27, నవంబర్ 2012, మంగళవారం

నెమలి సింహాసన రాజ్యంలో మనుషుల వేట




నెమలి సింహాసనాన్ని అదిష్టించిన ఇరాన్ షా దేశాన్ని ఆధునీకరణం చేయడానికి అనేక నిరంకుశ పద్ధతులను అవలంభించాడు. శ్వేత విప్లవం తేవాలని కలలుగన్న షా, అతి త్వరగా, వేగంగా దేశాన్ని ఆధునీకరణం చేయాలని ప్రయత్నించాడు. విపరీతంగా ధనం ఖర్చు చేశాడు. పాశ్చాత్య విదానాలు అన్ని రంగాలలో ప్రవేశపెట్టాడు. యువకులకు విద్యార్ధులను రెచ్చగొట్టి, లాభాలను ఆర్జించే ఆక్రమ వ్యాపారస్తులను అరికట్టమన్నాడు. అలాంటి అవకాశం యిచ్చేసరికి యువకులు హింసాత్మక చర్యలకు దిగారు. మత గురువుల దగ్గర భూములు లాగేసి రైతులకు పంచాడు. అంతటితో ఆగక, ఇరాన్లో వ్యవసాయ రంగాన్ని సమిష్టి కరణ చేయాలని 1975లో ఉపక్రమించాడు. దేశ వ్యాప్తంగా 2800 సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు స్థాపించి, రైతుల భూముల్ని యీ సమిష్టి వ్యవసాయంలో షా, నిర్భంధంగా కలిపేశాడు. దేశంలో పెద్ద కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, చిన్న గ్రామాలన్నీ పునర్వ్యవస్థీకరించి, చిన్నా భిన్నం చేశాడు. భూమిపై హక్కు రాజ్యానిధన్నాడు. ఈ విధంగా చేసేసరికి రైతులు అయిష్టంగా నిర్భంద వ్యవసాయంలో పాల్గొన్నారు. కాని యువకులు నగరాలలో ప్రవేశించి అయొతుల్లా ఖోమినీ మద్దత్తు దారులుగా ఆందోళనకు ఉపక్రమించారు. షా చాలా మందిని జైల్లో పెట్టి, చిత్ర హింసలకు గురిచేసినా, ఆందోళన పెరిగిందేకాని ఆగలేదు. చివరికి దేశం వదలిపోవలసిన గతి షాకు పట్టింది.


ఫ్రాన్స్ లో వుంటూ, ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్న అయొతుల్లా ఖొమినీ వచ్చి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇస్లాం మౌలిక వాదం పేరిట 1979 ఫిబ్రవరి నుండి ఖొమినీ చిత్ర హింసలు, నరమేధం ప్రారంభించాడు. అది ఇప్పటికీ కొనసాగుతూనే వున్నవి.


షా చేసిన ఆధునీకరణ అంతా మార్చేసి, స్ర్తీలను ముసుగులు వేసుకోమన్నారు. అల్లా శత్రువులనే పేరిట ఇస్లాం న్యాయస్థానాలలో మొదటి రెండేళ్ళలో ఖొమినీ 8 వేల మందిని చంపించాడు. అంతర్జాతీయంగా ఎందరు అభ్యంతరం పెట్టినా ఖొమినీ లెక్కచేయలేదు. షా హయాంలోని 23 సైనిక జనరల్స్ను 400 మంది సైనిక పోలీస్ అధికారులను, 800 మంది పాలనాధికారులను చంపేశారు. ఖొమినీకి వ్యతిరేకంగా వున్న మతాధిపతుల మద్దత్తుదారులలో 700 మందిని ఉరితీశారు. నామపక్షం వారిని 100 మందిని, ఉదారవాదుల్ని 500 మందిని చంపేశారు.


ఇరాన్లో అల్ప సంఖ్యాకులుగా వున్న ఖుర్దు జాతిలో వెయ్యిమందిని హతమార్చారు. 200 మంది టర్కోమస్స్ ను చంపారు. యూదులు, క్రైస్తవులు, షేక్ లు సాబియన్లు, షియా నిరసనవాదుల్ని సనాతన సున్నీలను అరమరికలు లేకుండా చంపారు. బహాయ్ అల్ప సంఖ్యాకులను చిత్రహింసలకు గురిచేశారు. ఖుర్ద్ కవి అల్లామియా వహిచి మొదలు 9 ఏళ్ళ బాలిక వరకు చంపడం ఖొమినీ రాజ్య ప్రత్యేకత, ఇరాన్ చేస్తున్న చిత్ర హింసలు సున్నీలపై పెరిగిపోగా, పొరుగు రాజ్యం ఇరాన్ యుద్ధానికి దిగింది. 3 సంవత్సరాలు ఈ యుద్ధం సాగింది. ఇరు దేశాలలో వందల వేల పౌరులు, సైనికులు నిరంతరం చనిపోయారు. ఇదంతా ఇస్లాం మౌలికవాదం పేరిట జరుగుతున్న దమనకాండే.


 http://naprapamcham.blogspot.in/2007/08/12.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి