25, జూన్ 2012, సోమవారం

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: మూడవ భాగం


మరొక్కసారి వేదాలను సరిచూసుకుని మనం కాలంలో కాస్త ముందుకు జరుగుదాము. వైదికకాలంలో ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యుడు మొదలగు దేవతలను పూజించేవారు. వేదకాలం నుంచి ఇప్పటివరకు పూజలందుకుంటున్న దేవుడు ఒక్క సూర్యుడు మాత్రమే. ఒక్కసారి అప్పటిదేవతలు వర్ణ వ్యవస్థలో ఎలాంటి పాత్రలు వేసారో. అశ్వినీ దేవతలు బ్రాహ్మణులయినా వారు Yagnaలలో పాల్గొనలేరు. విశ్వామిత్ర మహర్షి పుట్టుకతో క్షత్రియుడు, కానీ తపస్సు చేసి బ్రాహ్మణుడిగా మారాడు. పరశురాముడు రథాలను తయారుచేసే సూద్రుడు, గొడ్డలి పట్టినప్పుడు క్షత్రియుడు, తపస్సు చేసినప్పుడు బ్రాహ్మణుడు అయ్యాడు. దీనిని బట్టి మనకు అర్థం కావడంలేదా వర్ణ వ్యవస్థ ఒకప్పుడు ఎలా ఉండేదో.

ఇప్పుడు నేను హిందూ మతాన్ని స్వంత ఇంటిలోనే చావుదెబ్బ కొట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతాను. అతను హింసతో హిందూమతాన్ని భయపెట్టలేదు, అహింసతో మార్పు కావాలన్నాడు. అతనే బుద్దుడు. ఒక్కసారి మనం చరిత్రను చూస్తే ద్వారక మునిగిపోయిన తరువాత భారతదేశానికి పెద్దగా బయటినుంచి గానీ అంతర్గతంగాగానీ సవాళ్ళు ఎదురుకాలేదు. అందువల్ల హిందూమతంలో మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. ప్రజలు వేదాలను అనుసరిస్తున్నారు కానీ అందులో చెప్పిన పద్దతులు ఎందుకు పాటించాలో మరిచిపోయారు. ఇలా హిందూ సమాజం అంతర్గతంగా కుళ్ళిపోయి అంతర్గతంగా యుద్దాలు ఎక్కువ జరుగుతున్న సమయంలో బుద్దుడు ఆవిర్భవించాడు. బుద్దుడు వేదాల అధికారాన్ని, వర్ణవ్యవస్థను తిరస్కరించాడు. అహింసను, కర్మ సిద్దాంతాన్ని (ఇది అప్పటికే హిందూ మతంలో ఉన్నది) ప్రబోధించాడు. ప్రజలందరూ బుద్దుడిని, బుద్దమార్గాన్ని అనుసరించారు. బౌద్దమతం మధ్యఆసియా నుంచి జపాను వరకు విస్తరించింది. అంతమందికి దారిచూపిన దమ్మపాదంలో ఒక్కసారి ఏమి చెప్పారో కొంచెం చూద్దాం.

దమ్మపాదంలో బ్రాహ్మణుల గురించి, వారు పాటించాల్సిన పద్దతులగురించి చెప్పారు, కానీ వారు చేయకూడని పనుల (అంటే ఇతరులను తక్కువగా చూడడం, అంటరానితనాన్ని ప్రోత్సహించడం వంటివి) గురించి చెప్పలేదు. బ్రాహ్మణులు ఎలా జీవించాలి, ఎంత పొదుపుగా జీవించాలి అన్నదానిని దమ్మపాదంలో మనం గమనించవచ్చు. బ్రాహ్మణులు బాగా ధనం మరియు అహంతో విర్రవీగుతున్నారు కాబట్టి వాటిని ఎక్కువగా విడవాలని బుద్దభగవానుడు మనకు చెప్పాడు. కులవ్యవస్థ గురించి ఒక్కమాట కూడా చెప్పని బుద్దుడు, మరియు బౌద్దమతాన్ని కులవ్యవస్థకు వ్యతిరేఖ ప్రచారానికి వాడుకోవడం చాలా దారుణం. మనలో ఎంతమంది దమ్మపాదం చదివినవాళ్ళు ఉన్నారు? మీరందరూ ఒక్కసారి చదివి, అప్పుడు ఆ కాలంలో కులవ్యవస్థ ఉందని చెప్పండి చూద్దాం. దమ్మపాదంలో బ్రాహ్మణుడు ఎలా ఉండాలో తెలిపారు. మనం గమనిస్తే బ్రాహ్మణుడు అనే పదాన్ని ఇప్పటి సన్యాసి అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడినట్లు ఉందే కాని బ్రాహ్మణుడు అనే పదం ఒక ప్రత్యేకమయిన కులానికి గుర్తుగా లేదని మనం గమనించవచ్చు. ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనలో ఎవరైనా సినిమాలలో చిన్నపిల్లలను అతిగా హింసిస్తున్నారని, సినిమాలలో చిన్నపిల్లలను చూపడం నేరమని దాని గురించి మన బ్లాగులోకంలో ఎవరైనా ఒక ఇరవై టపాలు రాస్తే మనం ఎమని అనుకుంటాం? ఇతనికి పిచ్చి కానీ లేదుకదా అనుకుంటాం. This doesn’t make any sense. ఎందుకంటే ప్రస్తుతసినిమాలలో చిన్నపిల్లలను పెద్దగా చూపించడం లేదు కాబట్టి, మరియు అలా గోలచేస్తే అది జరగని హింసకు చేస్తున్న గోల. అందుకే మనం అలాంటివాటిని పెద్దగా పట్టించుకోము. అదే సినిమాలలో స్త్రీలను చాలా చవకబారుగా చూపిస్తున్నారని ఎవరైనా రాస్తే మనం ఆలోచిస్తాం, ఎందుకంటే అందులో పూర్తిగా నిజం ఉన్నది కాబట్టి. అదే విధంగా మనం బౌద్దమతం ఏ దురాచారాలకు వ్యతిరేఖంగా పోరాడిందో అవి అప్పటి సమాజంలో బాగా పాతుకుపోయినట్లు లెక్క. బౌద్దమతం హింసను విడనాడమని, బ్రాహ్మణులు సర్వం త్యజించి జీవించాలనీ, కర్మసిద్దాంతాన్నీ ప్రబోధించింది. దీనిని బట్టి అప్పటి సమాజంలో ఎలాంటి దురాచారాలు ఉన్నాయో మీరు గమనించగలరు. బౌద్దమతం తరువాత భారతదేశ పరిస్థితులను స్పష్టంగా వ్రాసిన మరో పుస్తకాన్ని మనం ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు నేను మనమందరం నమ్మదగ్గ వ్యక్తి రాసిన పుస్తకంలో నుంచి చెబుతాను. కనీసం అప్పుడు కొందరయినా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. అది అప్పుడే అలెగ్జాండరు తన దండయాత్ర ముగించి వెళ్ళిన రోజులు. గ్రీకులు అప్పుడు భారతదేశం గురించి, ఇక్కడ బంగారాన్ని తవ్వే చీమలగురించి అధ్యయనం చేయడానికి ఒక వ్యక్తిని భారతదేశం పంపారు. అతని పేరు మెగస్తనీస్. అవును, ఇప్పుడు మనం మెగస్తనీస వ్రాసిన “ఇండికా” (1) అనే పుస్తకంలో నుంచి చూద్దాం భారతదేశంలో ఉన్న కులాలగురించి ఏమి రాసాడో. మెగస్తనీస్ ప్రకారం భారతదేశంలో ఏడు రకాల కులాల వాళ్ళు ఉన్నారు. Philosophers (which formed small part), Husbandmen who are majority of population and have to cultivate their land, Herdsmen and Hunters who are allowed to keep cattle and hunt animals, labor people who are hired by the king to vend wares, build ships and amours. The fifth being fighting class whose job is only to fight and nothing else. The sixth class are overseers to whom is assigned the duty of watching all that is going on. The seventh class consists of counselors and assessors of king. Philosophers అంటే బ్రాహ్మణులని మనం అర్థం చేసుకోవచ్చు. గృహస్థులు (Husbandsmen) అంటే సూద్రులు మరియు వైశ్యులు. వీరు జనాభాలో అధికశాతం వారని ప్రత్యేకంగా చెప్పాడు. Herdsmen, Hunters, Labor people లను రాజు అవసరం ఉన్నాప్పుడు ప్రత్యేకంగా నియమిస్తాడని చెప్పాడు. విదేశీ వ్యవహారాలు చూసేవారు, గూఢచారులు, సైనికులు, సలహాదారులు, మంత్రిలు మరియు రాజుకు దర్బారులో సహాయం చేసే ఇతరులందరినీ మనం క్షత్రియులుగా భావించవచ్చు. ఇవి కాకుండా కులాలమార్పు గురించి మరో మాట కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ఒక కులం నుంచి ఇతర ఏ కులానికి మారడానికి వీలులేదు ఒక్క బ్రాహ్మణుడిగా తప్ప ఎందుకంటే అదే చాలా కష్టమయిన కులం కాబట్టి. ఏ కులం వ్యక్తి అయినా బ్రాహ్మణుడిగా మాత్రమే మారవచ్చు, ఇతర కులాలలోకి మారడం నిషిద్ధం. బ్రాహ్మణుడు అయిన వ్యక్తి ఏదైనా ఒక గొప్ప ఆవిష్కరణ చేస్తే అతను జీవితాంతాం పన్ను కట్టనవసరం లేదు, అదే విధంగా ఏవరైనా చెప్పినది తప్పు అని నిరూపితమయితే అతనినితో జీవితాంతాం ఎవరూ మాట్లాడకూడదని నిషేధం విధించేవారు. రాజు అలా చేయకపోయినా, ఆ వ్యక్తి జీవితంలో ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎందుకంటే అప్పటి ప్రజలు నీతి నిజాయితీలకు ప్రాణాలు ఇచ్చేవారు కాబట్టి. వీరందరిలో ఎవరు అగ్రకులస్థులు, ఎవరు తక్కువ కులస్థులు? ఎవరు ఎవరిని హింసిస్తున్నారని మనం అనుకోవాలి?

ఇప్పుడు ఆ కాలంలో ఏనుగులను ఎలా పట్టేవారో వివరిస్తాను. కులవ్యవస్థకు దీనికి సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపడకండి. కాస్త చదవండి మీకే అర్థమవుతుంది. ఏనుగులను పట్టడం కాస్త వింతగానూ కాస్త ఆశ్చర్యం కలిగించేదిగానూ ఉంటుంది. ఏనుగులను సంవత్సరం మొత్తం కాకుండా కేవలం ఏనుగులు శృంగారం నెరిపే కాలంలో మాత్రమే ఏనుగులను పట్టేవారు. ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో ఆడఏనుగును ఉంచేవారు. ఆడఏనుగును గమనించి ఆ దరిదాపులకు వచ్చే ఏనుగులు ఆ గొయ్యిలో పడిపోయేవి. వాటిని ఇతర ఏనుగుల ద్వారా పైకిలాగేవారు. కానీ స్వతంత్రాన్ని కోల్పోయిన ఏనుగులు చాలా దిగాలుగా ఉండేవి. వాటికి మంచి ఆహారాన్ని అందించేవారు. కొన్ని ఏనుగులు ఆహారానికి అలవాటుపడి పని చేసేవి, కానీ కొన్ని ఏనుగులు మాత్రం స్వేఛ్ఛను కోల్పోయిన కారణంగా దిగాలుగానే ఉండేవి. అలాంటి ఏనుగులకు సంగీతాన్ని వినిపించేవారు. అప్పుడు ఆ ఏనుగులు కూడా పనిచేసేవి. ఏనుగులను పట్టడానికి మన పూర్వీకులు వాడే సాధనాలు ఏమిటంటే శృంగారం, ఆహారం, సంగీతం. జంతువులను కూడా ఇంత ప్రేమగా చూసుకోగలిగిన మన పూర్వీకులు సాటి మనుషులను కులం పేరు మీద దారుణంగా ఎందుకు, ఎలా హింసిస్తారు?

కౌటిల్యుడు బ్రాహ్మణుడు, చంద్రగుప్తుడు క్షత్రియుడు (కత్తి పట్టుకున్నాడు కాబట్టి అలా అంటున్నాను). కౌటిల్యుడి తెలివితేటల వల్లనే చంద్రగుప్తుడు మౌర్యవంశాన్ని స్థాపించగలిగాడు. అలాంటి కౌటిల్యుడు తాను ఎందుకు సింహాసనాన్ని అధిరోహించలేదు? ఎందుకంటే తాను బాగా సలహాలు ఇవ్వగలడు, మరియు చంద్రగుప్తుడు బాగా యుద్దం చేయగలడు కాబట్టి. అది నిజమైన వర్ణ వ్యవస్థ అర్థం.

ఇంకా భారతదేశంలో అనాది నుంచీ కులవ్యవస్థ ఉందని నమ్మేవాళ్ళు నా ఈ అయిదు ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం.

1. కులవ్యవస్థకు వ్యతిరేఖంగా ఎవ్వరూ ఎందుకు పోరాడలేదు పూర్వకాలంలో (before 5th centuary AD)? పోనీ అగ్రకులస్థులు అందుకు అంగీకరించలేదనీ ఒకవేళ అలాంటివి జరిగినా వాటిని తొక్కేసారని మీ సమాధానం అయితే కాస్త ఈ చిన్ని ఉదాహరణలు గమనించండి. చరకసంహితలో చరకుడు సమాజంలో ఎన్నో అపోహలున్నాయనీ ప్రజలకు నాణ్యమయిన వైద్యం అందడానికి ముందు ఈ అపోహలన్నీ తొలగిపోవాలని చెప్పాడు. సమాజానికి వ్యతిరేఖంగా చరకుడు వ్రాసినదానిని మనం ఇంతవరకు చూడగలుగుతున్నాం, కానీ సామాజిక విషయాలలో ఇలా ఎందుకు వ్రాసిన గ్రంథాలలో మనం చూడలేకపోతున్నాం? వాత్సాయనుడి కామసూత్రలో మనం ఇలాంటిదే మరో సంఘటనను గమనించవచ్చు. వాత్సాయనుడి కాలాన్ని నిర్ధారించేటప్పుడు శాతకర్ణి శాతవాహనుడు తన భార్య అయిన మలయావతిని రతీసమయంలో కర్టారీ అనే వస్తువుతో కొట్టాడనీ అది కాస్త ఎక్కువై ఆమే చనిపోయిందనీ దానిని బట్టి వాత్సాయనుడి కాలాన్ని మనం అంచనా వేయగలిగాము. కామసూత్రలో శృంగారంలో అప్పట్లో ఉన్న ఇలాంటి అపోహలు తొలగిపోవాలని వాత్సాయనుడు నొక్కి చెప్పాడు. కులవ్యవస్థ గురించి మనకు అలాంటి రాతలు ఎందుకు కనబడవు? మన కలగూరగంప బ్లాగరు గారు చరిత్రలో జరిగిన ఒక చిన్న సంఘటనను వెలుగులోకి తీసుకురాగలిగారు. అది రాచవేమారెడ్డి హత్య వలన రెడ్డిరాజుల శకం అంతమైనది అనే విషయాన్ని. ఆ రాజు గారు ప్రజలమీద అధిక పన్నులు వేసి హింసిస్తున్నాడని ప్రజలే తిరగబడి చంపారని తాడేపల్లి సుభ్రహ్మణ్యం గారు “తొంగి చూసే చరిత్ర”లో చెప్పారు. అలా ప్రజలు తమకు అన్యాయం జరిగిందని అనుకున్నప్పుడు తిరగబడ్డారు కదా మరి అలాంటి సంఘటనలు చరిత్రలో మనకు కులవ్యవస్థకు వ్యతిరేఖంగా జరిగినట్లు ఎందుకు కనబడడం లేదు?

2. హిందూమతం నిజంగా అంత నికృష్టమైనదే అయితే ఇంతకాలం ఎలా నిలబడగలిగింది? మామూలు సమయాలలో బతకగలగడం గొప్ప కాదు, కానీ అంతర్గతంగా, బాహ్యంగా ఎన్నో ఆటుపోట్లను సమర్థంగా ఎలా ఎదుర్కోగలిగింది? బౌద్దం, జైనం, చార్వకం (ఈ మతం ఎప్పుడో అంతరించింది. ఈ మతం గురించి మనకు తెలిసిన వివరాలన్నీ పురాతన జైన గ్రంథాలలో మాత్రమే దొరికాయి. అప్పటి జైనఋషులకు చార్వకులకు మధ్య జరిగిన వాదాలను జైనులు గ్రంథస్తం చేసారు. అలా గ్రంథాలలో మాత్రమే చార్వకుల సంగతి మనకు తెలిసింది). అంతర్గతంగానూ క్రైస్తవం, ఇస్లాము బాహ్యంగానూ దాడులు చేసాయి, కానీ హిందూ మతం ఇంకా నిలబడగలిగింది ఎలా? ఇస్లాము మరియు క్రైస్తవం ఒకదాని తరువాత ఒకటి దాడి చేసాయి, అది కూడా ఆ మతాలు ఉఛ్ఛస్థితిలో ఉన్నప్పుడు. ఆ రెండు మతాలవారు కలిసి గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలారు కానీ ప్రజలను హిందూమతానికి వ్యతిరేఖంగా మార్చలేకపోయారు ఎందుకు? ఆ మతాలవారు శాంతి కాముకులని, ఇక్కడివారిపై వారు మతాన్ని రుద్దలేదని చెప్పకండి. జిజియా పన్ను గురించి రాయవలసిన అవసరం లేదనుకుంటాను. ఆ మతాలు ఆక్రమించిన మిగతా దేశాల పరిస్థితి, మరియు ఈ దేశం పరిస్థితి చూడండి. మిగతా దేశాలన్నీ కేవలం యాభై సంవత్సరాలలో క్రైస్తవానికి మారిపోయారు. కానీ భారతదేశంలో మాత్రం పరిస్థితి వారికి అనుకూలంగా లేదు. ఇది వారి పరాజయం అనుకోవాలో లేక హిందూ మతం విజయం అనుకోవాలో నేను పాఠకుడి నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఏది అనుకున్నా పరవాలేదు కానీ అది వారి దయవలన అని మాత్రం అనుకోకండి. పరీక్షలో నెగ్గితే ఎవరైనా గొప్ప వ్యక్తి అవుతాడు, అలాంటిది హిందూమతం అగ్ని పరీక్షలను వేలసంవత్సరాలనుంచి ఎదుర్కుని నిలబడగలిగింది. అధిక శాతం జనాభాను హింసించగలిగే ఏ మతం కూడా ఇంత కాలం నిలబడలేదని మనకు చరిత్ర చెబుతున్న సత్యం.

3. బానిసవ్యవస్థ మనకు సత్యహరిశ్చంద్రుడి కాలంలో తప్ప భారతీయ చరిత్రలోకానీ జీవనవిధానంలో కానీ ఎక్కడా కనబడదు (ముస్లిము దండయాత్రలవల్ల మళ్ళీ బానిస వ్యవస్థ మొదలయ్యింది). మహాభారతంలో కూడా మనకు బానిసవ్యవస్థ కనబడదు. మెగస్తనీసు కూడా బానిసవ్యవస్థ భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడి ప్రజలు అధికసంఖ్యలో పిల్లలను కనేవారని తన పుస్తకంలో చెప్పాడు. బానిసవ్యవస్థను మిగతా దేశాలు నిలబడడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే నిర్మూలించిన భారత సంప్రదాయం సాటి భారతీయులను బానిసలకు సరిజోడు అనదగ్గ అంటరానివారిగా ఎందుకు చూస్తుంది?

4. ప్రకృతి శక్తులనే (ఇంద్రుడు, వాయువు, అగ్ని, వరుణుడు, భూమి, సూర్యుడు, అష్టదిక్పాలకు etc.) కాక మానవునికంటే అల్పప్రాణులలో (పాములు, ఆవు, కుక్క, ఎద్దు etc.) కూడా దైవాన్ని చూడగలిగిన హిందూ మతం సాటి మానవులను జంతువుల కంటే నీచంగా చూస్తుందా?

5. పందొమ్మిదవ శతాబ్దపు చివరి వరకూ భారతదేశం ప్రపంచంలోనే ధనిక దేశం. ఒక దేశంలో అధికశాతమ్ జనాభా హింసను అనుభవిస్తుండగా, ఆ దేశం ధనిక దేశంగా ఎలా ఛలామణీ అవ్వగలదు? రష్యా (మాజీ USSR) లో ఎప్పుడైతే అధికశాతం ప్రజలు తిండికి, నీటికి కూడా ఇబ్బంది పడ్డారో, ఆ దేశం ముక్కలయింది. ఒక్కసారి అగ్రరాజ్యం అన్న హోదా నుంచి మామూలు దేశం అన్న హోదాకు పడిపోయింది. అలాంటిది భారతదేశం అన్ని శతాబ్దాలపాటు (శత్రువులైన ముస్లిముల చేతిలో ఆరువందలకు పైగా సంవత్సరాలు ఉన్నప్పటికీ) ఎలా ధనిక దేశంగా ఉండగలిగింది?
ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

Sources
1. Ancient India as described by Megasthenes and Arrian, by J. W. McCrindle


 http://vaidikadharmam.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి