27, నవంబర్ 2012, మంగళవారం

క్రైస్తవులు ఇలా ప్రవర్తిస్తున్నారు!


బైబుల్లో కొత్త నిబంధనలను, పాత బైబుల్ నమ్మె యూదులు ఒప్పుకోరు. ఈ కొత్త నాలుగు సువార్తలకు రచయితలు మాత్యు, మార్క్, లూక్, జాన్ వీరంతా జీసెస్ తరువాత 70 నుండి 100 సంవత్సరాలలోపు రచనలు చేశారు. వీటిలో ముగ్గురికి దగ్గర పోలికలున్నా, జాన్ సువార్త తేడాగా ఉంటుంది. క్రీస్తు బాల్యంపై చరిత్రలో ఆధారాలు లేవు. జీసెస్ పేరిట రాసిన అద్భుతాలు అన్ని కథలే. మార్క్ సూవార్తలో క్రీస్తును శిలువ వేయడం వివరంగా రాయగా, మిగిలినవారు ఆయనను అనుకరించారు. ఇక జీసెస్ చనిపోయి, భూస్థాపితమైన తరువాత తిరిగి లేచి రావటం పెద్ద కథ. క్రీస్తును చివరిదశలో అనుసరించిన మగ్ధలీనా పిచ్చిదని, పూనకం, భ్రమకు ఆమెకు ఉన్నాయని మార్క్ అన్నాడు. కేవలం మాత్యూ మాత్రమే తూర్పు దిశనుండి వివేకులు కాస్పర్, మెకైర్, బాల్తసార్ ప్రస్థావన తెచ్చాడు.
బైబుల్లో పరస్పర విరుద్ధాలు 500 వరకు ఉన్నాయని చరిత్రకారులు జాబితా వేసి చూపారు. మొత్తం మీద క్రీస్తు జీవితం గురించి సమకాలీన చరిత్ర ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. అయినా భక్తులు నమ్మి అనుసరించటంసరేసరి. క్రీస్తు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆయనకు సంబంధించిన వస్తువులు, సమాధిలో అవశేషాలు, ఆయన శవానికి కప్పిన వస్త్రం, శిలువ వేసినప్పుడు కారిన రక్తం, అది పట్టడానికి వాడిన పాత్ర ఇలాంటివన్నీ లభించినట్లు ఇప్పుడు అనేక చోట్ల పదర్శిస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజం అంటే ఏ ఒక్క ఆధారమూ రుజూవుకు నిలబడటం లేదు. చివరకు మేరీ జుట్టు, మర్దలీనా శరీర అవశేషాలు, పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వివిధ గుడులలో, వివిధ దేశాలలో చూపి భక్తులను ఆకర్షించి డబ్బు దండుకుంటున్నారు. ఆశ్చర్యమేమంటే క్రీస్తు చనిపోయిన తరువాత ఇవన్నీ వెయ్యి సంవత్సరాలకు యూరప్ లో వివిధ ప్రాంతాల్లో బయటపడ్డట్లు, వ్యూహాత్మకంగా చూపటం పేర్కొనదగింది.


జో నికిల్ ఇలాంటివన్నీ ఎంత బూటకాలో పరిశోధించి భయటపెట్టాడు. చివరకు జీసెస్ క్రైస్ట్ రూపం సైతం వ్యూహా జనితాలని, అతని సమకాలీనులెవరు ఆయన్ను రూపాన్ని వర్నించలేదని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు రాసిన నలుగురు ఆయన్ని గురించి వర్నించలేదు.


క్రీస్తుకి గడ్డం, జుట్టు మొదలైనవన్నీ ఉత్తరోత్తర గీసిన చిత్రాలే. 


 http://naprapamcham.blogspot.in/2009/07/blog-post_28.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి