25, జూన్ 2012, సోమవారం

భారతదేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా?

భారత రాజ్యాంగంలో మన దేశం సెక్యూలరిస్టు అని ఉంటుంది. సెక్యూలరిస్టు అంటే అర్థం ఏమిటి? సెక్యూలరిస్టు అంటే ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడడం మరియు ఏ ఒక్క మతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మన దేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.


మనం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలించి నిజంగా భారతదేశంలో సెక్యూలరిజం ఉన్నదో లేదో తేల్చుకుందాం. మొదట ఈ మధ్య మంగుళూరులో జరిగిన ఘటన. ఇది పబ్బు సంస్కృతికి వ్యతిరేఖంగా శ్రీరామ సేనవారు చేసిన ఘనకార్యం. ఈ సంఘటన తరువాత అన్ని పత్రికలు బిజేపీని, RSSను వాటి పద్దతులను విమర్శించాయి. దీని గురించి తరువాత వివరిస్తాను. ఇది జరిగిన కొన్ని రోజులకే బహిరంగంగా ముద్దు పెట్టుకుంటున్నందుకు ఒక జంటపై పోలీసులు కేసు నమోదు చేసారు. అది బహిరంగంగా జరిగినందువల్ల అసభ్యంగా భావించి కేసు పెట్టారు. నిజంగా ముద్దు పెట్టుకోవడం అసభ్యమా? అది పశ్చిమదేశాలలో కాదే? మరి మన దేశంలో మాత్రం ఎందుకు అసభ్యమైంది? ఎందుకంటే అది మన సంప్రదాయం కాదు కాబట్టి మరియు అలాంటి శృంగార కార్యాలు కేవలం ఇంటిలో జరిగితేనే బాగుంటాయి కాబట్టి. అది చూసిన జడ్జిగారు వారిద్దరూ వివాహితులైన జంట కారణంగా ఆ కేసును కొట్టివేసారు. ఇక్కడ పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? అది ప్రజలకు ఇబ్బందికరమైనది కాబట్టి. ఇలా ఒక జంట ముద్దులు పెట్టుకున్నందువల్ల మరికొన్ని జంటలు కూడా ఆ బాటలోనే పయనిస్తారు. ఇప్పుడు వీరిరువురికీ వివాహం జరిగింది. రేపు వివాహం జరగనివారు అదే పని చేస్తే? అప్పుడు ఆ జడ్జిగారు ఏమని తీర్పు ఇస్తారు? మన సంప్రదాయం ప్రకారం శృంగారకర్యాలు కాస్త నాలుగు గోడల మధ్య జరిగితే అందం చందం. సరే వివాహితులు కాబట్టి ఏ పనైనా బహిరంగంగా చేయవచ్చా? ఇప్పుడు ముద్దులతో మొదలయ్యింది, రేపు మిగిలిన శృంగార కార్యాలు అ తరువాత కాలకృత్యాలు, ఇక ఇవేగా మిగిలినది. ఇప్పుడు ముద్దులు వివాహితులు పెట్టుకున్నారు, రేపు అవివాహితులు పెట్టుకుంటారు. వారిపై కేసులు నమోదు చేయలేరు పోలీసులు. రేపు మరోసారి ఇలా ముద్దులు బహిరంగంగా పెట్టుకుంటున్న జంటను చూచి పోలీసులు వారు వివాహితులు అని వదిలేస్తారు. ఎందుకంటే ముద్దు పెట్టుకుంటున్న వారందరినీ ఆపి మీకు వివాహం అయ్యిందా అని పోలీసులు వారిని అడిగి, ఓహో అయ్యిందా సరే మీరు కానివ్వండి అని అనాలేమో. అలా అలా అందరూ మొదలుపెడతారు. ఇలాంటి చిన్న చిన్న తీర్పులే సమాజానికి ఎంతో హానికరం. ఒక గౌరవప్రదమైన జడ్జిగారు ఇవ్వవలసిన తీర్పు కాదిది. కానీ ఏమి చేస్తాం, ఇలాంటి వాటిపై మనం హైకోర్టులో పిటీషను వేయలేం కదా. నా ఉద్దేశంలో పై రెండు సంఘటనలకు పెద్ద తేడాలేదు శిక్ష అమలు చేసిన వారిలో తప్ప. ఒకరు (పోలీసులు) చట్టపరంగా అందుకు అర్హులు రెండోవారు (శ్రీరామ సేన) అనర్హులు. పై రెండు ఘటనలవల్ల సమాజానికి చివరికి జరిగేది నష్టమే.


ఇప్పుడు మంగుళూరు సంఘటన కాకుండా డావిన్సీ కోడు సినిమా, దాని మీద జరిగిన వివాదం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ చిత్రం విడుదలకు అన్ని క్రైస్తవసంఘాలు కాదన్నాయి. విడుదలైన చోట్ల బాగా గొడవలు చేసారు. మంగుళూరు ఘటనకు ఈ గొడవలకు ఏమైనా తేడా ఉన్నదా? ఆ చిత్రం ఏసు గురించి మనకు తెలిసిన నిజాలను కాక మరికొన్ని నిజాలను మనకు చెబుతుంది. ఆ చిత్రం తీసిన నిర్మాతలు (నవల రచయిత) ఆ నిజాల గురించి ఎంతో శోధించి శాస్త్రోక్తంగా ఎన్నో తెలియని విషయాలను నిరూపించి అప్పుడు ఆ చిత్రాన్ని విడుదల చేసారు. ఆ చిత్రాన్ని ఎన్నో క్రైస్తవ దేశాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదలకు అంగీకరించాయి. చివరికి పోపుకూడా అందుకు అంగీకరించాడు. కానీ అదేంటో భారతదేశంలో మాత్రం ఆ చిత్రాన్ని విడుదల చేయనివ్వలేదు. ఆ చిత్రం చూసినందువల్ల నష్టమేమీలేదని స్వయంగా పోపుగారు అంగీకరించారు. కానీ మన కోర్టులు అందుకు అంగీకరించలేదు. అదే మన సంస్కృతిని కాపాడుదామని ప్రయత్నిస్తే మాత్రం అది అన్ని విధాలా స్వేఛ్ఛకు ఆటంకం అయ్యింది. ఆ చిత్రాన్ని విడుదల చేయాల్సినప్పుడు ఏమైంది ఆ వ్యక్తిగత స్వేఛ్ఛ? ఏమైంది ఆ సెక్యూలరిజం అన్న పదం? పోలీసులు అసభ్యంగా ఉన్నదని కేసు పెట్టారు, మరి అప్పుడు కావలసిన వ్యక్తిగత స్వేఛ్ఛ చిత్రాన్ని (నిర్మాత విడుదల) చేయాల్సినప్పుడు ఏమైంది? ఇది చూసి కూడా మీరు భారతదేశంలో ఇంకా సెక్యూలరిజం ఉన్నది అనుకుంటే పొరబడినట్లే.

 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post_17.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి