అనేట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడో పరాయి వారు వదిలి వెళ్ళిపోయిన భాషనే పట్టుకుని వేళ్లాడుతూ, భావి పౌరులకు కూడా అదే జీవితం అనేట్లుగా చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. అసలింతకీ ఆంగ్ల భాష నిజంగా ఉపయోగకరమైనదేనా? మాతృభాష కూడా నిర్లక్ష్యం చేసి, దాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉందా అనేది మన ప్రశ్న.

భారతదేశంలో ఆంగ్ల విద్య:

    ఆంగ్లేయులు భారత దేశంలో అడుగుపెట్టిన తరువాత వారికి ఇక్కడ పరిపాలనలో సహకరించే వారు కరువయ్యారు. అప్పటి వరకు మధ్యవర్తుల ద్వారాను, రెండు భాషలు తెలిసిన దూబాసీలు (ద్విభాషీలు) ద్వారాను పరిపాలన, రాజులతో మధ్యవర్తిత్వం నడపడం వంటివి చేసారు. రాను, రాను వారికి ప్రతి పనికీ ఇంగ్లండు నుండి ఉద్యోగుల్ని తెచ్చుకొనేబదులు ఒక్కడే తమ మాటని అర్థం చేసుకుని, ఆచరించే గుమాస్తాల్ని తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అలా భారతదేశంలో ప్రవేశపెట్టబడిందే 'మెకాలే' విద్యా విధానం. అప్పటి వరకు సర్వ మానవాళికి, ప్రపంచంలోని ప్రతి దేశానికి దిశా నిర్దేశం చేసి, మొట్టమొదటి విశ్వవిద్యాలయాల్ని స్థాపించిన భారత దేశ విద్యా విధానం తన ప్రాభవాన్ని కోల్పోయి, పరాయి దేశస్థుల చేతిలోకి వెళ్ళిపోయింది. మెకాలే విద్యా విధానం యొక్క మొట్టమొదటి లక్ష్యం 'భారతదేశంలో తమ పరిపాలనకు కావలసిన గుమాస్తాల్ని' తయారుచేసుకోవడం. భారతీయులు తమ విలువైన సాంస్కృతీ సాంప్రదాయాల్ని మరచిపోయేలా చేయడం. భారతీయులు ప్రతీ విషయంలో ఆలోచించే 'ధర్మాన్ని' వారి నుంచి వేరు చేయడం. ఇవీ ఆంగ్ల విద్యా విధానం యొక్క విషపు ఆలోచనలు.
    స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గతించినా, మనం ఇంకా ఆ ఆలోచనా సరళి నుండి బయట పడడానికి ప్రయత్నం చేయడం లేదు సరికదా, రోజు రోజుకీ ఆ ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోతున్నాము. నా చిన్న తనంలో ఒకటవ తరగతి పుస్తకంలో ముందు పాఠం 'మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ'. ఇది అత్యున్నత భారతదేశ ఆలోచనా సరళి. తల్లితండ్రుల పట్ల, సమాజం పట్ల, గురువుల పట్ల మనం వ్యవహరించాల్సి తీరు పాఠ్యాంశాలుగా ఉండేవి. మీలో ఎవరైనా ఇప్పటి ఒకటో తరగతి పుస్తకాలు తీసి చూడండి. ముందుగా పరమత ప్రార్థన. ఇంకొంచెం ముందుకెళితే మనకు ఎందుకూ పనికిరాని, మన సంస్కృతికి సంబంధం లేని ఆంగ్లంలో ఉన్న పొట్టి పాటలు. వాటికి ఏ విధమైన అర్థం పర్థం ఉన్నట్లు తోచదు. వాటిని చదవకపోతే, కంఠతాపట్టి అప్పజెప్పకపోతే పిల్లలకి గుంజీలు, అరదండాలు. పోనీ అవేమన్నా జీవితానికి పనికొచ్చే విశేషాలా? తలా తోకా లేని పొట్టి పద్యాలు మాత్రమే. ఇలా మొదలైన విద్య ద్వారా కేవలం గుమాస్తాల్ని తయారు చేయగలం కాని, సమాజానికి, దేశానికి పనికొచ్చే ఆదర్శమూర్తుల్ని తయారు చేయలేము. తన కుటుంబానికిగాని, తను ఉంటున్న సమాజానికి గాని, కనీసం కట్టుకున్న భార్యకి, ప్రాణ స్నేహితుడి కూడా పనికిరాని, మాట్లాడ్డం తెలిసిన ఒక జంతువును తయారుచేసి, సమాజంలోని వదులుతున్నాము. దానివల్లనే నేడు మనం చూస్తున్న ఇన్ని దోపిడీలు, ఇంత అరాచకం, ఎదుటివారిపై నిందలు, మనం సిగ్గులేకుండా బ్రతుకులు వెళ్ళదీయడం..

ఆంగ్లం వల్ల మాత్రమే మనం బ్రతకగలమా?

    ఆంగ్లాన్ని సమర్థించే వాళ్ళు చెప్పే మొదటి మాట... ఆ భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు కదా... నిజమే.. ఆ భాష నేర్వడం వల్ల ప్రపంచంలో ఎక్కడికైనా బానిసగా వెళ్లి, గొర్రెల్లా విదేశీయులు చెప్పినదానికి తలూపుతూ, గుమాస్తాగా బ్రతుకును వెళ్ళదీయవచ్చు. కాని, నీ సమాజంలో సింహంలా బ్రతకడానికి మాత్రం ఆ భాష ఎందుకూ పనిచేయదు. కారణం... ఆ భాషలో తగలబడిన విద్యా జ్ఞానం. ఈ నిజాన్ని గుర్తించిన అనేక దేశాలు అంటే చైనా, జపాన్‌, కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని రద్దు చేసి, మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని చేసే వీలు కల్పిస్తున్నాయి. దాని వల్ల విద్యార్థికి తను నేర్చుకున్నదేమిటో అర్థం అవుతుంది. ఆ నేర్చుకున్న దానిని ఆలోచించడం, ఆచరణలో పెట్టడం వంటివి సులభ సాధ్యమవుతాయి. నేను జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా, కొరియా, జపాన్‌ వంటి వారితో వ్యాపారపరంగా మాట్లాడవలసి వచ్చినపుడు వారు ఆంగ్లంలో ప్రవీణులు కారన్న విషయాన్ని గ్రహించాను. వారికి వచ్చిన ఆంగ్లమంతా కేవలం వ్యవహారికం మాత్రమే. అంటే కేవలం ఎదుటి మనిషి భావాల్ని అర్థం చేసుకొనేవరకు మాత్రమే. వారికి ఆంగ్లమే జీవితం మాత్రం కాదు.

ప్రతీ సాంకేతిక పదానికి మాతృభాషలో పదం దొరకడం సాధ్యమేనా?

    'ప్రపంచంలో అన్ని భాషలను ప్రభావితం చేసి, తన పద సంపదతో వాటిని పరిపుష్టం చేసిన భాష సంస్కృతం. సంస్కృత భాషలో ఉన్నన్ని పదాలు, వ్యుత్పత్తి అర్థంతో సహా, ప్రపంచంలో మరే భాషలోను ఉండవు. సంస్కృతం భారతీయ భాషలకు ఆత్మ వంటిది. 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్నట్లుగా మనసు పెట్టి వెతకాలే గాని, ప్రతీ ఆంగ్ల పదానికి మాతృభాషలో పదాన్ని సృష్టించవచ్చు. ఆ పదం సాధ్యమైనంత తేలికగా, పలకడానికి వీలుగా ఉండాలి. ఎప్పటికప్పుడు మిగిలిన అన్ని దేశాల్లోను జరుగుతున్న నూతన సాంకేతిక ఆవిష్కరణల్ని మాతృభాషలోకి తర్జుమా చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి. అలాగే పాఠ్య పుస్తకాల్ని తరచుగా నూతన విషయాలతో క్రోడీకరిస్తుండాలి. ఇలా చేయడం వలన విద్యార్థులకి మాతృభాషపై అవగాహన పెరుగుతుంది. శాస్త్ర విజ్ఞానం పట్ల కూడా అభిరుచి కలుగుతుంది. సరైన శిక్షణ ఇస్తే ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల కంటే ధీటుగా మాతృభాషలో చదివే విద్యార్థులు మంచి ఫలితాలను అందించగలరని నేను ప్రత్యక్షంగా ఎన్నో సార్లు రుజువు చేసాను.

ఎన్నో లాభాలు:


మాతృ భాషలో విద్యాభ్యాసం చేయడం వలన ముందుగా ప్రపంచ పటంలో నుండి ఒక భాషని అంతర్థానం కాకుండా కాపాడుకోగలం. ఆ భాషలో ఉన్న నుడికారాలు, సంస్కృతి, సాహిత్యం, ఆ భాషకే సొంతమైన సొగసు, ఇవన్నీ మించి, మాతృభాషపై మమకారం, తద్వారా దేశభక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా మేథో వలసని అరికట్టవచ్చు. అంటే ఇక్కడ విద్య నేర్చుకున్న వారందరూ సరైన సౌకర్యాలు లభించడం లేదని, అవకాశాలు లేవని విదేశాలకు వెళ్ళిపోవడాన్ని, అక్కడి వారికి బానిసత్వం చేయడాన్ని ఆపుచేయవచ్చు. తద్వారా మేథావుల సేవల్ని దేశ అభివృద్ధికి, తద్వారా సమాజ హితానికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మేధావులందరూ విదేశాలకు వెళ్ళి అక్కడ అభివృద్ధి చేస్తుంటే, ఎందుకూ పనికిరాని వారు అధికారులుగా, రాజకీయనాయకులుగా మారి, దేశ అభివృద్ధి మాట అటుంచితే, సామాన్య ప్రజల్ని దోచుకు తింటున్నారు.

    ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే, ముందుగా విద్యా వ్యవస్థని మార్చాలి. భారతీయ విలువలకి విద్యలో ప్రాధాన్యం కల్పించాలి. మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల్ని అనువాదం చేయాలి. వాటిని ఉపాధ్యాయులకు, విద్యార్థులు సంపూర్ణంగా అర్థం చేసుకునే విధంగా నిఘంటువులు, పుస్తకాలు రూపొందించాలి. దశల వారీగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్ని మూసివేయాలి. కేవలం వాడుక భాషగా మాత్రమే ఆంగ్లాన్ని ఉండనివ్వాలి. అంటే కేవలం అవసరమైన వారు మాత్రమే ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సంపూర్ణంగా మాతృభాషనే వినియోగించుకొనేలా వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ప్రతి అడ్డమైన పదానికి ఆంగ్లాన్ని శరణు వేడే దుస్థితి నుండి బయటపడాలి. అపుడే మాతృభాషలు బతికి బట్టకట్టగలుగుతాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమవుతుంది. 
 
http://saradaa.blogspot.in/

కుటుంబంలోని సభ్యులందరికీ స్వదేశీ నిష్ఠ కలిగించవలసిన బాధ్యత నేటి మహిళదే

వందనీయ ప్రమీలా తాయి మేడే
వేదికపై ప్రసంగిస్తున్న వందనీయ ప్రమీలా తాయి మేడే

రాష్ట్ర సేవికా సమితి పశ్చిమ ఆంధ్ర ప్రాంత "ప్రవేశ్ శిక్షావర్గ"   మే
నెల 5 వ తేది నుండి 20 వ తేదీ వరకు హన్మకొండలోని 'భారత విద్యా భవన్' పాఠశాలలో జరిగింది. 5 వ తేది సాయంకాలం 6 గంటలకు 'ఉద్ఘాటన' కార్యక్రమంతో ఈ శిక్షావర్గ ప్రారంభమైంది. ఈ వర్గలో ప్రాంతంలోని 54 స్థలాల నుండి వచ్చిన 125 మంది శిక్షార్ధులు శిక్షణ పొందారు. 

ఈ వర్గలో శిక్షార్దుల శారీరక, మానసిక, బౌద్ధిక వికాసానికి ప్రశిక్షణ ఇవ్వబడింది. రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ మా.మాధురీ, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారిక మా.సీతక్క, దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహిక మా.సావిత్రి శిక్షార్ధులకు వివిధ అంశాలలో మార్గదర్శనం చేశారు. మే 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హన్మకొండ నగర వీధులలో శిక్షార్దులచే ఘోష్ సహిత 'పథ సంచలన్' జరిగింది. 20 వ తేదీ సాయంత్రం సార్వజనికోత్సవంలో డా.టి.సంధ్యారాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డా.వి.సువర్ణ ఉపస్థితులైనారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక వందనీయ ప్రమీలాతాయి మేడే గారు మాట్లాడుతూ "రాజకన్య అయినా సావిత్రి తన భర్త సత్యవంతుని ప్రాణం కోసం యమధర్మరాజును ఎదిరించిన భూమి ఇది. అచేతన స్థితిలో ఉన్న సమాజాన్ని తిరిగి చైతన్యవంతం చేయగలిగిన సంకల్ప శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. ఈ ఆధునిక కాలంలో అనేక ఆకర్షణలు, వ్యామోహాలు మహిళలను తమ ధ్యేయమార్గం నుండి ప్రక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత జాగరూకత కలిగి ఉన్న మహిళలు మాత్రమే ఇటువంటి పరిస్థితులలో తమతో పాటు సమాజాన్ని కూడా సచేతనంగా ఉంచగలుగుతారు.

ధ్యేయనిష్ఠ కలిగిన భర్త కోసం అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడిన సీతాదేవిని ఆదర్శంగా తీసుకోవాలని ముంబయి హైకోర్టు ఒక విడాకుల కేసు విషయంలో ఈ మధ్య తీర్పు ఇచ్చింది. ఎందుకంటే నేడు అనేక ప్రలోభాలు మన కుటుంబ వ్యవస్థ ధృఢత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.  మనం అత్యంత జాగరూకులమై, సంఘటితమై మన వ్యక్తిగత, నైతిక, సామాజిక విలువల పట్ల నిష్ఠ కలిగి ఉంటేనే ఈ సవాళ్ళను ఎదుర్కొన గలుగుతాము. స్వదేశీ నిష్ఠ మన కుటుంబంలోని సభ్యులందరికీ కలిగించ వలసిన బాధ్యత నేటి మహిళ పైన ఉన్నది. మన జీవనకార్యమైన 'సర్వే భవంతు సుఖినః' అని ధ్యేయనిష్ఠతో మనం సాధన చేయవలసి ఉంది" అని అంటూ ప్రసంగాన్ని ముగించారు ప్రమీలా తాయి మేడే జీ. 
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_9367.html

వ్యక్తులు సంస్కారవంతులైతేనే వ్యవస్థ బాగుంటుంది


ద్వితీయవర్ష శిక్షావర్గ సమారోప్ లో శ్రీ వేణుగోపాల్ రెడ్డి

సార్వజనికోత్సవ వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ వేణుగోపాల్ రెడ్డి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గ భాగ్యనగర్, నారాయణ గూడలోని కేశవ స్మారక విద్యాలయ ప్రాంగణంలో మే 5 నుండి 26 వరకు జరిగింది. ఇందులో పశ్చిమాంధ్ర ప్రాంతం నుండి 116 మంది శిక్షార్ధులు, పూర్వాంధ్ర ప్రాంతం నుండి 42 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. వీరికి శిక్షణ ఇవ్వటానికి 20 మంది శిక్షకులు, శిబిర నిర్వహణకు 50 మంది ప్రబంధకులు కూడా పాల్గొన్నారు. 2012 మే 25 సాయంకాలం సార్వజనికోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సామాజిక కార్యకర్త డా.ఎం.అంజయ్య, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నత అధికారిగా పని చేసి రిటైరైన మనోహరరావు గారు పాల్గొన్నారు. కరీనగర్ విభాగ్ సంఘచాలక్ శ్రీ మల్లోజుల కిషన్ రావు వర్గ సర్వాధికారిగా వ్యవహరించారు. శిబిర నివేదిక తర్వాత శారీరక్, ఘోష్ ప్రదర్శనలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ పి.వేణుగోపాల రెడ్డి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు ప్రధాన వక్తగా విచ్చేసి ప్రసంగించారు. 

శ్రీ వేణుగోపాల రెడ్డి ఉపన్యాసం 

"మన దేశం అనేక రంగాలలో అనేక రకాలుగా అభివృద్ధి సాధించింది. మన శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే సుదూర లక్ష్యాలను చేధించ గలిగిన క్షిపణిని ప్రయోగించి పరీక్షించడంలో విజయులయ్యారు. ఈ క్షిపణి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారయ్యింది.

దేశం ఇన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. అయినా ప్రజలు ఆనందంగా లేరు. నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఒకవైపు దేశం ఇంతగా ప్రగతి సాధిస్తున్నా, ప్రజలలో ఆనందం ఎందుకు కొరవడింది? ప్రజలకు సుఖంగా ఉండడానికి పంచాయితీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంట్ వ్యవస్థలను ఏర్పరచుకున్నాం.  ఈ వ్యవస్థలలో పనిచేసే వారందరూ ప్రజలకు సేవ చేసేవారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే వారందరూ ప్రజలకు సేవకులు. పై వారందరి జీతాలు మనం చెల్లించే పన్నుల నుండి చెల్లించబడుతున్నాయి. సర్పంచ్ కాని, ఎం.ఎల్.ఏ. కాని, ఎం.పి. కాని వీరందరూ ప్రజలకు సేవకులే. అలాగే మంత్రులు కూడా ప్రజలకు సేవకులే.. కాని మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

ప్రభుత్వ కార్యాలయానికి వెళితే ఆ ఉద్యోగి మనను ఖాతరు చేయడు, సరిగా సమాధానం ఇవ్వడు. ఆ ఉద్యోగికి జీతమందేది మనలాంటి పౌరులు కట్టే పన్నుల నుండే అయినా వాడి ప్రవర్తనకు పౌరులే అణగి మణగి ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు సేవకులుగా ఉండవలసిన వారు యజమానులుగా మసలుకుంటున్నారు. ఈ విచిత్రమైన స్థితి మన దేశంలో నెలకొని ఉంది. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రజలు కులాల వారిగా విడిపోతున్నారు. చట్టాలు చాలా ఉన్నాయి. కాని అవి పాటించే నిబద్ధత ఏది? చట్టం నుండి ఎలా తప్పించుకోవచ్చో అధికారులే బోధిస్తుంటే.. నైతిక విలువలు ఎలా రక్షింప బడతాయి? లోపం వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తిని సంస్కరించాలి. బాగుచేయాలి. ఈ దేశంలో నివసించే మేమందరం ఈ భారతమాత సంతానం, మేమందరం ఒకే కుటుంబం - ఈ భావన నిర్మాణం కావాలి.
శారీరిక ప్రదర్శన నిర్వహిస్తున్న స్వయంసేవకులు

ఈ భావన నిర్మాణం చేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కృషి చేస్తున్నది. నిత్య శాఖా కార్యక్రమాల ద్వారా అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఆటపాటల ద్వారా మనమంతా ఒకటే అనే భావన, ఆటల ద్వారా విజిగీషు ప్రవృత్తి... ఇలా ఒకటేమిటి ? రకరకాల శారీరిక, మానసిక కార్యక్రమాల ద్వారా ఆ వ్యక్తిలో సంస్కారాలను నింపే ప్రయత్నాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ శిక్షావర్గలు. ఈ ఇరవై రోజుల శిక్షావర్గలో స్వయంసేవకులు అన్ని ఖర్చులు తామే భరించి పాల్గొంటారు. శిక్షావర్గ సవ్యంగా జరగడానికి శిక్షకులు, ప్రబంధకులు వర్గలో పాల్గొంటారు. ప్రబంధకులుగా వచ్చిన వారు తమకు ఏ విభాగం పని అప్పజెప్పితే ఆ విభాగం పని చూసుకుంటారు. అంతే తప్ప నేను ఈ పనే చేస్తాను, ఆ పని చేయను, అని అనరు. ఈ మనస్తత్వం సంఘ శిక్షావర్గ ద్వారానే లభిస్తుంది. నిత్య శాఖ, శిక్షావర్గల ద్వారా బాధ్యతాయుతమైన వ్యక్తులు తయారు చేయబడతారు. ప్రతి క్రియాశీలమైన వ్యక్తి సమాజంపై ప్రభావం చూపాలి. అతడు ఎక్కడ పనిచేసినా అతని ప్రభావం ఆ చుట్టుప్రక్కల ప్రసరించాలి. మన లక్ష్యమైన ఈ దేశ పరమ వైభవ స్థితిని సాధించ గలుగుతాము. నిత్య శాఖ, శిక్షావర్గలో నిర్మాణమైన క్రియాశీలమైన కార్యకర్తల ద్వారానే ఇది సాధ్యమౌతుంది" అని చెపుతూ శ్రీ వేణుగోపాల రెడ్డి తమ ప్రసంగాన్ని ముగించారు.


 http://www.lokahitham.net/2012/01/blog-post_722.html

గంగమ్మ తల్లిని రక్షిస్తారట



మన గంగానది పావనగంగ. అన్ని పాపాలనూ కడిగి వేయగల నదీమతల్లి. భూ ప్రపంచంలోని అన్ని నదులలోనూ అతి పవిత్రం, హిందువులకు ప్రాణసమానం. అటువంటి గంగను కూడా అపవిత్రం చేస్తున్నారు మన సెక్యులర్ పాలకులు. ఇది ఇలా ఉండగా మొన్ననే ఒక వార్త వచ్చింది. యు.పి.ఏ. ప్రభుత్వం గంగానదిని శుద్ధీకరించడానికి ఒక బృహత్ పథకం చేపట్ట బోతున్నదట. పరిసర వాతావరణం అరణ్య శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి జయంతి తన మంత్రిత్వ శాఖ అధికారులకు "గంగా నది శుద్ధీకరణ" ప్రణాళిక రచించమని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆమె క్రొత్త ధిల్లీలో ఒక ప్రకటన చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! 

ఐతే ఈ చర్యకు వెనుక ఉన్న కారణం వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. గంగానది పవిత్రీకరణ కోసం కొందరు హిందూ సాధువులు చేస్తున్న ఆందోళన శృతి మించుతున్నదట, వచ్చే జనవరి (2013) లో ప్రయాగలో కుంభమేళా ఉన్న కారణంగా హిందూ ఆందోళన యు.పి.ఏ.కి ఒక తలనొప్పిగా తయారైందని అభిజ్నవర్గాల  సమాచారం. అందుకోసమే ఈ కంటి తుడుపు చర్య.
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_4339.html

మైనారిటీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు

మైనారిటీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయం. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి రంగాలలో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీసీలకు నిర్ధారించిన 27 శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 4.5 శాతం ఉప కోటా కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. 

భారత రాజ్యాంగం మతపరమైన, భాషా పరమైన మైనారిటీలకు కొన్ని రంగాలలో ప్రత్యేక రక్షణ కల్పించింది. విద్యా సంస్థల ఏర్పాటుకు మైనారిటీలకు ప్రత్యేక రక్షణ ఉంది. మన రాష్ట్రంలో కూడా మతపరమైన, భాషా పరమైన మైనారిటీ సంస్థలు అనేక ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కళాశాలలను ఏర్పాటు చేశాయి. ఈ విద్యా సంస్థలలో ఆయా మైనారిటీ వర్గాలకు 50 శాతం సీట్లు, ఇతరులకు 50 శాతం సీట్లు కేటాయించాలి. మన రాష్ట్రంలో మెజారిటీ వర్గానికి చెందిన అనేకమంది మైనారిటీ కోటాలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు పొంది వాటిని నిర్వహిస్తున్నారు. 

అయితే సాధారణ విద్యా సంస్థలలో మతపరమైన రిజర్వేషన్లకు ఆస్కారం లేదు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడా కారులు.. ఇలా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే విద్య, ఉపాధి రంగాలలో మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించలేదు. ముస్లింలు, క్రిస్తియన్లను ఓట్ బాంకులుగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా వారిని ఆకర్షించడానికి, మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

గత జనవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా ఇదే జరిగింది. ముస్లింలకు ఏకంగా 9 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. తన భార్య పోటీ చేస్తున్న నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఖుర్షీద్ చేసిన ప్రసంగాన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ కేంద్ర మంత్రిని అభిశంసించింది. ఎన్ని హామీలు ఇచ్చినా యూపీలో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే లభించాయి. స్వయంగా ఖుర్షీద్ భార్య ఓటమి పాలయ్యారు. అంటే యూపీ ప్రజలు ముస్లింల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్ని తిరస్కరించారన్న మాట. 

రాజ్యాంగ నిర్మాతలు దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించారు. అయితే అనేక శాతాభ్దాలుగా సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రం కొద్ది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.  
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_5468.html

కావ్యం, కథ, తత్త్వం అన్ని కలగలిసి పోయిన రూపం హిందుత్వం



 
బంకించంద్రుడు మహా కవి. భగవద్గీతపై, హిందుత్వంపై ఎన్నో వ్యాఖ్యానాలు వ్రాశారు. హిందుత్వం గురించి బంకిం చంద్ర ఇలా అన్నారు.

"మతం అనేది లౌకికంగాను, ధార్మికంగాను ఉండి సంపూర్ణ జీవనానికి అన్వయింప బడి ఉండాలి. వేర్వేరు సంస్కృతులతో, ప్రాంతీయాచారాలతో చిక్కుముడి లాగ తయారయిన "హిందుత్వం" ను జాగ్రత్తగా ముడులు విప్పి చూసుకొంటే తప్ప అసలు మూల సిద్ధాంతాలు బయటపడవు. తాంత్రిక ప్రభావం హిందుత్వంపై ఉన్నా అదే హిందూ మతం కాదు. హిందూ మత సారం కాబోదు. హిందుత్వం - తంత్రం రెండూ వెలుగు చీకట్ల లాగ భిన్నమైనవి. అద్వైత, ద్వైత, బహు దైవత్వ, ప్రకృతి దైవత్వ, నాస్తిక, యాజ్ఞిక, అయాజ్ఞిక, శైవ, వైష్ణవ, శాక్తేయ, కబీర, చైతన్యాది వైవిధ్య భరితమైన సంప్రదాయాలు ఉన్నాయి. సాలగ్రామాలను, లింగాలను, తులసిని పంచ భూతాలను ఇంకా ఎన్నిటికో పూజలు చేస్తాము. ఆంజనేయుడిని వాయుపుత్రుడనీ, దేవుడనే పూజిస్తాం. కాని, కోతి అని అనుకోం. బహు దేవతారాధానం ఒక్క హిందువులకే లేదు, గ్రీకులకు కూడా ఉండేది. మనదే తప్పని ఎలా అంటారు? క్రైస్తవులు తప్పన్నంత మాత్రాన మనం కూడా తప్పనుకోవాలా? కించపడాలా?

హిందూమతం క్రైస్తవ, ఇస్లాంల వలె ఏకవ్యక్తి స్థాపితం కాదు. భిన్న భిన్న కాలాల్లో ప్రవేశించిన భిన్న భిన్న తాత్విక సిద్ధాంతాల సమాహారం. కావ్యం, కథ, తత్త్వం అన్ని కలగలిసిపోయిన రూపం".

 http://www.lokahitham.net/2012/01/blog-post_8243.html

"ఆకాష్" క్షిపణి విజయవంతం



 
మొన్న మొన్ననే మనం అగ్ని-6 సుదూర లక్ష్యాన్ని చేదించే క్షిపణి విజయవంతంగా ప్రయోగించాం. ఏ క్షిపణిని చూసి చైనా కూడా ఝడుసుకున్నది. ఇది ఇలా ఉండగా భూమిమీద నుండి ప్రయోగించి ఆకాశంలో ఉండే లక్ష్యాలను చేదించే "ఆకాష్" క్షిపణిని ఒడిషాలోని  చాందిపురం ప్రయోగ క్షేత్రం నుండి మన శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. అంతకు రెండు రోజుల ముందు కూడా ఇటువంటి ప్రయోగమే విజయవంతంగా జరిగింది. 'రక్షణ పరిశోధన సంస్థ' (డి.ఆర్.డి.ఓ.) వారు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ క్షిపణి మన వైమానిక దళం అమ్ముల పొదిలో క్రొత్త ఆయుధంగా చేరింది. దేశాన్నేలే వారు దోపిడీలు చేస్తున్నా కనీసం శాస్త్రవేత్తలు దేశ హితం కోసం శ్రమించడం ముదావహం. వారందరికీ లోకహితం జేజేలు పలుకుతున్నది.


 
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_7020.html

పాక్ లో హిందూ ఆలయాలపై దాడి


పాకిస్తాన్ పెషావర్ లోని గోరఖ్ నాథ్ దేవాలయం

పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువయ్యాయి. భారత్ లో మైనారిటీ వర్గాలకు అన్ని రకాల మతస్వేచ్ఛ  ఉండగా, పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కొరవడింది. పాకిస్తాన్ లోని వాయువ్య ప్రాంతంలో గల పెషావర్ లోని గోరఖ్ నాథ్ దేవాలయంపై ఇటీవల దాడి జరిగింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోరఖ్ నాథ్ దేవాలయాన్ని అధికారులు మూసివేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు 2011 లో ఆ దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తిరిగి తెరిచారు. అప్పటినుంచి హిందువులు గోరఖ్ నాధుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. 

కాగా, ఇటీవల కొందరు దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న చిత్ర పటాలను చించివేసి, ఆలయ గర్భ గుడిలోని శివ లింగాన్ని ధ్వంసం చేశారు. గత రెండు నెలల్లో దుండగులు వరుసగా మూడోసారి ఈ గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి చేశారు. సాహిత్యాన్ని ధ్వంసం చేశారు. 

ఈ గోరఖ్ నాథ్ ఆలయానికి 160 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం పంజాబ్, రాజస్తాన్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు ఈ ఆలయాన్ని సందర్శించి పునీతులయ్యేవారు. దేశ విభజన అనంతరం ఈ ఆలయాన్ని మూసివేశారు. అయితే హిందువుల నిరంతర పోరాటం ఫలితంగా గత ఏడాది పెషావర్ హైకోర్టు ఈ ఆలయాన్ని తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. 

భారత్ లో మత ప్రజాస్వామ్యం లేదంటూ ఇటీవల కొందరు నాస్తికులు, భౌతిక వాదులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను మాత్రం వారు ఖండించలేక పోతున్నారు. హిందుత్వం మతతత్వం అని, ఇతర మతాలలో చాలా విశాల భావాలున్నాయని వాదిస్తున్న ఇటువంటి వారికి పాకిస్తాన్ లోని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు కనువిప్పి కావాలి. 
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_3107.html